Showing posts with label వై. యస్.రాజశేఖరరెడ్డి. Show all posts
Showing posts with label వై. యస్.రాజశేఖరరెడ్డి. Show all posts

Tuesday, August 24, 2010

మీఅందరి మధ్యలో పెరిగినోణ్ని .. తిరిగినోణ్ని..

 పులివెందుల్లో నేను మీ అందరి మధ్యనే పెరిగినోణ్ని ... మీ అందరి మధ్యనే తిరిగినోణ్ని... మీ ఆప్యా యత వల్లే చిరునవ్వుతో మీ ముందుకు వచ్చానని ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఎంపీ జగన్ సోమవారం పులివెందుల నియోజక వర్గంలో ఓదార్పు యాత్ర ప్రారంభించారు. ముందుగా ఆయన ఇడుపులపాయ నుండి పులివెం దులకు చేరుకుని ఓ పెట్రోల్ బంక్‌ను ప్రారంభించారు. అనంతరం కడప రహదారిలోని రింగు రోడ్డు కూడలిలోను, బస్టాండ్ సర్కిల్ సమీపంలోను, పార్నపల్లె రహదారి సమీపంలోని రింగు రోడ్డు సర్కిళ్ల్ల వద్ద ఏర్పాటు చేసిన వైయస్ విగ్రహాలను ఆయన ఆవిష్కరిం చారు.

ఈ సందర్బంగా మాట్లా డుతూ పులివెందుల పట్టణానికి నలువైపులా నాన్న విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. ఓదార్పు యాత్రలో భాగంగా రాష్ట్రంలో ఎన్నో జిల్లాల్లో తిరిగినా. కానీ ఇక్కడ మీరు చూపుతున్న ప్రేమ , అభిమానం, ఆప్యాయతలే నన్ను మీ ముందుకు చిరునవ్వుతో నిలిపాయన్నారు. మీ ఆప్యాయతకు, ఆదరాభిమానాలకు చేతులెత్తి పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డికి అందించిన ప్రేమానురాగాలను నాపై కూడా చూపించాలని అభ్యర్థిస్తున్నానన్నారు.

గత 9 నెలలుగా రాష్ట్రంలో ఏం జరుగుతోందో ప్రతి ఒక్కరికీ తెలుసు ను. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు పత్రికల్లో , టీవీల్లో చూస్తున్నారన్నారు. పట్టణ శివార్లలో విగ్రహాల ఏర్పాటుకు ఇంత మంది ఏకమయ్యారంటే వైయస్ ఎక్కడు న్నారనే ప్రశ్నకు ప్రతి గుండెలో వైయస్ ఉన్నారన్నారు. ఇక్కడి వారి అందరి గుండె లబ్‌డబ్ లబ్‌డబ్ అని కొట్టుకోవడం లేదని, ప్రతి గుండె వైయస్సార్ వైయస్సార్ అంటూ కొట్టుకుంటోందన్నారు.

అనంతరం జగన్ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వైయస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం నల్లపు రెడ్డిపల్లె మీదుగా జగన్ ఓదార్పు యాత్ర సాగింది. నల్లపు రెడ్డిపల్లెలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. నల్లగొండు వారిపల్లె మీదుగా వెళుతున్న జగన్ కాన్వాయ్‌ను ఆపి జగన్‌కు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఆయనకు ఆ గ్రామస్థులు సమస్యలను విన్నవించారు. అనంతరం అంబక పల్లె గ్రామానికి చేరుకున్నారు. ఆ గ్రామంలో నెలకొన్న సమస్యలను గ్రామ ప్రజలు ఆయన దృష్టికి తెచ్చారు. ఈ సమస్యలన్నీ జగన్ ఓర్పుతో విన్నారు. అనంతరం మురారిచింతల , దిగువపల్లె, ఎగువ పల్లె, పార్నపల్లె తదితర గ్రామాల్లో ఆయన పర్యటించారు. 


జగన్ వెంట ఆరుగురు ఎమ్మెల్యేలు
ఓదార్పు యాత్రలో కడప జిల్లా రాజంపేట, రాయచోటి, బద్వేల్, రైల్వే కోడూరు, జమ్మలమడుగు ఎమ్మెల్యేలు అమరనాథ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కమలమ్మ, కొరముట్ల శ్రీనివాసులు, ఆదినారాయణ రెడ్డిలతో పాటు అనంతపురం జిల్లాకు చెందిన గురునాథ రెడ్డిలు పాల్గొన్నారు.

వీరితో పాటు జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి అహ్మదుల్లా కుమారుడు అష్రఫ్ కూడా జగన్‌ను కలిసి వెళ్లారు. తాను రాజమండ్రికి వెళ్తున్నానని జగన్‌కు ముందే చెప్పానని.. ఆయన ఆమోదం పొందానని.. మంగళవారం నుంచి ఓదార్పులో పాల్గొంటానని మంత్రి అహ్మదుల్లా ప్రకటించడం పార్టీలో చర్చనీయాంశమైంది. మంత్రిగా ముఖ్యమంత్రి అనుమతిని తీసుకుంటారా.. లేక.. జిల్లా ఎంపీ ఆమోదం పొందుతారా? అనే సందేహం పార్టీలో నెలకొంది.

ప్రకాశం జిల్లా పర్యటన గురించి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో మాట్లాడిన ముఖ్యమంత్రి రోశయ్య.. ఇప్పుడు అహ్మదుల్లాతోనూ మాట్లాడతారా అనేది అసక్తికరంగా మారింది. జడ్పీ చైర్మన్ జ్యోతిరెడ్డి, డీసీసీబీ చైౖర్మన్ పల్లం బ్రహ్మానంద రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సురేష్‌బాబు, పులివెందుల మునిసిపల్ చైర్‌పర్సన్ రుక్మిణిలు కూడా హాజరయ్యారు. వీరితో పాటు ఆయన జగన్ కుటుంబ సభ్యులు భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, డాక్టర్ ఈసీ గంగిరెడ్డిలు కూడా ఓదార్పు యాత్రలో పాల్గొన్నారు.

జగన్ బాబాయి.. ఎమ్మెల్సీ వివేకానందరెడ్డి మొదటి రోజు ఓదార్పు యాత్రలో కనిపించలేదు. ఇటీవల సోనియాకు రాసిన లేఖ రాజకీయ దుమారం రేపిన నేపథ్యంలో ఆయన గైర్హాజరు చర్చనీయాంశమైంది. అయితే.. అమెరికాలో కూడా వైఎస్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించనున్నందున ఆ ఏర్పాట్ల కోసం హైదరాబాద్ వెళుతున్నానని ముందు రోజే వివేకా చెప్పారు. జిల్లాకు చెందిన సీనియర్ శాసనసభ్యులు డీఎల్ రవీంద్రారెడ్డి, వీరశివారెడ్డిలు ఓదార్పునకు దూరంగా ఉన్నారు. కోస్తాతో పోలిస్తే సొంత జిల్లాలో ఓదార్పునకు అంతస్థాయిలో జన స్పందన కనిపించలేదు.

నలుగురికి ఓదార్పు
మొదటి రోజు నాలుగు కుటుంబాలను జగన్ ఓదార్చారు. పులివెందుల్లో దేరంగుల జయరామ్ అనే వ్యక్తి వైఎస్ మృతి చెందిన ఆరు రోజుల తర్వాత చనిపోయారు. అలాగే అంబకపల్లెలో లోమడ వెంగముని అనే వృద్ధ్దుడు వారం తర్వాత చనిపోయాడు. ఈ ఇద్దరి కుటుంబాలను జగన్ పరామర్శించారు. అలాగే దిగువ పల్లెలో చాపల వెంకటరమణ అనే వ్యక్తి కుటుంబాన్ని, పార్నపల్లెలో మృతి చెందిన అంకె పుల్లన్న అనే వ్యక్తి కుటుంబాలను కూడా జగన్ ఓదార్చారు. వీరితోపాటు ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన మరో నలుగురి కుటుంబాలను కూడా ఆయన పరామర్శించారు.

ఓపిగ్గా, ఓర్పుగా సాగిన ఓదార్పు
పులివెందులలో జగన్ ఓదార్పు యాత్ర ఓర్పుగా, ఓపిగ్గా సాగింది. ఉదయం 8.30 గంటలకు మొదలై మధ్యాహ్నం ఒకటిన్నరకు పూర్తి కావాల్సి ఉండగా 10.30 గంటలకు మొదలై రాత్రి 7.30 గంటలకు కూడా పార్నపల్లెకు చేరుకోలేక పోయారు. ఆలస్యం కావడంతో వేముల ఓదార్పును రద్దు చేసుకున్నారు. మార్గమధ్యంలో వివిధ గ్రామాల ప్రజలతో మాట్లాడుతూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకుని, ఫిర్యాదులు స్వీకరించారు. పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.

పెద్దకుడాలలో జిలిటెన్‌స్టిక్స్ లభ్యం
ఓదార్పు యాత్రకు ముందుగా లింగాల మండలం పెద్దకుడాలలో పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం జగన్ ఓదార్పు యాత్రలో భాగంగా పెద్దకుడాలలో వైఎస్ విగ్రహావిష్కరణ జరగాల్సి ఉంది. దీనికి కొన్ని గంటల ముందే విగ్రహం ఏర్పాటు చేసిన సమీప ప్రాంతంలో 52 జిలిటెన్‌స్టిక్స్‌ను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతాన్ని ఏఎస్పీ కార్తికేయన్ పరిశీలించారు. పలు కోణాల్లో వీటిపై పరిశీలన చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

Saturday, July 10, 2010

నాతో తిరగొద్దంటారా? ఓదార్పులో జగన్ ఆగ్రహం - మాటలు పేల్చిన జగన్: తిప్పి కొట్టిన లీడర్స్ - సీమ ఎమ్మెల్యేలతో మంతనాలు

కట్టడి చేయడం న్యాయమా?
వైఎస్‌ను అభిమానించడం నేరమా?
ఓదార్పులో పాల్గొనలేక నరకయాతన
భార్య, తమ్ముళ్లను పంపుతున్న ఎమ్మెల్యేలు
నా మాట కూడా మూగబోయింది
(శ్రీకాకుళం) కడప ఎంపీ జగన్ తన స్వరం మరింత పెంచా రు. రాష్ట్ర నాయకత్వంతోపాటు, అధిష్ఠానంపైనా సూటిగా బాణాలను సంధించారు. శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న ఓదార్పు యాత్ర మూడో రోజున జగన్ మాటల్లో ఆక్రోశం, ఆగ్రహంతోపాటు ఒకింత ఆవేదన స్పష్టంగా కనిపించింది. వైఎస్ మృతిపై తనకు ఇప్పటికీ సందేహాలున్నాయనే సంకేతాలు పంపారు.

ఆయన దుర్మరణంపై సమగ్ర విచారణ ఎందుకు జరిపించలేకపోయారని జగన్ నిలదీశారు. శనివారం ఆయన వీరఘట్టంలో వీరావేశంతో ప్రసంగించారు. తన యాత్రలో పాల్గొనాలని ఉన్నా... పాల్గొనలేక ఎమ్మెల్యేలు నరక యాతన అనుభవిస్తున్నారని అన్నారు.

"వారి మనసంతా వైఎస్‌తోనే ఉంది. కానీ... యాత్రలో పాల్గొనలేక నరకయాతన అనుభవిస్తున్నారు. వాళ్లు రాలేక... భార్యలను, తమ్ముళ్లను నాతో పంపుతున్నారు. వైఎస్‌ను ప్రేమించడం అంత అన్యాయమైన పనా? ఎందుకు? ఆ ఎమ్మెల్యేలను అంత నరకం అనుభవించే పరిస్థితిని ఎందుకు తీసుకొస్తున్నారు?

తూర్పు గోదావరి జిల్లా గురించి ఈ రోజే నాకు తెలిసింది. అక్కడ కూడా అంటున్నారట! ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరూ నాతో తిరగొద్దని అంటున్నారట! వారిని కూడా కట్టడి చేసే కార్యక్రమం జరుగుతోందట. ఇది న్యాయమేనా?'' అని ప్రశ్నించారు.

వైఎస్ అనుక్షణం ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసి అమరులయ్యారని... అలాంటి నేత జయంతి కార్యక్రమానికి ఎమ్మెల్యేలను నియోజకవర్గాలకు పంపించకుండా అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. "శ్రీకాకుళం జిల్లాలోని ఎమ్మెల్యేలు, మంత్రులకు ఓదార్పు యాత్రకు వెళ్లొద్దని చెప్పినప్పటికీ వారి కుటుంబ సభ్యులు వైఎస్‌పై అభిమానంతో వస్తున్నారు.

కొందరు వారికి కూడా హెచ్చరికలు పంపే పనిలో ఉన్నారు'' అని జగన్ ఆరోపించారు. శనివారం జగన్ హిర మండలం, మదనాపురం, గొయిది, సీతంపేట, ఎం.సింగుపురం, నవగాం, వీరఘట్టం, కంబర తదితర ప్రాంతాల్లో వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించి ప్రసంగించారు.

అంతకుముందు ఆముదాలవలసలో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి పదవికి సంబంధించి తన ఆకాంక్షను స్వల్పంగా బయటపెట్టారు. 'జగన్ ముఖ్యమంత్రి కావాలి' అని అభిమానులు నినదించగా... 'ప్రతి గుండె చప్పుడు ఆ భగవంతుడికి వినిపిస్తుంది' అంటూ జగన్ చిరునవ్వులు చిందించారు. పాలకొండ నుంచి ప్రారంభమెన మూడోరోజు ఓదార్పు యాత్రలో వైఎస్ విగ్రహాల ఆవిష్కరణకు ప్రాధాన్యం ఇచ్చారు.

పాలకొండలో జడ్పీ అ«ధ్యక్షుడు పాలవలస రాజశేఖరం ఇంట్లో రెండు గంటలపాటు గడిపారు. యాత్రలో శ్రీకాకుళం జిల్లాలోని ద్వితీయ శ్రేణి నాయకత్వం ప్రాధాన్యం కూడా తగ్గింది. రాయలసీమ ప్రాంతానికి చెందిన నేతల హవా బాగా కనిపించింది.

రేపటి నుంచి 'తూర్పు'లో ఓదార్పు
జగన్ ఆదివారం రాత్రి తూర్పుగోదావరి జిల్లాకు చేరుకోనున్నారు. శ్రీకాకుళం నుంచి కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో తుని చేరుకొని అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా అన్నవరం వెళ్లి బస చేస్తారు. సోమవారం తొండంగి మండలం నుంచి ఓదార్పు యాత్రను జగన్ చేపట్టనున్నారు. 

మాటలు పేల్చిన జగన్: తిప్పి కొట్టిన లీడర్స్

* ఓదార్పు యాత్రలో పాల్గొనాలని ఎంతోమంది మంత్రులు, ఎమ్మెల్యేలకు గాఢంగా ఉంది. వారి మనసంతా వైఎస్‌తోనే ఉంది. కానీ... యాత్రలో పాల్గొనలేక నరకయాతన అనుభవిస్తున్నారు. వాళ్లు రాలేక... భార్యలను, తమ్ముళ్లను నాతో పంపుతున్నారు.

* తూర్పు గోదావరి జిల్లా గురించి ఈ రోజే నాకు తెలిసింది. అక్కడ కూడా అంటున్నారట! ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరూ నాతో తిరగొద్దని అంటున్నారట! వారిని కూడా కట్టడి చేసే కార్యక్రమం జరుగుతోందట. ఇది న్యాయమేనా? ఈ విషయం తెలుసుకున్నాక నా మాట మూగబోయింది.

* వైఎస్‌ను ప్రేమించడం అంత అన్యాయమైన పనా? వైఎస్‌పై అభిమానం పెంచుకున్న వాళ్లంతా నేరస్థులా? ఆ ఎమ్మెల్యేలకు అంత నరకం అనుభవించే పరిస్థితిని ఎందుకు తీసుకొస్తున్నారు?

* వైఎస్ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసి అమరులయ్యారు. అలాం టి నేత జయంతి కార్యక్రమానికి ఎమ్మెల్యేలను నియోజకవర్గాలకు పంపించకుండా అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం?

* వైఎస్ మరిలేరన్న చేదు నిజం విని గుండె ఆగి చనిపోయిన వారు కాంగ్రెస్ కార్యకర్తలు కారా? వారి కుటుంబాల గురించి ఎవరైనా పట్టించుకున్నారా? ఓదార్పు అందరి బాధ్యత కాదా?

* రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి పరిస్థితులు చూసి గుండె బరువెక్కుతోంది!

* యాత్రకు వెళ్ళొద్దని అధిష్ఠానం సూచన చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మిత్రులంతా దీనిని పాటిస్తారని అనుకుంటున్నా. యాత్రకు సంబంధించి హైదరాబాద్, ఢిల్లీల్లో నేను ఒకే వివరణ ఇచ్చినా మాట మార్చినట్లుగా కొన్ని ప్రసార సాధనాల్లో రావడం ఆశ్చర్యకరం.

* జగన్ యువకుడు, మంచి భవిష్యత్తు ఉంది. ఆయనను కొడుకుతో సమానంగా భావిస్తున్నా నే తప్ప ఎలాంటి శత్రుత్వం లేదు. కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రిని ఎంపిక చేయడానికి ఒక సంప్రదాయం ఉందన్న విషయాన్ని గ్రహించాలి. - ముఖ్యమంత్రి రోశయ్య

* ఓదార్పు అంటే రాహుల్ చేసినట్లు నిరాడంబరంగా ఉండాలి. కానీ జగన్ వెళుతున్నట్టుగా పెళ్లి ఊరేగింపులా డప్పులు, డ్యాన్సులు, జిం దాబాద్‌లతో కాదు. ఎమ్మెల్యేలు చక్కగా అసెంబ్లీకి వస్తే, నరక యాతన అనుభవిస్తున్నారన డం సమంజసం కాదు. ప్రచారం, రవాణా సౌకర్యాలు కల్పిస్తే ఎవరి సభకైనా జనాలు వస్తారు. రాజకీయాలు ఈ 9 నెలల్లోనే అత్యున్నత స్థాయికి ఎదిగాయి. రాజకీయాలు భ్రష్టు పట్టినట్లు ఆయనకొక్కరికే కనిపిస్తోంది. జగన్‌కు మీడియా ఇస్తున్న కవరేజి చూస్తే ఇదేదో ప్యాకేజీలా ఉంది. - వీహెచ్

* ఓదార్పు యాత్రకు వెళ్లొద్దని మంత్రులు, ఎమ్మెల్యేలను ఎవరూ అడ్డుకోలేదు. యాత్రలో పాల్గొనే విషయంలో ప్రభుత్వ, పార్టీ పరంగా ప్రజాప్రతినిధులపై ఎలాంటి ఆంక్షలు లేవు. పాల్గొనకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణల్లో వాస్తవం లేదు.
 - మంత్రి శ్రీధర్ బాబు

సీమ ఎమ్మెల్యేలతో మంతనాలు
జగన్‌తో 11 మంది ఎమ్మెల్యేల భేటీ

( శ్రీకాకుళం) రాయల సీమ ప్రాంతానికి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు శనివారం జగన్‌తో భేటీ అయ్యారు. ఓదార్పు యాత్రలో పాల్గొనేందుకు వీరు శనివారం జిల్లాకు వచ్చారు. పాలకొండలో జెడ్పీ చైర్మన్ పాలవలస రాజశేఖరం ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్న జగన్‌ను కలిసి, మంతనాలు జరిపారు.

వీరిలో జి.శ్రీకాంత్‌రెడ్డి, ఆళ్ల నాని, గురునాధరెడ్డి, బి.శివప్రసాదరెడ్డి, శ్రీనివాసులురెడ్డి, రుషి, ముత్యంరెడ్డి, ఆదినారాయణ, వెంకటస్వామి, అమరనాధ్‌రెడ్డి, నర్సిరెడ్డి, గుంటూరు, పాలకొల్లు ఎఎంసీల చైర్మన్‌లు నర్సిరెడ్డి, దత్తాత్రేయ వర్మ తదితరులు ఉన్నారు. శుక్రవారం నాటి ఓదార్పు యాత్రలో జగన్ చేసిన వ్యాఖ్యలపై మీడియాలో వచ్చిన కథనాలు, పార్టీ నేతల అభ్యంతరాలు తదితర అంశాలపై వారు చర్చించినట్టు తెలిసింది.

ఈ పరిస్థితిలో మరింత ముందుకు వెళ్లాలంటే చెప్పాలనుకున్నది సూటిగా వ్యక్తీకరించాల్సిందేనని వారు సూచించారు. వీరఘట్టంలో చేసిన వ్యాఖ్యల వెనుక ఈ ప్రభావం కూడా ఉందని తెలుస్తోంది. ఈ నేతలతో భేటీ జరిగిన తర్వాతే జగన్ ప్రసంగంలో మార్పు రావడం విశేషం.

సీఎం కావాలని నినాదాలు
ఓదార్పు యాత్ర ప్రారంభం నుంచి ఆలస్యంగా జరుగుతుండడంతో జగన్ రాత్రి వేళ కూడా కంటి మీద కునుకు లేకుండా పర్యటిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున 3గంటలకు ఆమదాలవలస చేరుకొన్న జగన్‌కు మున్సిపల్ చైర్మన్ బొడ్డేపల్లి రమేష్, ఎంపీపీ బి.గోవిందగోపాల్, జడ్‌పీటీసీ సభ్యురాలు బి.మాధురి స్వాగతం పలికారు. జగన్ ప్రసంగిస్తున్న సమయంలో ఆయన సీఎం కావాలంటూ కొంతమంది నినాదాలు చేశారు. అది విని మీ గుండె చప్పుడు ఆ దైవం వింటారంటూ విశ్వాసం వ్యక్తం చేశారు.

జగన్ వెంటే మేమూ
రాజాం/రాజాం రూరల్: జగన్ వెంటే తాముంటామని కడప, అనంతపురం, ఖమ్మం, వరంగల్ జల్లాల ఎమ్మెల్యేలు ఆదినారాయణ, గురునాధరెడ్డి, ముత్యంరెడ్డి, శ్రీనివాసులరెడ్డి తదితరులు అన్నారు.

శనివారం జగన్మోహన్‌రెడ్డి ఓదార్పులో పాల్గొనేందుకు వారు శ్రీకాకుళం జిల్లా రాజాం వచ్చారు. ఈ సందర్భంగా 'ఆన్‌లైన్'తో మాట్లాడుతూ... జగన్‌కు వస్తున్న ఆదరణ చూస్తే.. రాష్ట్ర కాంగ్రెస్‌లో మంచి నాయకుడు అవుతాడనే నమ్మకం కలుగుతున్నదన్నారు. బయటకు వెళ్లి, వేరే పార్టీ పెట్టే ఆలోచన జగన్‌కు ఏమాత్రం లేదన్నారు.

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రోశయ్య జగన్ యాత్రపై నిమిషానికి ఓ మాట మార్చడం ఎంతమాత్రం తగదని ఎమ్మెల్యేల బృందం పేర్కొన్నది. కొడుకుగా అభిమానించి ఆశీర్వదించాలే తప్ప ఈ విషయాన్ని రాజకీయం చేయకూడదని, అధిష్ఠానానికి యాత్రపై సరైన సూచన ఇవ్వాలని వారు అభిప్రాయపడ్డారు.

మూడో రోజూ కనిపించని స్థానిక ఎమ్మెల్యేలు
శ్రీకాకుళం జిల్లా ఓదార్పు యాత్రలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ మూడో రోజు కూడా పాల్గొన లేదు. ప్రభుత్వ విప్ కొండ్రు మురళీ మోహన్ వస్తారనుకున్నా.. ఆయన కూడా రాలేదు. స్థానిక ఎమ్మెల్యేలు ఎవరూ లేకుండా వారి కుటుంబ సభ్యులు పాల్గొనడం జగన్‌కు ఆగ్రహం తెప్పించింది.
జగన్‌ వెంటే మేము
askingవైఎస్‌ జగన్‌ నిర్వహిస్తున్న ఓదార్పు యాత్రకు తమ పూర్తి మద్దతు ఉం దని కడప, అనంతపురం ,దర్శి తదితర ప్రాంతాల ఎంఎల్‌ఏలు తెలిపారు. శనివారం శ్రీకాకుళం జిల్లా, రాజాంలో నిర్వహించిన జగన్‌ ఓదార్పు యాత్రలో వారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మేజర్‌న్యూస్‌తో మాట్లాడారు.అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా తామంతా జగన్‌కు బాసటగా నిలుస్తామని పేర్కొన్నారు. అయితే అధిష్ఠానం జగన్‌ యాత్రపై సానుకూలంగా సూచనలిచ్చిందే తప్ప వ్యతి రేకించలేదన్నారు. జగన్‌ యాత్రకు ప్రజా స్పందన ఎలా ఉందనేది స్వయంగా పరిశీలించేందుకే తాము వచ్చామని, ప్రజలనుంచి అనూహ్య స్పందన రావడం హర్షదాయకమన్నారు.

వైఎస్‌ మృతి చెందిన సమయంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌, సోనియా గాంధీ, రాహుల్‌గాంధీలు తరలివచ్చి వైఎస్‌ కుటుంబాన్ని ఓదార్చి తామున్నామంటూ భరోసా ఇచ్చారని, అదే స్పూర్తితో జగన్‌ తన తండ్రి మరణ వార్తవిని ప్రాణాలు విడిచిన కుటుంబాలను ఓదార్చి తానున్నానంటూ భరోసా ఇస్తున్నారన్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ యాత్ర కొనసాగిస్తున్నారే తప్ప ఇందులో ఆక్షేపించాల్సింది ఏముందని వా రు ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య వైఎస్‌ జగన్‌కు దిశదశ నిర్దేశించాలే తప్ప రోజుకో మాటమార్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కొడుకుగా భావించి ఆశీస్సులు అందజేసి జగన్‌ యాత్రపై అధిష్ఠానానికి సానుకూల సంకేతాలు ఇవ్వాలన్నారు. మేజర్‌న్యూస్‌తో మాట్లాడిన వారిలో కడప, జమ్మలమడుగు, అనంతపూర్‌, ఖమ్మం జిల్లాలకు చెందిన ఆదినారాయణరెడ్డి, గురునాధరెడ్డి, ముత్యంరెడ్డి, శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Thursday, July 8, 2010

నాడు వనం.. నేడు జనం

Ysrజులై 8...ఒక మహానేత జయంతి... జనం కోసమే జనించిన ఒక రాజకీయ రాజసయోధుడు..పేదల పక్షపాతి పుట్టిన రోజు.చరిత్ర మరవని చరితను సొంతం చేసుకున్న యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి..వైఎస్సార్‌ ఈ గడ్డపై అడుగిడిన రోజు. పుట్టిన రోజును జరుపుకోవడానికి ఆయన లేడు. కానీ ఆయన జ్ఞాపకాలు మాత్రం ఇంకా ఉన్నాయి..ఉంటాయి కూడా... ఆయన మరణం తర్వాత భౌతికకాయాన్ని కడప జిల్లాలోని ఆయనకు ఇష్టమైన ప్రదేశం అయిన ఇడుపులపాయ ఎెస్టేట్‌లో ఖననం చేశారు. వైఎస్‌ బతికున్న రోజుల్లో ఎప్పుడు విడిది చేసినా ఇడుపులపాయలోనే గడిపేవారు.

ఆయనకు ఆ ప్రాంతం అంటే మక్కువ. ఆయన మరణం తర్వాత ఇడుపులపాయను వైఎస్‌ఆర్‌ ఎెస్టేట్‌గా పిలుస్తున్నారు. ఆ ప్రదేశంలో వైఎస్‌ స్థూపం ఏర్పాటుచేయడంతో పాటు పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. గతంలో కేవలం వైఎస్‌ కుటుంబ సభ్యులు మాత్రమే సందర్శించే ఈ ప్రాంతాన్ని ఇప్పుడు ప్రతిరోజు వందలాది మంది వైఎస్‌ అభిమానులు సందర్శిస్తుండడంతో ఇడుపులపాయ పర్యాటక ప్రాంతాన్ని తలపిస్తోంది. మరోవైపు ఆయన మరణించిన నల్లమల ప్రాంతంలోనూ వైఎస్‌ స్మారక పార్కు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించింది.

పచ్చని పంట పొలాలతో....
nallamalaచుట్టూ ఎత్తయిన కొండలతో.. పచ్చని తివాచీ పరిచినట్లుండే ప్రాంతం ఇడుపులపాయ. సుమారు 100 ఎకరాల్లో విస్తరించి కడపజిల్లా పులివెందుల నియోజకవర్గానికి 40 కిలోమీటర్ల దూరంలో వెంపల్లి మండలంలో ఈ ప్రాంతం ఉంది. వైఎస్‌ బతికున్నన్ని రోజులూ కడపకు ఎప్పుడు వెళ్లినా... ఇడుపుల పాయను సందర్శించేవారు. గతంలో సుమారు 600 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఎస్టేట్‌లో అసైన్డ్‌ భూములను వైఎస్‌ స్వయంగా పేదలకు పంచిపెట్టారు.

అభివృద్ధికి పెద్దపీట...
వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఇడుపులపాయను అభివృద్ధి చేసేందుకు నడుం బిగించారు. దానిలో భాగంగానే రూ.1,300 కోట్లతో ట్రిపుల్‌ ఐటి, రూ.100 కోట్లతో యోగి వేమన విశ్వవి
ద్యాలయం వెస్ట్‌ క్యాంపస్‌, రూ.8 కోట్లతో ఎకోపార్కు వంటి నిర్మాణాలతో ఆ ప్రాంతం అభివృద్ధికి వైఎస్‌ కృషిచేశారు. దీనితోపాటు ఇడుపులపాయనుంచి జిల్లాలో ఏర్పాటు చేసిన యోగివేమన వర్సిటీ వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం చేయాలని ప్రతి పాదిం
చారు. గోల్ఫ్‌ కోర్సు, ఇతర అభివృద్ధి పనులు కూడా జరగనున్నాయి. మరోవైపు వైఎస్‌ స్మారకార్థం ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా మలిచేందుకు ప్రభుత్వం యోచితస్తోంది.

పార్కు నిర్మాణం....
jagan-janamఇడుపులపాయలో వైఎస్‌ ఘాట్‌ను నిర్మించడంతో పాటు ఆ ప్రాంతాన్ని ప్రత్యేక పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. వైఎస్‌ ఉన్న సమయంలోనే నెమళ్ల పెంపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించారు. దానికోసం 67 నెమళ్లను కూడా ఆయన ఆర్డర్‌ చేశారు.ఆయన మరణానంతరం ఇక్కడ పార్కు నిర్మాణంతో పాటు విడిది ఏర్పాట్లను కూడా చేయాలనే ప్రతిపాదన ఉంది.

పావురాలగుట్టలోనూ...
సెప్టెంబర్‌2న వైఎస్‌ ప్రమాదంలో మరణించిన నల్లమల అడవిలోని పావురాలగుట్ట ప్రాంతాన్ని కూడా పర్యాటక ప్రాంతంగా మలిచేందుకు ప్రభుత్వం సన్నాహాలు మొదలు పెట్టిం ది. దీనికోసం 1,412 హెక్టార్ల నల్లమల రిజర్వ్‌ పారెస్ట్‌ ఏరియాను వైఎస్‌ స్మారక పార్కు నిర్మాణానికి కేటాయిస్తూ ప్రతిపాదనలు కూడా చేసింది. అలాగే నల్లమల అటవీప్రాంతానికి సమీపంలోని నల్లకాలువ గ్రామంలో రూ.3.15 కోట్ల వ్యయంతో వైఎస్‌ఆర్‌ స్మృతివనం ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం ప్రతిపాదించింది.

YSR-FAMILY-PHOTOSపావురాలగుట్టలో స్మారక స్థూప నిర్మాణం కూడా ఏర్పాటు చేయను న్నారు. ఈ ప్రాంతం పూర్తిగా అటవీ ప్రాంతం కావడం, ఇక్కడే వన్యప్రాణి సంరక్షణ ప్రదే శం కావడంతో పార్కు నిర్మా ణం మూలంగా వన్యప్రా ణులకు ఎలాం టి ఇబ్బందులు కలగకుం డా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖలు అనుమతిస్తే వెంటనే ఈ ప్రాజెక్టును ప్రారం భించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. త్వరలోనే ఈ బృహత్తర పథకం ప్రారంభమయితే ఈ ప్రాంతం రాష్ట్ర ప్రఖ్యాత పర్యాటక కేంద్రా లలో ఒకటి గా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.