Showing posts with label vijayamma. Show all posts
Showing posts with label vijayamma. Show all posts

Tuesday, August 24, 2010

మీఅందరి మధ్యలో పెరిగినోణ్ని .. తిరిగినోణ్ని..

 పులివెందుల్లో నేను మీ అందరి మధ్యనే పెరిగినోణ్ని ... మీ అందరి మధ్యనే తిరిగినోణ్ని... మీ ఆప్యా యత వల్లే చిరునవ్వుతో మీ ముందుకు వచ్చానని ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఎంపీ జగన్ సోమవారం పులివెందుల నియోజక వర్గంలో ఓదార్పు యాత్ర ప్రారంభించారు. ముందుగా ఆయన ఇడుపులపాయ నుండి పులివెం దులకు చేరుకుని ఓ పెట్రోల్ బంక్‌ను ప్రారంభించారు. అనంతరం కడప రహదారిలోని రింగు రోడ్డు కూడలిలోను, బస్టాండ్ సర్కిల్ సమీపంలోను, పార్నపల్లె రహదారి సమీపంలోని రింగు రోడ్డు సర్కిళ్ల్ల వద్ద ఏర్పాటు చేసిన వైయస్ విగ్రహాలను ఆయన ఆవిష్కరిం చారు.

ఈ సందర్బంగా మాట్లా డుతూ పులివెందుల పట్టణానికి నలువైపులా నాన్న విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. ఓదార్పు యాత్రలో భాగంగా రాష్ట్రంలో ఎన్నో జిల్లాల్లో తిరిగినా. కానీ ఇక్కడ మీరు చూపుతున్న ప్రేమ , అభిమానం, ఆప్యాయతలే నన్ను మీ ముందుకు చిరునవ్వుతో నిలిపాయన్నారు. మీ ఆప్యాయతకు, ఆదరాభిమానాలకు చేతులెత్తి పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డికి అందించిన ప్రేమానురాగాలను నాపై కూడా చూపించాలని అభ్యర్థిస్తున్నానన్నారు.

గత 9 నెలలుగా రాష్ట్రంలో ఏం జరుగుతోందో ప్రతి ఒక్కరికీ తెలుసు ను. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు పత్రికల్లో , టీవీల్లో చూస్తున్నారన్నారు. పట్టణ శివార్లలో విగ్రహాల ఏర్పాటుకు ఇంత మంది ఏకమయ్యారంటే వైయస్ ఎక్కడు న్నారనే ప్రశ్నకు ప్రతి గుండెలో వైయస్ ఉన్నారన్నారు. ఇక్కడి వారి అందరి గుండె లబ్‌డబ్ లబ్‌డబ్ అని కొట్టుకోవడం లేదని, ప్రతి గుండె వైయస్సార్ వైయస్సార్ అంటూ కొట్టుకుంటోందన్నారు.

అనంతరం జగన్ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వైయస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం నల్లపు రెడ్డిపల్లె మీదుగా జగన్ ఓదార్పు యాత్ర సాగింది. నల్లపు రెడ్డిపల్లెలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. నల్లగొండు వారిపల్లె మీదుగా వెళుతున్న జగన్ కాన్వాయ్‌ను ఆపి జగన్‌కు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఆయనకు ఆ గ్రామస్థులు సమస్యలను విన్నవించారు. అనంతరం అంబక పల్లె గ్రామానికి చేరుకున్నారు. ఆ గ్రామంలో నెలకొన్న సమస్యలను గ్రామ ప్రజలు ఆయన దృష్టికి తెచ్చారు. ఈ సమస్యలన్నీ జగన్ ఓర్పుతో విన్నారు. అనంతరం మురారిచింతల , దిగువపల్లె, ఎగువ పల్లె, పార్నపల్లె తదితర గ్రామాల్లో ఆయన పర్యటించారు. 


జగన్ వెంట ఆరుగురు ఎమ్మెల్యేలు
ఓదార్పు యాత్రలో కడప జిల్లా రాజంపేట, రాయచోటి, బద్వేల్, రైల్వే కోడూరు, జమ్మలమడుగు ఎమ్మెల్యేలు అమరనాథ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కమలమ్మ, కొరముట్ల శ్రీనివాసులు, ఆదినారాయణ రెడ్డిలతో పాటు అనంతపురం జిల్లాకు చెందిన గురునాథ రెడ్డిలు పాల్గొన్నారు.

వీరితో పాటు జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి అహ్మదుల్లా కుమారుడు అష్రఫ్ కూడా జగన్‌ను కలిసి వెళ్లారు. తాను రాజమండ్రికి వెళ్తున్నానని జగన్‌కు ముందే చెప్పానని.. ఆయన ఆమోదం పొందానని.. మంగళవారం నుంచి ఓదార్పులో పాల్గొంటానని మంత్రి అహ్మదుల్లా ప్రకటించడం పార్టీలో చర్చనీయాంశమైంది. మంత్రిగా ముఖ్యమంత్రి అనుమతిని తీసుకుంటారా.. లేక.. జిల్లా ఎంపీ ఆమోదం పొందుతారా? అనే సందేహం పార్టీలో నెలకొంది.

ప్రకాశం జిల్లా పర్యటన గురించి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో మాట్లాడిన ముఖ్యమంత్రి రోశయ్య.. ఇప్పుడు అహ్మదుల్లాతోనూ మాట్లాడతారా అనేది అసక్తికరంగా మారింది. జడ్పీ చైర్మన్ జ్యోతిరెడ్డి, డీసీసీబీ చైౖర్మన్ పల్లం బ్రహ్మానంద రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సురేష్‌బాబు, పులివెందుల మునిసిపల్ చైర్‌పర్సన్ రుక్మిణిలు కూడా హాజరయ్యారు. వీరితో పాటు ఆయన జగన్ కుటుంబ సభ్యులు భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, డాక్టర్ ఈసీ గంగిరెడ్డిలు కూడా ఓదార్పు యాత్రలో పాల్గొన్నారు.

జగన్ బాబాయి.. ఎమ్మెల్సీ వివేకానందరెడ్డి మొదటి రోజు ఓదార్పు యాత్రలో కనిపించలేదు. ఇటీవల సోనియాకు రాసిన లేఖ రాజకీయ దుమారం రేపిన నేపథ్యంలో ఆయన గైర్హాజరు చర్చనీయాంశమైంది. అయితే.. అమెరికాలో కూడా వైఎస్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించనున్నందున ఆ ఏర్పాట్ల కోసం హైదరాబాద్ వెళుతున్నానని ముందు రోజే వివేకా చెప్పారు. జిల్లాకు చెందిన సీనియర్ శాసనసభ్యులు డీఎల్ రవీంద్రారెడ్డి, వీరశివారెడ్డిలు ఓదార్పునకు దూరంగా ఉన్నారు. కోస్తాతో పోలిస్తే సొంత జిల్లాలో ఓదార్పునకు అంతస్థాయిలో జన స్పందన కనిపించలేదు.

నలుగురికి ఓదార్పు
మొదటి రోజు నాలుగు కుటుంబాలను జగన్ ఓదార్చారు. పులివెందుల్లో దేరంగుల జయరామ్ అనే వ్యక్తి వైఎస్ మృతి చెందిన ఆరు రోజుల తర్వాత చనిపోయారు. అలాగే అంబకపల్లెలో లోమడ వెంగముని అనే వృద్ధ్దుడు వారం తర్వాత చనిపోయాడు. ఈ ఇద్దరి కుటుంబాలను జగన్ పరామర్శించారు. అలాగే దిగువ పల్లెలో చాపల వెంకటరమణ అనే వ్యక్తి కుటుంబాన్ని, పార్నపల్లెలో మృతి చెందిన అంకె పుల్లన్న అనే వ్యక్తి కుటుంబాలను కూడా జగన్ ఓదార్చారు. వీరితోపాటు ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన మరో నలుగురి కుటుంబాలను కూడా ఆయన పరామర్శించారు.

ఓపిగ్గా, ఓర్పుగా సాగిన ఓదార్పు
పులివెందులలో జగన్ ఓదార్పు యాత్ర ఓర్పుగా, ఓపిగ్గా సాగింది. ఉదయం 8.30 గంటలకు మొదలై మధ్యాహ్నం ఒకటిన్నరకు పూర్తి కావాల్సి ఉండగా 10.30 గంటలకు మొదలై రాత్రి 7.30 గంటలకు కూడా పార్నపల్లెకు చేరుకోలేక పోయారు. ఆలస్యం కావడంతో వేముల ఓదార్పును రద్దు చేసుకున్నారు. మార్గమధ్యంలో వివిధ గ్రామాల ప్రజలతో మాట్లాడుతూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకుని, ఫిర్యాదులు స్వీకరించారు. పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.

పెద్దకుడాలలో జిలిటెన్‌స్టిక్స్ లభ్యం
ఓదార్పు యాత్రకు ముందుగా లింగాల మండలం పెద్దకుడాలలో పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం జగన్ ఓదార్పు యాత్రలో భాగంగా పెద్దకుడాలలో వైఎస్ విగ్రహావిష్కరణ జరగాల్సి ఉంది. దీనికి కొన్ని గంటల ముందే విగ్రహం ఏర్పాటు చేసిన సమీప ప్రాంతంలో 52 జిలిటెన్‌స్టిక్స్‌ను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతాన్ని ఏఎస్పీ కార్తికేయన్ పరిశీలించారు. పలు కోణాల్లో వీటిపై పరిశీలన చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

Tuesday, July 13, 2010

అంతొద్దు! వాడి తగ్గించాలన్న మొయిలీ - ‘ఓదార్పు ’ వివాదానికి విరుగుడు మంత్రం మెయిలీ బాణం !

విజయమ్మ, కేవీపీలకు ఫోన్
జగన్ సంయమనానికి అదే కారణం?
సీఎం ఢిల్లీ యాత్రపై నేతల్లో ఆసక్తి
 
శ్రీకాకుళం జిల్లా ఓదార్పు యాత్రలో వాడి వేడి వ్యాఖ్యలు చేసిన కడప ఎంపీ వైఎస్ జగన్ తూర్పు గోదావరిలో ఎందుకు సంయమనం పాటిస్తున్నారు? పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మొయిలీ రంగంలోకి దిగి... జగన్ తల్లి విజయలక్ష్మి, వైఎస్ సన్నిహితుడైన కేవీపీ రామచంద్రరావులకు చేసిన సూచనలే దీనికి కారణమని తెలుస్తోంది.

జగన్ ముఖ్యమంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అధిష్ఠానం ఆయనకు షోకాజ్ నోటీసు ఇస్తుందనే ప్రచారం సోమవారం విస్తృతంగా జరిగింది. ఇది జగన్ వర్గంలో కలవరం పుట్టించింది. తన వర్గంలో ధైర్యం నూరిపోసేందుకైనా జగన్ మరిన్ని పదునైన వ్యాఖ్యలు చేస్తారేమోనని కొందరు భావించారు. అయితే.. జగన్ నుంచి ఎలాంటి స్పందన కన్పించలేదు. జగన్ ప్రసంగాల్లో వాడి తగ్గించాలని, లేనిపక్షంలో అధిష్ఠానం కఠినంగా వ్యవహరిస్తుందని వైఎస్ సతీమణి విజయలక్ష్మికి మొయిలీ ఫోన్‌లో వివరించారని సమాచారం.

అదేవిధంగా జగన్‌కు అధిష్ఠానం నిర్ణయం ఏమిటో వివరించాలని, సంయమనంతో మాట్లాడాల్సిందిగా సూచించాలని కేవీపీ రామచంద్రరావును మొయిలీ కోరినట్లు సమాచారం. ఇటు తల్లి విజయమ్మ, అటు కేవీపీల సూచనల మేరకే తూర్పు గోదావరి జిల్లాలో జగన్ కాస్త సంయమనం పాటిస్తున్నట్లు అంటున్నారు. మొయిలీ సోమవారం, మంగళవారం ముఖ్యమంత్రి రోశయ్యతోకూడా మాట్లాడినట్లు తెలిసింది. జగన్ వ్యాఖ్యల పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఢిల్లీ మనసులో మాటేమిటి?
రాష్ట్ర రాజకీయాలపై కాంగ్రెస్ అధిష్ఠానం మనోగతం ఏమిటి? 'ఓదార్పు వేడి'పై పార్టీ పెద్దలు ఏమనుకుంటున్నారు? భవిష్యత్ ఎలా ఉంటుంది? ముఖ్యమంత్రి రోశయ్య ఢిల్లీ పర్యటన తర్వాతైనా ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు లభిస్తాయని పార్టీ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరప్ప మొయిలీ సోనియాకు ఎలాంటి నివేదిక ఇస్తారనేది చర్చనీయాంశంగా మారింది.

జూనియర్లకు మంత్రుల క్లాస్!
మంత్రులు, ముఖ్యనేతలను కలుస్తున్న జగన్ అనుకూల జూనియర్ ఎమ్మెల్యేలకు వారి నుంచి పలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. సంగతులేమిటని ప్రశ్నిస్తూనే.. ఓదార్పు యాత్ర, ప్రజా స్పందన తదితర అంశాలను సీనియర్లు ఆరా తీస్తున్నారు. ఆ తర్వాత... జగన్ పార్టీలో కొనసాగుతారా, లేక వేరే కుంపటి పెడతారా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వేరుకుంపటి పెడితే, మధ్యంతర ఎన్నికలు వస్తే పార్టీలో ఎంతమంది గెలుస్తారో చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు. దీనికి జగన్ వర్గీయుల నుంచి సరైన సమాధానం రావడం లేదంటున్నారు.

జగన్ ఓదార్పు యాత్రలో ప్రజాప్రతినిధులు పాల్గొనేలా 'ఒత్తిడి వ్యూహం' అమలవుతోంది. యాత్ర జరిగే నియోజకవర్గాల్లో జగన్ వర్గీయులు ముందస్తుగా కార్యకర్తల సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు యాత్రలో పాల్గొనేలా ఒత్తిడి తెస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇదే వ్యూహాన్ని అమలు చేశారు.

స్థానిక ఎమ్మెల్యేలు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రస్తావించినప్పుడు... "ఆ ఎన్నికల గురించి తర్వాత! ముందు జగన్ యాత్రలో పాల్గొంటున్నారా లేదా?'' అని కార్యకర్తలతో అడిగించారు. ఈ సమావేశంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, వారి అనుచరులు పాల్గొన్నారని శ్రీకాకుళం జిల్లాకు చెందిన శాసనసభ్యుడొకరు వివరించారు.

రోశయ్యను కలిసిన శ్రీకాకుళం ఎంపీ కిల్లి కృపారాణి
సీఎంను శ్రీకాకుళం ఎంపీ కిల్లి కృపారాణి మంగళవారం కలిశారు. ఓదార్పు యాత్రలో తన భర్త పా ల్గొనడం, ఇతర అంశాలు ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చాయని సమాచారం. యాత్ర గురించి సీఎం ప్రస్తావించలేదని ఆమె  వివరించారు.

‘ఓదార్పు ’ వివాదానికి విరుగుడు మంత్రం మెయిలీ బాణం !
MOHILI ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవహారాలపై కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర కాంగ్రెస్‌లో జరగుతున్న అవాంఛనీయ పరిణామాలకు కళ్లెం వేసే పనిలో పడింది. కడప ఎంపీ జగన్‌ ఓదార్పు యాత్రతో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి కల్లోల కడలిగా మారిం దని అధిష్టానం భావిస్తోంది. ఓదార్పు యాత్రను నిలువరించేందుకు అధిష్టానం ఎంతగా ప్రయత్నించినా జగన్‌ తన దారిన తాను యాత్రకు వెళ్లడంతో రాష్ట్ర కాంగ్రెన్‌లో రెండు శిబిరాల వాతావరణం ఏర్పడు తున్నది. దీన్ని మొగ్గ దశలోనే నివారించకపోతే ఇది వికటించి మరింత గందరగోళం నెలకొనవచ్చని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ అధిష్టానం దృష్టికి తెచ్చినట్లు తెలియవచ్చింది.

రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాలను నేరుగా ఢిల్లీ నుంచే నిర్వహించాల్సిన సమయం ఆసన్న మైందన్నది ఆయన భావనగా చెబుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు డి శ్రీని వాస్‌ ఉప ఎన్నికల్లో తానే ఒక అభ్యర్ధిగా బరిలో ఉండటంతో అధిషా ్టనానికి రాష్ట్ర కాంగ్రెస్‌కు మధ్య అనుసంధానం లేకుండా పోయింది. ప్రస్తుత అవాంఛనీయ పరిణామాలకు ఇది కూడా ఒక కారణంగా అధిష్టానం భావిస్తోంది. అందుకే వీరప్ప మొయిలీ మంగళవారం స్వయంగా రంగప్రవేశం చేశారు. ఉప ఎన్నికలకు పార్టీ తరపున బరువు బాధ్యతలను పంచుతూ ఆయన పార్టీ నాయకులకుఆదేశాలిచ్చారు.

ప్రతి ఒక్కర్నీ భాగస్వాములను చేస్తూ విడివిడిగా అందరికీ స్వయంగా లేఖలు పంపారు. ముఖ్యంగా చీటికీ మాటికీ పత్రికల్లోను, చానళ్లలోనూ పార్టీ వ్యవహారాలపై వ్యాఖ్యానాలు చేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్న వారికి ఉప ఎన్నికల బాధ్యతలు అప్పగించడం అధిష్టానం కొత్త వ్యూహంలో భాగం అంటున్నారు. మంత్రులతో బాటు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా ఈ బాధ్యతలు అప్పగించారు. వీరిలో కొందరు అధిష్టానానికి వీర విధేయులుగా ఉంటున్నట్లు రుజువు చేసుకునే ఉద్దేశంతో ప్రతి చిన్న సమస్య మీదా చానళ్ల ముందుకొచ్చి స్పందిం చడం కేంద్ర పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. ఇదంతా సామాన్య ప్రజల దృష్టిలో క్రమశిక్షణ రాహి త్యంగా ముద్ర పడుతుందని అధిష్టానం భయపడుతోంది. అందుకే జగన్‌ ఓదార్పు యాత్ర దరిమిలా ఏర్పడ్డ రాజకీయ అయోమయం నుంచి పార్టీని కాపాడేందుకు అందరి దృష్టినీ మళ్లించే కార్యక్రమంలో అధిష్టానం పడింది.

ఉప ఎన్నికలకు ఇంకా రెండు వారాలే వ్యవధి ఉన్న నేపథ్యంలో యావత్‌ పార్టీ శ్రేణుల దృష్టి ని అటు మళ్లించే కార్యక్రమాన్ని వీరప్ప మొయిలీ చేపట్టారు. ఇందులో భాగంగానే నియోజకవర్గాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను బాధ్యులను చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. నిజానికి మొదట్లో కాంగ్రెస్‌ పార్టీ ఈ ఉప ఎన్నికలను అంత సీరియస్‌గా తీసుకోదల్చుకోలేదు. అందుకే ముఖ్యమంత్రి రోశ య్య కూడా ఒకటి రెండు సందర్భాల్లో తమకు ఒకటి వచ్చినా అదనమే అంటూ ఎన్నికలను తేలిగ్గా తీసుకుంటున్న సంకేతాలిచ్చారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్ర కాంగ్రెస్‌ శ్రేణులకు గట్టి వ్యాపకం కల్పించాల్సిన అవసరం ఏర్పడింది.

లేకుంటే జగన్‌ వ్యవహారంతో రాజకీయ వాతావరణమే కలుషితం అవుతున్నట్లు అధిష్టానం గుర్తించింది. అందుకే వీరప్ప మొయిలీకి ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు పంపింది. అంతే కాదు. జగన్‌ సృష్టించిన రాజకీయ కల్లోలం నుంచి పార్టీ రాష్ట్ర శాఖను గట్టెక్కించే బాధ్యతను కూడా మొయిలీకే అధిష్టానం అప్పగించింది. అందులో భాగంగా ఇకపై పార్టీ నాయకులెవరూ జగన్‌ ఓదార్పు యాత్రను ఒక అంశంగా గాని ఒక వివాదంగా గాని చేయకుండా కట్టడి చేయ బోతున్నారు. జగన్‌ మీద చర్యలు తీసుకోబోతున్నారంటూ పుకార్లు లేవదీసి, ఆ వెంటనే జగన్‌ నుంచి ఆవేశపూరిత ప్రకటనలను ఆశించే కొన్ని శక్తులు కావాలని ప్రయత్నాలు చేస్తున్నాయని వీరప్ప మొయిలీ భావిస్తున్నారు.

అలాంటి చర్యల వల్ల వాతావరణం దెబ్బతిని మరింత క్షీణించడం మినహా మరేమీ జరగదని, ఈ తరహా దుష్ట యత్నాలకు గండి కొట్టాల్సిన అవసరం ఉందని మొయిలీ అంటున్నారు. జగన్‌ వ్యవహారం అధిష్టానం చేతిలో ఉన్నందున ఇకెవరూ దాని మీద ఇష్టమొచ్చినట్లు మాట్లాడరాదంటూ మొయిలీ అలిఖిత ఆదేశాలిచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. రానున్న రెండు వారాల పాటు ఉప ఎన్నికల మీదనే అందరి దృష్టీ కేంద్రీకృత మయ్యేలా చేయడమే మొయిలీ తక్షణ కర్తవ్యంగా చెబుతున్నారు. ఆయన వ్యూహం ఫలించి జగన్‌ అంశం ఏ స్ధాయిలో మరుగున పడుతుందో వేచి చూడాల్సిందేనని రాష్ట్ర కాంగ్రెస్‌ శ్రేణులు అంటున్నాయి.

మొత్తం మీద రాష్ట్ర వ్యవహారాలను కేంద్ర అధిష్టానం పూర్తిగా మొయిలీకే వదిలేసినట్లు తెలుస్తోంది. సోమవారం పార్టీ అధికార ప్రతినిధులు ఎవ్వరు మాట్లాడినా వీరప్ప మొయిలీయే చూసుకుంటారంటూ సంకేతాలు పంపారు. అందుకు తగ్గట్లే మొయిలీ ఢిల్లీ వచ్చిన కొద్ది గంటల్లోనే వాతావరణంలో మార్పు కనిపించింది. తొలుత జగన్‌కు అధిష్టానం షోకాజ్‌ నోటీసు ఇవ్వబోతున్నదంటూ పుకార్లు వచ్చినా మొయిలీ వెంటనే కలగజేసుకుని వాటిని ఖండించి మరింత నష్టం జరగకుండా నివారించారు. అదే సమయంలో అటు జగన్‌ కూడా ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు.

దాంతో వేడెక్కిన వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ప్రస్తుతం ఉభయ శిబిరాల్లోనూ కాల్పుల విరమణ లాంటి ప్రశాంత పరిస్థితి ఉన్నట్లే భావిస్తున్నారు. జగన్‌ని తన దారిన తనను వదిలేసి ఊరుకోవాలన్నది మొయిలీ అభిప్రాయంగా ఉంది. ఆయన సోమవారం ఢిల్లీ వచ్చిరాగానే ఇదే విషయాన్ని అధినేత్రి సోనియా గాంధీకి నివేదించినట్లు తెలిసింది. అందుకు ఆమె సుముఖత వ్యక్తం చేయగా మొయిలీ ఇతరత్రా కాంగ్రెస్‌ శ్రేణులకు సోమవారం రాత్రికల్లా ఆ సందేశాన్ని పంపినట్లు చెబుతున్నారు. ఉప ఎన్నికలయ్యేదాకా వాతావరణం విషమించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అధిష్టానం మొయిలీకి సూచించినట్లు తెలుస్తోంది.
జోరు తగ్గిన జగన్‌
jagna-hand తూర్పుగోదావరి జిల్లాలో జగన్‌ ఓదార్పు యాత్ర రోజు రోజుకూ జోరు తగ్గిపోతోంది. జగన్‌ పేలవమైన ప్రసం గాలు, రొటీన్‌ డైలాగులు ఆయన అనుచరులు, అభిమాను లను సైతం నిరాశకు గురిచేస్తున్నాయి. తన ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చి, తానేమిటో నిరూపించుకుని యువతలో ఉత్సాహం నింపుతారని ఆశించిన పార్టీ నేతల ఆశలు ప్రతి సభలోనూ నీరుగారి పోతున్నాయి. శ్రీకాకు ళంలో చేసిన ప్రసంగాలనే తూర్పు లోనూ వినిపిస్తుం డటంతో.. ఇప్పటికే వాటిని పత్రికలు, చానెళ్లలో చూసిన ప్రజలు జగన్‌ సభకువచ్చేందుకు పెద్దగా ఆసక్తి ప్రదర్శిం చడం లేదని స్పష్టంగా కనిపించింది. ఇవన్నీ జగన్‌ జోరు తగ్గిందన్న అభిప్రాయానికి వీలు కలిగించాయి.

రెండోరోజు ఓదార్పు యాత్ర సందర్భంగా మంగళ వారం తుని, కోటనందూరు మండలాల్లోని 13 గ్రామాల్లో జగన్‌ పర్యటించారు. ఆ సందర్భంగా ఆయన వ్యూహ బృందం సోమవారం నాటి కార్య్రమాలు పేలవంగా ముగి సిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈసారి కొత్త పంథా అనుసరించింది. స్కూలు పిల్లలు, డ్వాక్రా మహిళ లను భారీ సంఖ్యలో తరలించింది. దానితో వారు దారి పొడవునా భారీ క్యూగా రోడ్డుకిరువైపులా నిల బడటంతో జనం బాగా వచ్చినట్లు కనిపిం చింది. ఫలితంగా నిన్నటితో పోలిస్తే నేడు సభలు కొంత కళకళలాడాయి.

ఇదే వ్యూహాన్ని జగన్‌ అనుచర బృందం అన్ని ప్రాంతాల్లోనూ అనుసరించింది. చిన్నయ్యపాలెం గ్రామంలో సంత పక్కనే ఓదా ర్పు యాత్ర ఏర్పాటు చేసి పెద్ద సంఖ్యలో జనం వచ్చినట్లు చూపించే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా.. తొలిరోజు చేదు అనుభవా లను దృష్టిలో ఉంచుకుని జగన్‌ తన ప్రసంగానికి పదు ను పెడతారని భావించిన ఆయన వర్గీయు లకు ఆ ప్రసంగాల తీరు మొహం మొత్తేలా చేసింది. తరచూ చేస్తున్న అంశాలే అందులో ఉండటంతో జనం ఆయన ప్రసంగాన్ని వినేం దుకు కాకుండా, కేవలం జగన్‌ను చూసేందుకే పరిమిత మవుతున్నట్లు కనిపిస్తోంది. పార్టీలోని తన ప్రత్యర్థులు తనపై చేస్తున్న ఆరోపణలను గట్టిగా సమాధానం ఇస్తారని భావించిన వారికి సైతం జగన్‌ మౌనం నిరాశ పరిచింది. జగన్‌ మౌనంగా ఉన్నా రంటే దాని వెనుక ఏదో సర్దుబాటు జరిగి ఉంటుందని, లేకపోతే తన తండ్రి సేవలను కూడా తప్పుపడుతున్న నేతలకు జగన్‌ సభాముఖంగా ఎందుకు జవాబు ఇవ్వరని సామాన్య జనం అభిప్రాయపడ్డారు.

యువకులు కూడా జగన్‌ తన ప్రత్యర్థులకు సభ ద్వారా గట్టి జవాబు ఇచ్చి, సవాల్‌ చేస్తారని ఆశించే సభలకు వస్తున్నట్లు వెల్లడయింది. అయితే, జగన్‌ సభలను అనుస రిస్తున్న వారికి.. ప్రతి సభలోనూ రొటీన్‌ ప్రసంగాలు వినిపి స్తుండటంతో వారంతా ఆయనను అనుసరించకుండా అక్కడితో ఆగిపోతు న్నారు. రెండోరోజు కూడా జగన్‌ సభలు, ప్రసంగాలు పేలవంగా ఉండటంతో మీడియా కూడా హడావుడి, ప్రాధాన్యం తగ్గించింది. సాయంత్రం వేళల్లో గ్రామాల్లో జనం ఒకచోట చేరతారని గ్రహించిన జగన్‌ వ్యూహ బృందం తన యాత్రను నిదానంగా, నింపాదిగా సాయంత్రం వరకూ కొనసా గిస్తున్నట్లు కనిపిస్తోంది. తుని పట్టణం లో ఈ వ్యూహం అనుసరించినందుకే జనాలు వచ్చారు.

ఇదిలా ఉండగా..జగన్‌ తన ఓదార్పు యాత్ర లక్ష్యాన్ని ప్రజల వద్దకు చేర్చడానికి కొత్త పంథా అనుసరిస్తున్నట్లు ఆయన వర్గీయుల తాజా వ్యూహం స్పష్టం చేస్తోంది. జగన్‌ హాజరయ్యే గ్రామానికి ముందు కొంత హడావుడి వాతావరణాన్ని సృష్టించి, వాటిని ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ప్రజల్లోకి పంపించే సరికొత్త ప్రచార వ్యూహానికి తెర లేపారు. అక్కడ కొందరు యువకులు, మహిళలు వేదికపె ైకి ఎక్కి, రోశయ్య సర్కారుపై ధ్వజ మెత్తడం, మధ్యలో కాబోయే సీఎం జగన్‌ జిందాబాద్‌ అన్న నినాదాలు చేయ డం, జగన్‌ కోసం ప్రాణాలర్పిస్తాం అన్న రొటీన్‌ నినాదాలు, దృశ్యాలు ఆయా సభల్లో దారిపొడవునా కనిపించాయి.

అదేవిధంగా, స్థానిక కాంగ్రెస్‌ నేతలే స్థానిక గ్రామ మహి ళలు, యువకులను ఇంటర్వ్యూలు చేయడం, వారంతా రోశయ్య ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడం, జగనన్నను సీఎం చేసే వరకూ విశ్రమించమని శపథాలు చేయటం, అవి జగన్‌ అనుకూల చానెళ్లలో ప్రత్యక్ష ప్రసా రాలు కావ డం ఫార్సుగా మారాయి. వీటిని నిశితంగా పరిశీలిస్తే.. ఒక పథకం ప్రకారం జగన్‌ను ప్రజల్లోకి తీసుకువెళుతున్నారని స్పష్టమవుతోంది. మరోవైపు.. అందుకు తగినట్లుగానే రోశ య్య ప్రభు త్వంపై వివిధ గ్రామాల్లోని బడుగు, బలహీన వర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఆయనను వైఎస్‌తో పోల్చుకోలేకపోతున్నామని, ఆయన వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తోందని వారు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేయ డం ప్రస్తానార్హం.

అన్ని సంక్షేమ పథకాలనూ రోశయ్య ప్రభుత్వం తొలగించి వేస్తోందని, ఆయన మానవత్వంతో కాకుండా అన్నీ ‘లెక్కలతో పరిపాలన’ చేస్తున్నారని మహిళలు పెద్ద సంఖ్యలో అసహనం వ్యక్తం చేస్తుండటం ‘సూర్య’ పరిశీలనలో కనిపించింది. ‘ఆ బాబు బతికుంటే మా పింఛన్లు తప్పనిసరిగా ఆగకుండా వస్తాయన్న నమ్మకం ఉండేది. ఇప్పుడు ఆ నమ్మకం లేకుం డా పోయింది. ఆఫీసుకు వెళితే మా ముసలోళ్లను పట్టిం చుకునే దిక్కు లేదు. ఈ అబ్బాయికి (జగన్‌) పిల్లలు ఉన్నా రా? ఉంటే ఆ బాబు చల్లగా ఉండాలి. మా లాంటి పేదవాళ్ల కు రెండొందలు పించన్లు ఇచ్చిన వాళ్ల నాయన ఆశీస్సులు, మా ఆశీస్సులు అబ్బాయికి ఉంటాయ’ని 90 ఏళ్ల వృద్ధురా లొకరు ‘సూర్య’ ప్రతినిధి వద్ద వ్యాఖ్యాచింది.

రోశయ్యను తాము సీఎంగా లెక్కలోకి తీసుకోవడం లేదని, పేదవారికి అమలు చేసిన పథకాలన్నీ రోశయ్య తొలగిస్తున్నారని, తమ గ్రామాల్లో లెక్కలేనన్ని తెల్లకా ర్డులను ఈ ప్రభుత్వం తొలగించిందని మహిళలు మండి పడటం కనిపించింది. నేరుగా ఎన్నికయితే ప్రజల కష్టాలు తెలుస్తాయని మరికొందరు చదువుకున్న మహిళలు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

వైఎస్‌ పథకాలను కొనసాగించడం రోశ య్యతో సాధ్యం కాదని, జగన్‌ వల్లే అది సాధ్యమని మహిళలు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. మరికొందరు కాంగ్రెస్‌ కార్యకర్తలు, ఎంపీటీసీ స్థాయి నేతలు వైఎస్‌కు రోశయ్య ద్రోహం చేస్తున్నారని, ఆయన దయతో సీఎం అయిన రోశయ్య.. జగన్‌ ఎవరని ప్రశ్నించటం విశ్వాసఘాతుకమేనని ధ్వజమెత్తారు. జగన్‌ సీఎం కావడం ఖాయమన్నారు. జగన్‌ హాజరయ్యే మరికొన్ని సభల్లో.. వైఎస్‌ ఆత్మ ముఖ్యమంత్రి రోశయ్యను తూర్పారపడుతున్నట్లు మిమిక్రీల ద్వారా వినిపించారు.