Showing posts with label Sonia Gandhi. Show all posts
Showing posts with label Sonia Gandhi. Show all posts

Tuesday, August 24, 2010

మీఅందరి మధ్యలో పెరిగినోణ్ని .. తిరిగినోణ్ని..

 పులివెందుల్లో నేను మీ అందరి మధ్యనే పెరిగినోణ్ని ... మీ అందరి మధ్యనే తిరిగినోణ్ని... మీ ఆప్యా యత వల్లే చిరునవ్వుతో మీ ముందుకు వచ్చానని ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఎంపీ జగన్ సోమవారం పులివెందుల నియోజక వర్గంలో ఓదార్పు యాత్ర ప్రారంభించారు. ముందుగా ఆయన ఇడుపులపాయ నుండి పులివెం దులకు చేరుకుని ఓ పెట్రోల్ బంక్‌ను ప్రారంభించారు. అనంతరం కడప రహదారిలోని రింగు రోడ్డు కూడలిలోను, బస్టాండ్ సర్కిల్ సమీపంలోను, పార్నపల్లె రహదారి సమీపంలోని రింగు రోడ్డు సర్కిళ్ల్ల వద్ద ఏర్పాటు చేసిన వైయస్ విగ్రహాలను ఆయన ఆవిష్కరిం చారు.

ఈ సందర్బంగా మాట్లా డుతూ పులివెందుల పట్టణానికి నలువైపులా నాన్న విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. ఓదార్పు యాత్రలో భాగంగా రాష్ట్రంలో ఎన్నో జిల్లాల్లో తిరిగినా. కానీ ఇక్కడ మీరు చూపుతున్న ప్రేమ , అభిమానం, ఆప్యాయతలే నన్ను మీ ముందుకు చిరునవ్వుతో నిలిపాయన్నారు. మీ ఆప్యాయతకు, ఆదరాభిమానాలకు చేతులెత్తి పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డికి అందించిన ప్రేమానురాగాలను నాపై కూడా చూపించాలని అభ్యర్థిస్తున్నానన్నారు.

గత 9 నెలలుగా రాష్ట్రంలో ఏం జరుగుతోందో ప్రతి ఒక్కరికీ తెలుసు ను. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు పత్రికల్లో , టీవీల్లో చూస్తున్నారన్నారు. పట్టణ శివార్లలో విగ్రహాల ఏర్పాటుకు ఇంత మంది ఏకమయ్యారంటే వైయస్ ఎక్కడు న్నారనే ప్రశ్నకు ప్రతి గుండెలో వైయస్ ఉన్నారన్నారు. ఇక్కడి వారి అందరి గుండె లబ్‌డబ్ లబ్‌డబ్ అని కొట్టుకోవడం లేదని, ప్రతి గుండె వైయస్సార్ వైయస్సార్ అంటూ కొట్టుకుంటోందన్నారు.

అనంతరం జగన్ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వైయస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం నల్లపు రెడ్డిపల్లె మీదుగా జగన్ ఓదార్పు యాత్ర సాగింది. నల్లపు రెడ్డిపల్లెలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. నల్లగొండు వారిపల్లె మీదుగా వెళుతున్న జగన్ కాన్వాయ్‌ను ఆపి జగన్‌కు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఆయనకు ఆ గ్రామస్థులు సమస్యలను విన్నవించారు. అనంతరం అంబక పల్లె గ్రామానికి చేరుకున్నారు. ఆ గ్రామంలో నెలకొన్న సమస్యలను గ్రామ ప్రజలు ఆయన దృష్టికి తెచ్చారు. ఈ సమస్యలన్నీ జగన్ ఓర్పుతో విన్నారు. అనంతరం మురారిచింతల , దిగువపల్లె, ఎగువ పల్లె, పార్నపల్లె తదితర గ్రామాల్లో ఆయన పర్యటించారు. 


జగన్ వెంట ఆరుగురు ఎమ్మెల్యేలు
ఓదార్పు యాత్రలో కడప జిల్లా రాజంపేట, రాయచోటి, బద్వేల్, రైల్వే కోడూరు, జమ్మలమడుగు ఎమ్మెల్యేలు అమరనాథ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కమలమ్మ, కొరముట్ల శ్రీనివాసులు, ఆదినారాయణ రెడ్డిలతో పాటు అనంతపురం జిల్లాకు చెందిన గురునాథ రెడ్డిలు పాల్గొన్నారు.

వీరితో పాటు జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి అహ్మదుల్లా కుమారుడు అష్రఫ్ కూడా జగన్‌ను కలిసి వెళ్లారు. తాను రాజమండ్రికి వెళ్తున్నానని జగన్‌కు ముందే చెప్పానని.. ఆయన ఆమోదం పొందానని.. మంగళవారం నుంచి ఓదార్పులో పాల్గొంటానని మంత్రి అహ్మదుల్లా ప్రకటించడం పార్టీలో చర్చనీయాంశమైంది. మంత్రిగా ముఖ్యమంత్రి అనుమతిని తీసుకుంటారా.. లేక.. జిల్లా ఎంపీ ఆమోదం పొందుతారా? అనే సందేహం పార్టీలో నెలకొంది.

ప్రకాశం జిల్లా పర్యటన గురించి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో మాట్లాడిన ముఖ్యమంత్రి రోశయ్య.. ఇప్పుడు అహ్మదుల్లాతోనూ మాట్లాడతారా అనేది అసక్తికరంగా మారింది. జడ్పీ చైర్మన్ జ్యోతిరెడ్డి, డీసీసీబీ చైౖర్మన్ పల్లం బ్రహ్మానంద రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సురేష్‌బాబు, పులివెందుల మునిసిపల్ చైర్‌పర్సన్ రుక్మిణిలు కూడా హాజరయ్యారు. వీరితో పాటు ఆయన జగన్ కుటుంబ సభ్యులు భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, డాక్టర్ ఈసీ గంగిరెడ్డిలు కూడా ఓదార్పు యాత్రలో పాల్గొన్నారు.

జగన్ బాబాయి.. ఎమ్మెల్సీ వివేకానందరెడ్డి మొదటి రోజు ఓదార్పు యాత్రలో కనిపించలేదు. ఇటీవల సోనియాకు రాసిన లేఖ రాజకీయ దుమారం రేపిన నేపథ్యంలో ఆయన గైర్హాజరు చర్చనీయాంశమైంది. అయితే.. అమెరికాలో కూడా వైఎస్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించనున్నందున ఆ ఏర్పాట్ల కోసం హైదరాబాద్ వెళుతున్నానని ముందు రోజే వివేకా చెప్పారు. జిల్లాకు చెందిన సీనియర్ శాసనసభ్యులు డీఎల్ రవీంద్రారెడ్డి, వీరశివారెడ్డిలు ఓదార్పునకు దూరంగా ఉన్నారు. కోస్తాతో పోలిస్తే సొంత జిల్లాలో ఓదార్పునకు అంతస్థాయిలో జన స్పందన కనిపించలేదు.

నలుగురికి ఓదార్పు
మొదటి రోజు నాలుగు కుటుంబాలను జగన్ ఓదార్చారు. పులివెందుల్లో దేరంగుల జయరామ్ అనే వ్యక్తి వైఎస్ మృతి చెందిన ఆరు రోజుల తర్వాత చనిపోయారు. అలాగే అంబకపల్లెలో లోమడ వెంగముని అనే వృద్ధ్దుడు వారం తర్వాత చనిపోయాడు. ఈ ఇద్దరి కుటుంబాలను జగన్ పరామర్శించారు. అలాగే దిగువ పల్లెలో చాపల వెంకటరమణ అనే వ్యక్తి కుటుంబాన్ని, పార్నపల్లెలో మృతి చెందిన అంకె పుల్లన్న అనే వ్యక్తి కుటుంబాలను కూడా జగన్ ఓదార్చారు. వీరితోపాటు ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన మరో నలుగురి కుటుంబాలను కూడా ఆయన పరామర్శించారు.

ఓపిగ్గా, ఓర్పుగా సాగిన ఓదార్పు
పులివెందులలో జగన్ ఓదార్పు యాత్ర ఓర్పుగా, ఓపిగ్గా సాగింది. ఉదయం 8.30 గంటలకు మొదలై మధ్యాహ్నం ఒకటిన్నరకు పూర్తి కావాల్సి ఉండగా 10.30 గంటలకు మొదలై రాత్రి 7.30 గంటలకు కూడా పార్నపల్లెకు చేరుకోలేక పోయారు. ఆలస్యం కావడంతో వేముల ఓదార్పును రద్దు చేసుకున్నారు. మార్గమధ్యంలో వివిధ గ్రామాల ప్రజలతో మాట్లాడుతూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకుని, ఫిర్యాదులు స్వీకరించారు. పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.

పెద్దకుడాలలో జిలిటెన్‌స్టిక్స్ లభ్యం
ఓదార్పు యాత్రకు ముందుగా లింగాల మండలం పెద్దకుడాలలో పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం జగన్ ఓదార్పు యాత్రలో భాగంగా పెద్దకుడాలలో వైఎస్ విగ్రహావిష్కరణ జరగాల్సి ఉంది. దీనికి కొన్ని గంటల ముందే విగ్రహం ఏర్పాటు చేసిన సమీప ప్రాంతంలో 52 జిలిటెన్‌స్టిక్స్‌ను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతాన్ని ఏఎస్పీ కార్తికేయన్ పరిశీలించారు. పలు కోణాల్లో వీటిపై పరిశీలన చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

Sunday, August 22, 2010

రెచ్చగొట్టే ధోరణి ?

Jagan9
కడప ఎంపి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శిబిరానికి చెందిన నేతలు రాష్ట్ర కాంగ్రెస్‌లో ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలను రెచ్చగొట్టే ధోరణి అవలంబిస్తున్నారంటూ పార్టీలో విమర్శలు గుప్పుమంటున్నా యి. మరో వైపు జగన్‌ శిబిరం నేతల వైఖరి చూస్తుంటే ఈ విమ ర్శ లకు బలం చేకూరుతున్నది. ఓదార్పు యాత్రకు బ్రేకు వేసేం దుకు పార్టీ అధిష్ఠానం ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు ఎవరూ కూడా యాత్రలో పాల్గొనవద్దంటూ నేతల ద్వారా తమ వైఖరి స్పష్టం చేసిన నేపథ్యంలో జగన్‌ శిబిరం దాన్ని తిప్పి కొట్టేందుకు రంగంలో దిగింది. ఓదార్పు యాత్రలో పాల్గొనకుంటే, యాత్ర ను వ్యతిరేకించినా జనం రాళ్ళతో కొడతారంటూ తాజాగా ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలపై ఒత్తిడి పెంచడానికి సరికొత్త తరహా ప్రచారాన్ని ప్రారంభించింది. తద్వారా ఓదార్పును వ్యతిరేకిస్తున్న వారిని, ఓదార్పు యాత్రలో పాల్గొనే విషయంలో ఊగిసలాడు తున్న వారికి జనం భయం చూపించి యాత్రకు రప్పించే ప్రయ త్నాలను ఆ శిబిరం ముమ్మరం చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అప్పటికి యాత్రకు రాని నేతలపై కార్యకర్తల రూ పంలో తమ వర్గం క్యాడర్‌ను రెచ్చగొట్టి, దాడులు చేయిం చేందుకు వ్యూహ రచన చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

తాజాగా ఆదివారం ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కొండా సురేఖ తదితరులు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే జగన్‌ ఓదార్పు యాత్రను వ్యతిరేకిస్తున్న ప్రజా ప్రతినిధులపై పార్టీ ద్వితీయశ్రేణు నేతలు, క్యాడర్‌ను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని పలువురు నేతలు విమర్శించారు. కేంద్ర మంత్రులు దగ్గుబాటి పురంధేశ్వరి, పనబాక లక్ష్మి ద్వారా అధిష్ఠానం ఓదార్పు యాత్ర విషయంలో ఇచ్చిన సంకేతాలు జగన్‌ వర్గానికి ఎంత మాత్రం మింగుడు పడటం లేదు. హైకమాండ్‌ పేరుతో పురంధేశ్వరి మాట్లాడటమేమిటి, యాత్ర విషయంలో అధిష్ఠానం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలనుకుంటే పార్టీ అధికార ప్రతినిధులు, ఎఐసీసీ ప్రధాన కార్యదర్శుల ద్వారా విడుదల చేస్తుందని, అలా కాకుండా పురంధేశ్వరి ద్వారా ఓదార్పు యాత్రకు ఆదేశాలివ్వాల్సిన కర్మ పార్టీకి పట్టలేదని ఇప్పటికే జగన్‌ శిబిరం నిప్పులు చెరిగింది. దగ్గుబాటి దంపతులే ఓదార్పును అడ్డుకునేందుకు ఈ వ్యూహం వేశారని ఆరోపించింది. కాగా సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్‌ పటేల్‌ చెప్పమన్న విషయాలను మాత్రమే తాను చెప్పడం జరిగిందని, పైగా ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీల ఎదుట హైకమాండ్‌ ఓదార్పు యాత్రపై తన వైఖరి స్పష్టం చేసిందని పురంధేశ్వరి ఆదివారం వైజాగ్‌లో స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన మరో ఎంపి పనబాక లక్ష్మి కూ డా స్పందిస్తూ ఓదార్పు యాత్ర పార్టీకి లాభమా? నష్టమా అన్నది ప్రజలే నిర్ణయిస్తారని, తాను మాత్రం యాత్ర కు వెళ్ళేది లేదని, ఇప్పటికే తన వైఖరి స్పష్టం చేశాను, ఇక పదే పదే దీనిపై మాట్లాడాల్సిన అవసరం లేదని ఆమె ఆదివారం తేల్చి చెప్పారు.

ఒక వైపు అధిష్ఠానం యాత్రకు వెళ్ళొద్దంటూ ఆదేశించినట్లు వార్తలు రావడం, మరో వైపు ప్రకాశం జిల్లాకు చెందిన ఎంపీలు, మరి కొందరు ఎమ్మెల్యేలు తాము అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, అందుకే యాత్రకు వెళ్ళబోమని స్పష్టం చేయడంతో జగన్‌ శిబిరం ఆందోళనలో పడింది. ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్రను సక్సెస్‌ చేయడానికి, అధిష్ఠానం కల్పిస్తున్న అడ్డంకులను అధిగమించేందుకు జగన్‌ శిబిరం సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ‘ఓదార్పు యాత్రకు వెళ్ళక పోతే జనం రాళ్ళతో కొడతారు’ అనే సరికొత్త నినాదాన్ని జగన్‌ శిబిరం తెరమీదకు తీసుకొచ్చి బహుళ ప్రచారం సాగిస్తోంది. ‘90 శాతం మంది వైఎస్‌ అభిమానులు ఉన్నారు, వైఎస్‌ను వ్యతిరేకించినా, ఓదార్పు యాత్రను వ్యతిరేకించినా జనం సహించే పరిస్థితుల్లో లేరు, రాళ్ళతో కొట్టే పరిస్థితి ఉంది’ అని ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ప్రకటించడం, ‘ఓదార్పు యాత్రలో పాల్గొనవద్దని పార్టీ హైకమాండ్‌ స్పష్టంగా ఎక్కడా చెప్పలేదు.

ఈ యాత్రకు వెళ్ళక పోతే ప్రజలు నిలదీస్తారు. రాళ్ళతో కొడతారు. యాత్రను వ్యతిరేకించే నేతలకు కనిగిరి ఎమ్మెల్యేకు పట్టిన గతే పడుతుంది’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ నెల్లూరులో చేసిన వ్యాఖ్యలు పార్టీ ప్రజా ప్రతినిధుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలను రెచ్చగొట్టడం ద్వారా ఓదార్పుకు దూరంగా ఉండే ప్రజా ప్రతినిధులపై ఉసిగొల్పే వ్యూహంలో ఇది భాగమేనని పార్టీ నేతలు కొందరు భగ్గుమంటున్నారు. ఢిల్లీ వెళ్ళి అహ్మద్‌ పటేల్‌తో కలిసి వచ్చిన ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలలో సభ్యుడైన కనిగిరి ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి ఓదార్పు యాత్రలో పాల్గొనే విషయంలో తమ కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆ మేరకు రెండు రోజుల క్రితం తన నియోజకవర్గం కనిగిరిలో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి అభిప్రాయం తెలుసుకున్నా రు.

జగన్‌ శిబిరం నేతలు, కార్యకర్తలుగా చెబుతున్న వారు యాత్రకు వెళ్ళవలసిందే నని పట్టుబట్టి ఒక దశలో ఎమ్మెల్యేపై దాడికి దిగినంత పనిచేశారు. దీంతో ఇదే ఘటన ను జగన్‌ శిబిరం తెరపైకి తీసుకొచ్చి విస్తృత ప్రచారం సాగిస్తూ ప్రజాప్రతినిధుల్లో భయాందోళనలు కల్పిస్తున్నదనే కొందరు నేతలు విమ ర్శిస్తున్నారు. మరో వైపు ఓంగోలు ఎంపి మేకపాటి రాజ్‌మోహ న్‌రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే, మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి తాము జగన్‌ యాత్రలో ఎట్టి పరిస్థితుల్లో పాల్గొంటామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా మరో వైపు జగన్‌ శిబిరం ఓదార్పు యాత్రలో పాల్గొనాలంటూ ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి పెంచడా నికి వివిధ జిల్లాల్లో పలు కార్యక్రమాలు చేపట్టింది. అనం తపురం, ఖమ్మం జిల్లాల్లో జగన్‌ శిబిరం నేతలు ఓదార్పు యాత్ర కు మద్దతుగా ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. అనంతపు రంలో రఘువీరాను సైతం ఘెరావ్‌ చేసినంత పనిచేశారు.

విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్‌ మరో అడుగు ముందుకు వేసి జగన్‌కు బాసటగా నిలిచారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలను జిల్లాకు ఒకటి చొప్పున ఆవిష్కరించాలంటూ హైకమాండ్‌ ఆంక్షలు విధించడాన్ని తప్పుపట్టారు. కేంద్ర మంత్రి పురంధేశ్వరి ద్వారా అహ్మద్‌ పటేల్‌ ఇదే చెప్పించారు. అంతే కాకుండా జిల్లాల్లో వైఎస్‌ విగ్రహాం ఆవిష్కరించే చోటనే బాధితులను పిలిపించి ఆర్ధిక సహాయం చేయాలని ఆయన సూచించారు. అయితే హైకమాండ్‌ సూచనలను లగడపాటి వ్యతిరేకించడమే కాకుండా పరోక్షంగా జగన్‌ కు బాసటగా నిలిచిచారని పార్టీ వర్గాల్లో విమర్శలు భగ్గుమన్నాయి.

కౌంట్‌డౌన్‌ ! బల సమీకరణ మొదలు...

Sonia-gandhi
కాంగ్రెస్‌లో ఇక ఇమడగలిగే పరిస్థితులు కనిపించటం లేదని నిర్ధారణకు వచ్చిన కడప ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కొత్త పార్టీ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తు న్నారా? ఆ పార్టీకి తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ పేరు కానీ, ఇందిరాగాంధీ పేరు కానీ ఖాయం చేయబోతున్నారా?...కాంగ్రెస్‌ వర్గాలలో ఆసక్తిరంగా సాగుతున్న చర్చ ఇది. పార్టీ నుంచి జగన్‌ పోతే పోనీ అని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ కుమార్‌ ముఖర్జీ ఘాటైన వ్యాఖ్యలు చేసినా బెదరని జగన్‌ సోమ, మంగళవారాలలో తన తండ్రి అనాదిగా ప్రాతినిధ్యం వహించి, ప్రస్తుతం తల్లిగారైన విజయమ్మ ఎమ్మెల్యేగా ఉన్న పులి వెందుల నియోజకవర్గం నుంచి రెండురోజుల పాటు ఓదార్పు యాత్ర జరపబోతున్నారు.

జగన్‌ ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడినా చర్యలు తప్పవంటూ ప్రణబ్‌ తొలిసారిగా ఘాటైన హెచ్చరిక చేసినా పట్టించుకోకుండా తన ప్రయ త్నాలు తాను చేసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నాయకత్వం తనపై చర్య తీసుకున్నా, లేకపోయినా కొత్త పార్టీ స్థాపించి ఎఐసిసికి తన దెబ్బ ఏమిటో రుచి చూపించాలన్న ధోరణి జగన్‌లో కనిపిస్తున్నదని పార్టీ వర్గాలు చెబు తున్నాయి. అయితే అధిష్ఠానం మాత్రం నోటి మాటలుగా తప్ప జగన్‌ విషయంలో చేతల్లో ఏ తీవ్రమైన చర్యా తీసుకోవటం లేదు. జగన్‌ ము న్ముందు ఏమి చేయబోతున్నారో తేలిన తర్వాతనే ఏదైనా నిర్ణయించాలని హై కమాండ్‌ భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.

పార్టీ ఏర్పాటు జరిగితే...
ఒకవేళ జగన్‌ ఊహాగానాలను నిజం చేస్తూ స్వంతంగా పార్టీ పెట్టాలనుకుంటేదాని నామకరణం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను రెండుసార్లు ఒంటి చేత్తో అధికారంలోకితీసుకు వచ్చిన తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరు పెట్టాలా? లేక అనాదిగా తమ కుటుంబం నమ్ముకుని ఉన్న కాంగ్రెస్‌కు మకుటం లేని మహారాణిలా వెలిగిన ఇందిరాగాంధీ పేరు పెట్టాలా అనే ఆలోచనలో ఆయన ఉన్నట్టు చెబుతున్నారు. అయితే ఇందిరాకాంగ్రెస్‌ అనే పేరు ఖాయం చేయటానికి కొన్ని ఇబ్బందులున్నాయని ఆంతరంగికులు చెబుతున్నట్టు తెలిసింది.

jagan-speach
ఎఐసిసి అధినేత్రి సోనియా గాంధీ స్వయంగా ప్రతి బహిరంగ సభలో ఇందిర పేరును ప్రస్తావించకుండా ఉపన్యాసాన్ని కొనసాగించని నేపథ్యంలో ఇందిర పేరును తాము వాడుకుంటే రాజకీయంగా పెద్ద ప్రయోజనం ఉండదన్న ఆలోచనను కొందరు అనుయాయులు జగన్‌ వద్ద బయట పెట్టినట్టు చెబుతున్నారు. ఎలాగూ వైఎస్‌ పేరిటనే ఓదార్పు యాత్ర చేస్తున్నారు కాబట్టి పార్టీ పేరును సైతం ఆయన పేరుతోనే కొనసాగిస్తే రాజకీయంగా మనుగడ ఉంటుందన్న ఆలోచన అనుయాయుల నుంచి వస్తున్నట్టు తెలిసింది. పైగా ఈ తరం వోటర్లకు సోనియాగాంధీ తప్ప ఇందిర అంతగా తెలియకపోవ చ్చునని, అలాంటప్పుడు ఆమె పేరు పెడితే మరోరకమైన ఇబ్బంది ఎదురు కావచ్చునని కొందరు జగన్‌తో మాట్లాడినప్పుడు అభిప్రాయపడినట్టు చెబుతున్నారు.

సెప్టెంబర్‌లో సంక్షోభమేనా?
జగన్‌ తీసుకునే ఏ నిర్ణయం అయినా కాంగ్రెస్‌లో సంక్షోభం సృష్టించక తప్పదన్న వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. జగన్‌ పార్టీ నుంచి బయటకు వెళ్తే ఆయన వెంట ఏమేర ఎమ్మెల్యేలు, ఎంపీలు వెళ్తారన్న దానిపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఒకవేళ జగన్‌ గణనీయమైన సంఖ్యలో ఎమ్మెల్యేలను చీల్చుకుపోతే రోశయ్య సర్కారు భవితవ్యం ఎలా ఉంటుందన్న చర్చ సైతం పార్టీ వర్గాలో జోరుగానే సాగుతున్నది. అంటే తన తండ్రి ప్రథమ వర్ధంతి వచ్చేనెల రెండున జరగనున్న నేపథ్యంలో ఆ రోజు కానీ, ఆ తర్వాత కానీ జగన్‌ తీసుకునే ఏ నిర్ణయం అయినా పార్టీలో సంక్షోభానికి తెర తీయక తప్పదన్న ఊహాగానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

వచ్చేనెలలో ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో జరపబోయే ఓదార్పు యాత్రకు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, నెల్లూరు ఎంపీ మేకపాటిరాజమోహన్‌రెడ్డి, ఆయన సోదరుడు చంద్రశేఖరరెడ్డి, మరి కొందరు నేతలు బహిరంగంగా మద్దతు పలికారు. ఓదార్పు యాత్ర ఏర్పాట్లన్నీ బాలినేని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. యాత్ర జరపటం ఖాయం అని, ఇష్టం ఉన్న వారు రావచ్చునని, లేనివారు రాకపోయినా బలవంతం ఏమీ లేదని బాలినేని ఇప్పటికే స్పష్టం చేశారు. ఇటీవల ఢిల్లీలో తనను కలిసిన నేతలకు జగన్‌ సైతం ఇదే మాట చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఈ లెక్కన పార్టీలో పెను సంక్షోభం సృష్టించి తన సత్తా ఏమిటో కాంగ్రెస్‌ నాయకత్వానికి చూపించాలని జగన్‌ వ్యూహ రచన చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. సోమ, మంగళ వారాలలో స్వంత జిల్లాలో జరిపే ఓదార్పు యాత్ర సందర్భంగా తనకు అనుకూలురైన ఎమ్మెల్యేలతో భవిష్యత్‌ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి.

బల సమీకరణ మొదలు...
ఢిల్లీ వెళ్ళి అధిష్ఠానం మనుషులతో మాట్లాడిన తర్వాత ఇక తనను పార్టీ పట్టించుకునే స్థితిలో లేదని నిర్ణయానికి వచ్చినజగన్‌, శనివారం తన మద్దతుదారులతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. తన రాజకీయ భవిష్యత్తుపై నీలి నీడలు ముసిరేలా దగ్గుబాటి దంపతులు చేశారని ఆగ్రహంగా ఉన్న జగన్‌, తన మనుషులతో వారిపై కారాలు, మిరియాలు నూరిస్తున్నారు. వరంగల్‌ జిల్లా ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి లాంటి వారి ద్వారా కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరిని, మరో మంత్రి పనబాక లక్ష్మిని తీవ్రంగా విమర్శించేలా చేస్తున్నారు.

అలా చేస్తూనే మరోవైపు ప్రముఖులు అనుకున్న వారితో స్వయంగా మాట్లాడి అనుకూలంగా మలచుకుంటున్నారు. అలా రోజు రోజుకూ తనకు మద్దతు దారులు పెరిగేలా చూసుకుంటున్నారు. తాజాగా విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ రంగ ప్రవేశం చేశారు. ఓదార్పు యాత్ర విషయంలో కానీ, మరో అంశంపై కానీ ఎక్కువగా వ్యాఖ్యలు చేయని లగడపాటి, హఠాత్తుగా తెరపైకి వచ్చి జిల్లాకు ఒక వైఎస్‌ఆర్‌ విగ్రహం ఉంటే సరిపోతుందని అధిష్ఠానం చెప్పినట్టు వచ్చిన వార్తలపై మండి పడ్డారు. అది సరైన నిర్ణయం కాదని స్పష్టం చేశారు. ఇప్పటికే నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి యాత్రకు మద్దతు ఇచ్చిన నేపథ్యంలో లగడపాటి అదనంగా జగన్‌కు అండగా మిగిలారు.

హడావుడి లేకుండానే...
తన పట్ల అధిష్ఠానం అనుసరిస్తున్న వైఖరికి రగిలిపోతున్న జగన్‌ ఎలాంటి హడావుడీ లేకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. ఏమి చేస్తున్నదీ పది మందికి తెలియకుండా అత్యంత జాగరూకతతో వ్యవహరిస్తున్నా రు. ప్రతి జిల్లాలో తన వారెవరో, పరాయివారెవరో అంచనాలు వేసుకుంటున్నారు. తన సర్వేలు తనకు ఉన్నాయని ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఎమ్మెల్యేలతో కొద్ది రోజుల క్రితమే చెప్పిన ఆయన వాటి ప్రకారమే తన బలం ఎంతో, స్థాయి ఏమిటో అంచనాలు వేసుకుంటున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో సెప్టెంబర్‌ మాసం కాంగ్రెస్‌ పార్టీ పాలిట సంక్షోభ మాసం అవుతుందా? సామరస్యంగా ముగుస్తుం దా అనేది చూడాల్సి ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కొందరు అభిప్రాయపడ్డారు.

అధిష్ఠానం చెప్పిందే చెప్పా - పురంధేశ్వరి
D.Purandhareswar
ఓదార్పు యాత్రపై వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పలేదు, రాష్ట్ర నేతలందరి సమక్షంలో అహ్మద్‌ పటేల్‌ ఏం మాట్లాడారో అదే మీడియాకు చెప్పా.

రోశయ్య సర్కారుపై కుట్ర - జి. వెంకటస్వామి
venkataswami
రోశయ్య ప్రభుత్వాన్ని కూల్చడానికి ఒక వర్గం కుట్ర పన్నుతున్నది. సీడబ్యూసీలో సభ్యుడినైనందున కుట్ర దారుల పేర్లు వెల్లడించలేను

రాకపోతే ప్రతిఘటన తప్పదు - మేకపాటి
mekapatichandra
ఓదార్పునకు రాకపోతే జనం నుంచి తీవ్ర ప్రతిఘట నలను నేతలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాష్ట్రానికి జగన్‌లాంటి నేత కావాలి.

విషం చిమ్ముతున్న నేతలు - కొండా సురేఖ
sureka
జగన్‌పై కాంగ్రెస్‌ పార్టీలోనే కుట్ర జరుగుతున్నది. ఓదార్పుయాత్రపై మాట్లాడే అర్హత దగ్గుబాటి దంపతులకు ఏమాత్రం లేదు.

ఓదార్పు ఎంత లాభం ?

jagan-sir
తమను కలుసుకునేందుకు వచ్చిన వారితో ఓదార్పు యాత్రకువెళ్ళొద్దని చెప్పటమే తప్ప అధికారికంగా కాంగ్రెస్‌ అధిష్ఠానం ఏ ప్రకటనా చేయని నేపథ్యం లో కడప ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సోమ, మంగళవారాలలో మరోసారి ఓదార్పు యాత్రకు సిద్ధమయ్యారు. దశాబ్దాల తరబడి తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన కడప జిల్లాలో, అందులోనూ ఆయన ఎంతో ఇష్టపడే పులివెందుల శాసనసభా స్థానం నుంచి ఈ యాత్ర మొదలు కావటం ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నది.

ఓదార్పు యాత్రకు ఎవరూ వెళ్ళటానికి వీలు లేదని హై కమాండ్‌ కరాఖండిగా తేల్చి చెప్పినట్టు కేంద్ర మంత్రులు పురంధ్రీశ్వరి, పనబాక లక్ష్మి, మరి కొందరు సీనియర్‌ నేతలు బాహాటంగా ప్రకటనలు చేయటం, యాత్రలో పాల్గొనవద్దని అధినేత్రి సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌ తనకు చెప్పినట్టు ముఖ్యమంత్రి రోశయ్య అందరితో చెబుతున్న నేపథ్యంలో జగన్‌ వాటిని గమనంలోకి తీసుకోకుండా, ఏమాత్రం ఖాతరు చేయకుండా మరోసారి ఓదార్పు యాత్రకు సిద్ధమయ్యారు. దీని పర్యవసానాల మాట ఎలా ఉన్నా స్వంత జిల్లాలో తన సత్తా ఏమిటో హై కమాం డ్‌కు చూపాలన్న జగన్‌ ఆరాటం స్పష్టంగా బయటపడుతున్నది.

లాభ నష్టాల బేరీజు?
రెండు రోజుల ఓదార్పు యాత్ర విజయవంతం అవుతుందా లేదా అనే సందేహం జగన్‌కు లేదు. అయితే సమీప భవిష్యత్తులో తాను రాజకీయంగా వేయబోయే అడుగులకు సానుకూల వాతావరణం స్వంత జిల్లాలో ఉందా లేదా అనే బేరీజు వేసుకోవ టానికే ఆయన ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. తన యాత్రకు జనం మద్దతు ఉందని, ఎమ్మెల్యేలు వచ్చినా రాకపోయినా భవిష్యత్తులో పార్టీకి అండగా ఉండేది ప్రజలే కాబట్టి వారి కోరిక మేరకే యాత్ర జరుపుతున్నానని అధిష్ఠానానికి మరోసారి జగన్‌ గుర్తు చేయదలచుకున్నారు. అదే సమయంలో భవిష్యత్తులో తనకు ఈ యాత్ర ఏమేర మేలు చేయగలదో బేరీజు సైతం వేసుకోనున్నారు.

అధికారంలో ఉండగా రాజశేఖరరెడ్డి జిల్లాకు అందులోనూ పులివెందుల నియోజకవర్గానికి చేసిన మేలు అక్కడి ప్రజలు అంత సులభంగా మరచిపోరు. ఇడుపులపాయలో ఆర్‌జెయు గేట్‌ ఏర్పాటు చేయించి విద్యాపరంగా, బ్రహ్మాండమైన రహదారులకు నిధుల కేటాయింపు, సాగు, తాగునీటి రంగానికి ప్రాధాన్యం...ఇలా జిల్లాకు తన శక్తి మేరకు ఏమేమి చేయాలో అన్ని ప్రయోజనాలనూ వైఎస్‌ సమకూర్చారు. ఫలితంగా ఆయన అన్నా, జగన్మోహన్‌రెడ్డి అన్నా జిల్లా ప్రజానీకానికి అభిమానం ఉండటం సహజమే. అయితే ఈ అభిమానం జగన్‌ వేరు కుంపటి పెట్టుకున్నా కొనసాగుతుందా లేక అది కాంగ్రెస్‌ పార్టీ వైపు బదిలీ అవుతుందా అనేదే ఇప్పుడు ప్రశ్న. వచ్చేనెలలో ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో సుదీర్ఘంగా ఓదార్పు యాత్ర జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న జగన్‌కు స్వంత జిల్లాలో ఎదురయ్యే అనుభవం పైనే తర్వాతి యాత్రల పరిస్థితి అంచనా వేయ వచ్చునని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

వద్దంటున్నది ముగ్గురే...
జిల్లాలో 10 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఒకరు (ప్రొద్దుటూరు ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి-టీడీపీ) మినహా మిగిలిన వారంతా కాంగ్రెస్‌ వారే. అయితే ప్రాథమిక విద్య, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అహ్మదుల్లా సయ్యద్‌ (కడప), డీఎల్‌ రవీంద్రరెడ్డి (మైదుకూరు), జి.వీరశివారెడ్డి (కమలాపురం) తప్ప మిగిలిన ఆరుగురూ వైఎస్‌ వీరాభిమానులే...వైఎస్‌ స్థానంలో ఎన్నికైన జగన్‌ తల్లిగారు విజయమ్మ, కె.శ్రీనివాసులు (కోడూరు), జి.శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి), ఆదినారాయణరెడ్డి (జమ్మల మడుగు), అమరనాథరెడ్డి (రాజంపేట), కమలమ్మ (బద్వేలు) ఓదార్పు యాత్రకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు.

ప్రొద్దుటూరు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఓటమిపాలైన వరదరాజులు రెడ్డి లాంటి సీనియర్లు యాత్రకు దూరంగా ఉంటారన్న వార్తలు వస్తున్నాయి. వైఎస్‌ జీవించి ఉన్నంత దాకా ఆయనకు తిరుగు లేదు కాబట్టి జిల్లాలో పలువురు సీనియర్‌ నేతలు ఆయనకు అండగా ఉన్నారు. డీఎల్‌ లాంటి వారు అలాంటి వారే. ఇప్పుడు ఆయన లేకపోవటంతో డీఎల్‌, వీరశివ లాంటి వారు గళాలు పెంచారు. ఈ నేపథ్యంలో జగన్‌ నిర్వహించ తలపెట్టిన స్వంత జిల్లా ఓదార్పు యాత్ర రాజకీయంగా ప్రాధాన్యం సంతరించు కోవటంతో పాటు సమీప భవిష్యత్తులో ఆయన అనుసరించ బోయే వ్యూహాలకు సైతం నాందిగా నిలవనున్నది.

పులి జూదం.. క్లైమాక్స్ దిశగా యాక్షన్ సీన్ సొంత గడ్డ పులివెందులలో సోమ, మంగళవారాల్లో జగన్ పర్యటన

12 కుటుంబాలకు ఓదార్పు
ప్రకాశం యాత్రకు ముందు బల ప్రదర్శన
ఇది 'సెమీఫైనల్' అంటున్న నేతలు
సన్నిహితులతో జగన్ మంతనాలు
ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచే వ్యూహం
నిశితంగా గమనిస్తున్న అధిష్ఠానం
గీత దాటే వారిపై వేటు ఖాయం!
ఈటెల్లాంటి మాటల వేట కొనసాగుతుండగానే, అసలు ఆటకు తెర లేస్తోంది. క్లైమాక్స్ దిశగా యాక్షన్ సీన్ మొదలవుతోంది. అధిష్ఠానం ఆదేశాలను తోసిరాజంటూ, హెచ్చరికలను బేఖాతరు చేస్తూ కడప ఎంపీ జగన్, ఓదార్పు యాత్రతో ముందుకు వెళ్లడానికే నిర్ణయించుకున్నారు. ఓదార్పును పార్టీపరంగా చేయాలన్న హైకమాండ్ హితబోధను ఏమాత్రం పట్టించుకోకుండా ఆయన వ్యక్తిగతంగానే యాత్రకు వెళ్లబోతున్నారు.

స్వస్థలమైన కడప జిల్లాలో, కంచుకోట వంటి పులివెందులలో సోమ, మంగళవారాల్లో జగన్ పర్యటించబోతున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన 12 మంది కుటుంబాలను ఆయన ఈ సందర్భంగా ఓదారుస్తారు. ఓదార్పునకు సంబంధించిన కార్యాచరణపై జగన్ ఆదివారం పలువురు నేతలతో చర్చించారని ఆయన సన్నిహిత వర్గాలు చెప్పాయి. వైఎస్ వర్ధంతి మరుసటి రోజు నుంచి ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్రను ఎట్టి పరిస్థితుల్లోనూ చేపట్టి తీరాలని ఈ సందర్భంగా నిర్ణయించినట్టు తెలిసింది.

తూర్పు గోదావరి జిల్లాలో ఓదార్పు ముగిశాక, సంధి-సయోధ్య కోసం జరిగిన పలు యత్నాలు విఫలమైన నేపథ్యంలో... దశాబ్దాలుగా తమ కుటుంబాన్ని ఆదరిస్తున్న కడప జిల్లాలో పర్యటన తలపెట్టడం ద్వారా జగన్, అధిష్ఠానానికి నేరుగా సవాలు విసురుతున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో చేపట్టే యాత్రకు ముందే, సొంత జిల్లాలో సత్తా చాటడం జగన్ లక్ష్యమని వారు విశ్లేషిస్తున్నారు. కడప జిల్లాలో జగన్ యాత్రను 'సెమీ ఫైనల్'గా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇక 'ఫైనల్'కు చేరుకునే దాకా... అం టే ప్రకాశం యాత్ర చేపట్టే సెప్టెంబర్ 3 దాకా అధిష్ఠానం ఆగుతుందా? లేక ఆ లోగానే చర్యలు తీసుకుంటుందా? అన్నది అసలు ప్రశ్న. పార్టీ శ్రేణుల్లో ఇప్పుడు దీనిపైనే జోరుగా చర్చ సాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓదార్పు యాత్రకు వెళ్లవద్దని స్పష్టం చేసిన సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ, ఏకంగా 'జగన్ పార్టీలో ఉంటే ఎంత? పోతే ఎంత?' అని వ్యాఖ్యానించడంతో, గీత దాటితే జగన్‌పై క్రమశిక్షణ చర్య తప్పదని స్పష్టమైంది. అయితే అది ఎప్పుడు? ఎవరు ముందుగా అడుగు ముందుకు వేస్తారు? అన్నవే ఇప్పుడు కీలక ప్రశ్నలు.

వ్యూహ ప్రతివ్యూహాలు
ఆఖరి అంకానికి సమయం సమీపిస్తుండడంతో, రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం కూడా అదే స్థాయిలో తీవ్రమవుతోంది. పురందేశ్వరి, పనబాక లక్ష్మి, కేశవరావు, హర్షకుమార్, సర్వే సత్యనారాయణ, మధుయాష్కీ వంటి వారు ఒకవైపు మోహరించగా, అంబటి రాంబాబు, వైఎస్ వివేకానందరెడ్డి, సబ్బం హరి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కొండా సురేఖ, పుల్లా పద్మావతి వంటివారు మరోవైపు మోహరించారు.

స్థూలంగా చూస్తే, ఇప్పుడు పార్టీలో హైకమాండ్ వర్గం, జగన్ వర్గం అనే రెండు గ్రూపులు, వాటి మధ్య విభజన రేఖ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వ్యక్తుల కంటే పార్టీ ప్రధానమని అధిష్ఠానం చెబుతున్నప్పటికీ, వైఎస్ తనయుడిగా ప్రజల్లో కరిష్మా ఉ న్న జగన్ వెంట వెళ్లేందుకే తాము మొగ్గు చూపుతామని ఆయన వర్గం చెబుతోంది. పలువురు ప్రజా ప్రతినిధులు, ముఖ్యంగా శాసనసభ్యులు మాత్రం అధిష్ఠానం మాటను శిరసావహిస్తామని స్పష్టంచేస్తున్నారు.

దీంతో వారిని దారిలోకి తెచ్చుకునేందుకు జగ న్ వర్గం ఒత్తిడిని పెంచుతోంది. ఈ వర్గానికి చెందిన వారు గత 2 రోజులుగా కేంద్ర మంత్రులు పనబాక లక్ష్మి, దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్యేలు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఉగ్ర నరసింహారెడ్డిల దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారు. "వైఎస్ వల్లే అసెంబ్లీకి ఎన్నికైనందున, శాసనసభ్యులు ఓదార్పు యాత్రలో పాల్గొనాలని ఈ ప్రాంత ప్రజలు అడుగుతున్నారు'' అని వైఎస్ కుటుంబానికి సన్నిహితుడైన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు.

ప్రజా ప్ర తినిధుల్లో అత్యధికులు అధిష్ఠానం బాట పట్టడంతో, జగన్ వర్గం, జిల్లాల వారీగా కింది స్థాయి నాయకులతో మాటా మంతీ జరుపుతోంది. పంచాయతీల్లోనూ, మునిసిపాలిటీల్లోనూ, పార్టీ సమావేశాల్లోనూ ఓదార్పు యాత్రకు అనుకూలంగా తీర్మానాలు చేయిం చి ఒత్తిడి పెంచే వ్యూహాన్ని అమలు చేస్తోంది. దీన్ని గమనించిన ప్రజా ప్రతినిధులు కూడా ఓదార్పును అధిష్ఠానం ఏ మాత్రం వద్దన లేదని, జిల్లా కేంద్రంలో బాధితులతో కలిపి పార్టీ పరంగా చేయాలని చెబుతోందని, అయితే జగన్ అందుకు అంగీకరించడం లేదని కార్యకర్తలకు వివరిస్తున్నారు.

మరోవైపు 'తిరుమలలో అక్రమాలు- తనపై ఆరోపణల'కు నిరసనగా నిరాహార దీక్ష చేపట్టిన టీటీడీ పాలకమండలి మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డికి జగన్ వర్గీయులు సంఘీభావం ప్రకటిస్తున్నారు. సెప్టెంబర్ 2న తిరుపతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన నేపథ్యం లో ఇప్పటి నుంచే వేడి రాజేస్తున్నారు. యాత్ర జరిగే ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యే కొండా సురేఖ పర్యటిస్తూ, దగ్గుబాటి దంపతులపై విమర్శనాస్త్రాలు గుప్పిస్తూ, కాక పుట్టిస్తున్నారు.

రాష్ట్రంలో పరిణామాలను నిశితంగా గమనిస్తున్న అధిష్ఠానం, కట్టుదాటిన వారిపై క్రమశిక్షణ వేటు వేసేందుకే సిద్ధమవుతున్నట్టు సీనియర్ నేతలు చెబుతున్నారు. రెండు వర్గాలూ దేనికవి పట్టిన పట్టు వీడకుండా, ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతుండడంతో, ఈ నెలాఖరులో, సెప్టెంబర్ తొలి వారంలో కాంగ్రెస్ రాజకీయాల్లో పెను మార్పులు తప్పవని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

Friday, August 13, 2010

వద్దే వద్దు! పార్టీ నేతలకు సోనియా ఆదేశం - కేంద్ర మంత్రి ద్వారా సందేశం

 
తాడోపేడో తేల్చేందుకే సిద్ధం
జగన్ వెంట ఎందరున్నారని ఆరా
వ్యతిరేకుల స్వరానికి ప్రోత్సాహం
ముందుకే వెళతానంటున్న జగన్
ప్రకాశంలో యాత్ర పొడిగింపు!
వైఎస్ సభ పోస్టర్ ఆవిష్కరణ
మళ్లీ ఆదేశం.... ఈసారి ఏకంగా అధినాయకురాలి నుంచే!
అదే నిర్దేశం... పార్టీ శ్రేణులన్నింటికీ స్పష్టమైన సందేశం!
'ఓదార్పు యాత్రలో కాంగ్రెస్ వాదులెవరూ పాల్గొన వద్దు!'
ఇదీ స్వయంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ జారీ చేసిన తాజా హుకుం!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ వర్ధంతి మరుసటి రోజు (సెప్టెంబర్ 3) నుంచి, ప్రకాశం జిల్లాలో ఓదార్పు (మూడో విడత) యాత్రను కొనసాగించాలని కడప ఎంపీ జగన్ నిర్ణయించుకోవడంతో ఇక మేడమ్ సోనియగాంధీయే రంగంలోకి దిగారు. యాత్రకు కాంగ్రెస్ నేతలెవరూ వెళ్లవద్దని, తన మాటగా దీన్ని పార్టీ శ్రేణులకు చెప్పాలని ఆమె ఓ కేంద్ర మంత్రికి సూచించారు. సదరు కేంద్ర మంత్రి శుక్రవారం పార్లమెంటు సెంట్రల్‌హాల్‌లో సోనియాను కలిశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... వారిద్దరి మధ్య సంభాషణ ఇలా సాగింది.

కేంద్ర మంత్రి: ఓదార్పు యాత్రలో పాల్గొనడంపై పార్టీ వాదుల్లో అయోమయం ఉంది. ఈ విషయంలో అధిష్ఠానం నుంచి ఇంతవరకూ స్పష్టత లేదు. సోనియా: అయోమయం లేనే లేదు. ఓదార్పు యాత్రలో మీరు పాల్గొనొద్దు. మీరు పాల్గొనక పోవడమే కాదు; మీ తోటి కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు కూడా, యాత్రకు వెళ్లవద్దని స్పష్టంగా చెప్పండి.

కేంద్ర మంత్రి: యాత్ర విషయంలో దళిత ఎమ్మెల్యేలు, ఎంపిీలు, మంత్రులు ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. సోనియా: ఎలాంటి ఆందోళనా అవసరం లేదు. ఒత్తిడి ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు ధైర్యం చెప్పండి. వారికి అండగా నేనున్నాను. కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఇచ్చేది అధిష్ఠానమే అని, వారికి ఎలాంటి నష్టం ఉండదని భరోసా ఇవ్వండి.

కేంద్ర మంత్రి: ఎమ్మెల్యేలకు మా స్థాయిలో మేం చెబుతాం. అయితే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ ఈ విషయంలో పార్టీ నేతలకు సరైన మార్గదర్శక సూత్రాలు జారీ చేయలేదు. పైగా ఆ యాత్ర జగన్ వ్యక్తిగతమంటూ ప్రకటనలు చేస్తున్నారు. సోనియా: ఏడీ? వీరప్ప మొయిలీ ఎక్కడ? ఆయనతో నేను తర్వాత మాట్లాడతాను. ఇలా చెప్పిన సోనియా, అన్నట్టుగానే తర్వాత మొయిలీని పిలిపించుకుని మాట్లాడారు. ఆ తర్వాత మొయిలీ విలేఖరులకు అందుబాటులోకి వచ్చినప్పటికీ, ఓదార్పు గురించి మాట్లాడడానికి నిరాకరించారు. జగన్ సెప్టెంబర్ 3 నుంచి జగన్ యాత్ర చేస్తున్నట్లు తనకు సమాచారం లేదన్నారు.

సోనియాతో గురువారం నాటి తన సమావేశం వివరాలు మీడియాలో రావడం పట్ల మొయిలీ అసహనం వ్యక్తం చేశారు. కాగా జగన్ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో ఎంతమంది ఆయనకు మద్దతుగా ఉన్నారని సదరు కేంద్ర మంత్రిని సోనియా ఆరా తీశారు. జగన్ యాత్రకు వ్యతిరేకంగా బహిరంగంగా, గట్టిగా మాట్లాడే వారు రాష్ట్రంలో ఎవరెవరు ఉన్నారని కూడా మేడమ్ అడిగినట్టు సమాచారం. అలాంటి వారిని గుర్తించి, తనకు తెలియజేయాలని, వారిని ప్రోత్సహిద్దామని ఆమె అన్నట్టు తెలిసింది.

మొత్తమ్మీద వద్దన్నా యాత్రకు వెళుతున్న జగన్ విషయంలో అధిష్ఠానం క్రమంగా పట్టు బిగిస్తున్నట్టే కనిపిస్తోంది. ఇప్పటిదాకా ఈ విషయంలో ఎలాంటి ప్రత్యక్ష వ్యాఖ్యలు చేయని సోనియా, స్వయంగా రంగంలోకి దిగడం హైకమాండ్ సీరియస్‌నెస్‌ను సూచిస్తోందని పార్టీ నేతలు చెబుతున్నారు. చూస్తుంటే, రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని హైకమాండ్ త్వరలోనే చక్కదిద్దబోతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు. గీత దాటితే సహించేది లేదన్న స్పష్టమైన సంకేతాలే ఇందుకు స్పష్టమైన ఉదాహరణ అని చెబుతున్నారు.

హైదరాబాద్: అధిష్ఠానం వైఖరి ఎలా ఉన్నా, ఓదార్పు యాత్రలో ముందుకు వెళ్లడానికే జగన్ నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. యాత్రలో పార్టీ వాదులు పాల్గొన వద్దన్న సోనియా నిర్దేశం వెలువడిన కొద్ది గంటల్లోనే జగన్, ఓదార్పు ఆపే ప్రసక్తే లేదని సన్నిహితులకు స్పష్టంచేశారు. అంతేకాదు, ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్రకు ముందు అనుకున్నట్టుగా వారం రోజులు సరిపోదని, పొడిగించాలని నిర్ణయించడం గమనార్హం.

ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన జగన్‌ను ఎమ్మెల్యేలు కొండా సురేఖ, ఆదినారాయణరెడ్డి, శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కలిశారు. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి రూపొందించిన వైఎస్ సంస్మరణ సభ పోస్టర్లను జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్ర విషయం చర్చకు వచ్చింది.

జిల్లా వ్యాప్తంగా వైఎస్ విగ్రహాల స్థాపనకు కార్యకర్తలు పట్టుబడుతున్నందున యాత్రకు వారం రోజులు చాలదని, చాలా రోజులు పట్టేలా ఉందని జగన్ పేర్కొన్నారు. అధిష్ఠానం అవునన్నా కాదన్నా ఓదార్పు ఆగే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అటు నెల్లూరు యాత్రకూ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎంపీ మేకపాటి సోదరులు ఈ బాధ్యత తీసుకున్నారు. ఇది ఆనం (రామనారాయణరెడ్డి, వివేకానందరెడ్డి) సోదరులకు మింగుడు పడడం లేదన్న ప్రచారం సాగుతోంది.

నెల్లూరు జిల్లా పర్యటన విషయంలో జగన్, ఆనం సోదరులను ఇప్పటి వరకూ సంప్రదించకపోవడం చర్చనీయాంశమైంది. అధిష్ఠానం తాజా నిర్దేశం నేపథ్యంలో జగన్ ప్రకాశం యాత్రలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు పాల్గొంటారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. వరంగల్ జిల్లా మహబూబాబాద్ ఘటన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన యాత్రలో ప్రజా ప్రతినిధులెవరూ పాల్గొన లేదు. అయితే వారి కుటుంబ సభ్యులు, బంధువులు హాజరయ్యారు. తూర్పు గోదావరి జిల్లాలో మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌తో సహా పలువురు ప్రజా ప్రతినిధులు యాత్రలో పాల్గొన్నారు. ఇక ప్రకాశంలో ఏం జరుగుతుందో చూడాలి.

Wednesday, July 28, 2010

కాకినాడలో తెగదెంపుల సంగ్రామమా? జ'గన్' పేలేనా? అటు విప్... ఇటు నిప్పు నేడు 'బల ప్రదర్శన'

తూర్పుగోదావరిలో ఓదార్పు ముగింపు
సభకు రావాలంటూ ఎమ్మెల్యేలకు పిలుపు
35 మంది శాసనసభ్యులు వస్తారని అంచనా
మరింత బయటపడ్డ వర్గ విభేదాలు
తారాస్థాయికి చేరిన మాటల యుద్ధం
 
అధిష్ఠానంతో ఇక అతకనంత దూరం
బెడిసి కొట్టిన సయోధ్య యత్నాలు
సోనియా మాట ఎత్తేందుకు యువనేత ససేమిరా
తదుపరి ఓదార్పు ప్రకాశం జిల్లాలో!

కాంగ్రెస్‌లో 'కదన స్వరాలు' పురి విప్పుతున్నాయి. వర్గాల మధ్య విభజన రేఖలు మరింత స్పష్టంగా బయటపడుతున్నాయి. బుధవారం రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. 'కాంగ్రెస్‌కు జగన్ తప్ప మరో దిక్కులేదు' అని జగన్ వర్గీయులు పేర్కొనగా... 'మరేం ఫర్వాలేదు! ఆయన పార్టీని వదిలి వెళ్లిపోవచ్చు' అనేలా ప్రత్యర్థులు ఒకింత దీటుగానే బదులిచ్చారు.

సస్పెన్షన్ వేటు పడిన అంబటి రాంబాబు మరోమారు గళమెత్తగా... నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మొట్టమొదటిసారి బహిరంగంగా జగన్‌కు జై కొట్టారు. వీరిద్దరి వ్యాఖ్యలపై ఎంపీలు సర్వే సత్యనారాయణ, వి.హనుమంతరావు, ఎమ్మెల్యే శంకర్‌రావు మండిపడ్డారు. మొత్తానికి... వారూ వీరూ కలిసి కథను మరింత త్వరగా 'క్లైమాక్స్' చేర్చే సంకేతాలు పంపుతున్నారు.

జగన్ వ్యవహారాన్ని దగ్గరుండి పరిశీలించాలని అధిష్ఠానం ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇందులో భాగంగానే వచ్చేనెల 6న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ హైదరాబాద్‌కు వస్తున్నట్లు సమాచారం. అలాగే.. 4వ తేదీన జరగనున్న రాష్ట్ర కేబినెట్ భేటీలోనూ జగన్‌కు సంబంధించిన చర్చ జరిగే అవకాశముంది.

ఇన్ని పరిణామాల మధ్య... తూర్పు గోదావరి జిల్లాలో షెడ్యూలుకు అతీతంగా సాగిన జగన్ ఓదార్పు యాత్ర ముగింపు సభ గురువారం జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు వివిధ జిల్లాల ఎమ్మెల్యేలు, నేతలు కాకినాడకు చేరుకున్నారు. సభను జగన్ వర్గీయులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దీనిని 'బహిరంగ బల ప్రదర్శన'కు వేదికగా మారుస్తున్నారు. సభలో పాల్గొనాల్సిందిగా నేతలకు సమాచారం పంపారు.

తన వర్గీయుడైన అంబటి రాంబాబుపై సస్పెన్షన్ వేటు వేసినా తమాయించుకున్న జగన్... గురువారం నాటి సభలో అధిష్ఠానంపైనా, రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంపైన మాటల తూటాలు పేల్చే అవకాశముందని ఆయన వర్గీయులే అంటున్నారు. శ్రీకాకుళం జిల్లా ఓదార్పు యాత్ర ముగింపు సందర్భంగా రణస్థలంలో ముఖ్యమంత్రి రోశయ్యను ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలాన్ని రేపాయి.

ఇప్పుడు కూడా తన యాత్రలో పాల్గొనకుండా ఎమ్మెల్యేలను రోశయ్య అడ్డుకుంటున్నారని జగన్ భావిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన రాష్ట్ర నాయకత్వంతో పాటు, అధిష్ఠానంపైనా నిప్పులు చెరిగే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే... అధిష్ఠానానికి తమ బలం చూపడమే లక్ష్యమని, జగన్ రాజకీయంగా సంచలన వ్యాఖ్యలు ఏవీ చేయబోరనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. గురువారం జగన్ అలాంటి వ్యాఖ్యలు చేసినా, చేయకపోయినా... ఆయనకూ, అధిష్ఠానానికీ మధ్య పరిస్థితి ఇప్పటికే 'ఉప్పూ, నిప్పు'లా మారింది.

విపక్షాల వాయిదా తీర్మానం నేపథ్యంలో బుధవారం పార్టీ ఎంపీలంతా లోక్‌సభకు హాజరు కావాలని కాంగ్రెస్ విప్ జారీ చేసింది. పార్లమెంటు సమావేశాల గురించి పట్టించుకోని జగన్... విప్‌ను కూడా పక్కకు పడేశారు. ఓదార్పు యాత్రలోనే ఉన్నారు. గురువారం బహిరంగ సభలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. వీటన్నింటి నేపథ్యంలో కడప ఎంపీకి, కాంగ్రెస్ అధిష్ఠానానికీ మధ్య అగాథం పూడ్చలేనంతగా పెరుగుతోంది.

జగన్ కాంగ్రెస్‌లోనే ఉండాలని భావిస్తున్న ఆయన వర్గీయులకు ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోంది. 'రాజీకి మార్గాలు మూసుకుపోయి కనిపిస్తున్నాయి. ఇలాంటి ధిక్కారాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం సహించే ప్రసక్తి ఉండదేమో!' అని జగన్ శ్రేయోభిలాషుల్లో ఒకరైన ఎంపీ సబ్బం హరి సైతం అభిప్రాయపడటం గమనార్హం. అధిష్ఠానం మాట ఎలా ఉన్నా... సయోధ్యకు యువనేతే ససేమిరా అంటున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా పేరెత్తడానికే ఆయన ఇష్టపడటంలేదని తెలుస్తోంది. తాము అధిష్ఠానం మాటను ధిక్కరించలేమని, ఇదే సమయంలో జగన్‌ను వదులుకునేందుకు కూడా సిద్ధంగాలేమని ఆయన వర్గీయుల్లోనే కొందరు అంటున్నారు. వీరు సయోధ్య యత్నాలకు శ్రీకారం చుట్టారు. కొందరు నేతలు ఇటీవల వైఎస్ బంధువు వైవీ సుబ్బారెడ్డిని కలివారు.

జగన్‌కు, అధిష్ఠానానికి మధ్య పెరుగుతున్న దూరాన్ని తగ్గించేందుకు చొరవ చూపాలని సూచించారు. వారి సూచనలతో వైవీ సుబ్బారెడ్డి కూడా ఏకీభవించారు. అయితే... 'నేను జగన్‌కు ఎలాంటి సలహాలూ ఇవ్వను. మీలో ఎవరో ఒకరు ఆయనను కలసి చెప్పాలనుకున్నది చెప్పండి' అని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఒకరు తూర్పు గోదావరి జిల్లా ఓదార్పు యాత్రలో ఉన్న జగన్‌తో సమావేశమయ్యారు. అధిష్ఠానంతో వైరం పెంచుకుంటూ పోవడంకంటే.. సయోధ్యతో ముందుకు సాగడమే మంచిదని తెలిపారు. ఓదార్పు యాత్రలో సోనియాను ప్రశంసిస్తూ ప్రసంగించాలని సూచించారు. దీనికి జగన్ ససేమిరా అన్నారు.
'నా ఓదార్పు యాత్రకు సోనియా అనుమతి ఇవ్వలేదు. ఇది జగమంతటికీ తెలుసు. ఓదార్చేందుకు వస్తానని పావురాలగుట్ట సభలోనే ప్రకటించాను. ఆ మాటను నిలబెట్టుకుంటున్నాను. నాన్న రక్తం నాలో ప్రవహిస్తోంది. బాధిత కుటుంబాలను ఓదార్చాల్సిన బాధ్యత నాపై ఉంది.

ఇదే విషయాన్ని అధిష్ఠానానికి వివరించాను. యాత్ర పట్ల సోనియా సుముఖతను వ్యక్తం చేయలేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ యాత్రలో సోనియాను ప్రశంసించాలని నాతో ఎలా చెబుతారు? ఇది సాధ్యం కాదు. ఆ ఆస్కారమే లేదు'' అని జగన్ తేల్చి చెప్పినట్లు తెలిసింది.

బుధవారం ఎంపీలు సబ్బం హరి, అనంత వెంకట్రామిరెడ్డి, కేంద్ర మంత్రి సాయి ప్రతాప్ ఢిల్లీలో భేటీ అయ్యారు. జగన్ విషయంపై చర్చించారు. వీరు జగన్‌కు, అధిష్ఠానానికీ మధ్య తెగతెంపులు కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు తెలిసింది. ఎంపీలు కిళ్లి కృపారాణి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా జగన్ పార్టీలో లేకపోతే పార్టీకే నష్టమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సభలో బల ప్రదర్శన...
తూర్పు గోదావరి జిల్లాలో షెడ్యూలుకు అతీతంగా సాగిన 'ఓదార్పు' యాత్ర గురువారం బహిరంగ సభ రూపంలో ముగియనుంది. ఈ సభకు జగన్ అనుచరగణం అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. ఈ సభ వేదికపై జగన్ తన మనసులోని మాటను వెల్లడించాలని నిర్ణయించారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.

సభకు సరిగ్గా ఒక్కరోజు ముందు... అంబటి రాంబాబు, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తదితరులు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఇవి వారి వ్యక్తిగత వ్యాఖ్యలుగా భావించలేమని.. జగన్ మనసులోని మాటలుగానే పరిగణించాల్సి వస్తుందని కొందరు కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు.

ఇప్పటిదాకా ఏదైనా జిల్లాలో ఓదార్పు యాత్ర ముగింపు సమయంలో జగన్ తన తండ్రి విగ్రహాన్ని ఆవిష్కరించి, అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడమే జరిగింది. తొలిసారిగా కాకినాడలో బహిరంగ సభకు వేదికను సిద్ధం చేయడం చర్చనీయాంశమైంది. ఈ సభకు సాధ్యమైనంత మంది ఎక్కువ ఎంపీలను రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

పొరుగున ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాతోపాటు ఇతర జిల్లాల నుంచి కూడా ఎమ్మెల్యేలను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనుచర గణంతో సహా తరలి రావాలంటూ నేతలకు పిలుపులు వెళ్లాయి.

ఇప్పటికే జగన్ వర్గీయులుగా పేరొందిన ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి), శ్రీనివాసులు (రైల్వే కోడూరు), అమర్‌నాథ్‌రెడ్డి (రాజంపేట), ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు), రామచంద్రారెడ్డి (రాయదుర్గం), శివప్రసాదరెడ్డి (దర్శి), పి. రామకృష్ణారెడ్డి (మాచర్ల) కాకినాడలో బస చేశారు. బుధవారం వీరంతా జగన్‌ను కలిశారు.

మాజీ మంత్రి కొండా సురేఖ దంపతులు కూడా కాకినాడ చేరుకున్నారు. ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి దంపతులు, ఆళ్లనాని, జోగి రమేశ్ తదితరులు కూడా సభకు వచ్చే వీలుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

ఇక.. తూర్పు గోదావరి జిల్లాలో మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌తోపాటు ఎనిమిదిమంది ఎమ్మెల్యేలు జగన్ యాత్రలో భాగస్వాములయ్యారు. వీరంతా గురువారం నాటి సభలో పాల్గొనే అవకాశముంది. ఏ విధంగా చూసినా 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు ఈ సభలో పాల్పంచుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

జగన్ వర్గీయులు మాత్రం 35 మంది ఎమ్మెల్యేలు రావడం ఖాయమని చెబుతున్నారు. తదుపరి 'ఓదార్పు' ప్రకాశం జిల్లాలో ఉంటుందని జగన్ ఈ సభలోనే ప్రకటిస్తారని ఆయన సన్నిహితులు తెలిపారు. త్వరలో తెలంగాణలోనూ జగన్ యాత్ర నిర్వహిస్తారని గట్టు రామచంద్రరావు కాకినాడలో తెలిపారు. జగన్ గురువారం రాత్రి రైలులో హైదరాబాద్‌కు బయలుదేరతారు.

Sunday, July 18, 2010

జగన్‌కు ఓదార్పు * మీ ఆప్యాయత అపారం ఎమ్మెల్యేలను ఉద్దేశించి జగన్ వ్యాఖ్య * హైకమాండ్ కొరడా * కడప ఎంపీ విధేయుడు రాంబాబుపై తొలిదెబ్బ* జగన్ వర్గంలో కలవరం సన్నిహితులతో కడప ఎంపీ మంతనాలు

 
 జగన్‌కు ఓదార్పు
'జగన్‌పై చర్యలు తీసుకోం.. ఓదార్పు యాత్ర ఆయన వ్యక్తిగతమైనది.' అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీర ప్ప మొయిలీ తేల్చి చెప్పడం జగన్ వర్గానికి ఊరటనిచ్చింది. 'ఓదార్పు'లో పాల్గొంటే అధిష్ఠానం ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని భావించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకుల్లో చాలా మంది శనివారం జరిగిన ఆరో రోజు యాత్రలో పాల్గొన్నారు. దీంతో జగన్ వర్గంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. మొయిలీ ప్రకటనలో జగన్‌కు నేతల 'ఓదార్పు' ఎక్కువైంది. రాజమండ్రి ఆర్అండ్‌బీ అతిథిగృహం నుంచి శనివారం ఉదయం పది గంటలకు బయలుదేరిన జగన్ సాయంత్రం ఐదు గంటల వరకు రాజమండ్రి నగరంలోనే పర్యటించారు. లాలాచెరువు, క్వారీ మార్కెట్, మోరంపూ డిలలో వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించిన జగన్ పలుచోట్ల కాంగ్రెస్ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు.

నేను ఒంటరిని కాదు
'నేను ఒంటరివాడైపోయాడ నుకుంటున్నారు.. ఇంత మంది అభిమానం ఉన్న జగన్ ఒంటరివాడెలా అవుతాడు. ఇంత ఆత్మీ యాను రాగాలు పంచుతున్న మీ అందరూ నా వెంటే వుంటే ఒం టరినెలా అవుతాను' అంటూ జగన్ ఉద్వే గంగా మాట్లాడారు. మీరంతా నా తండ్రి రాజశేఖరరెడ్డిని గుండెల్లో పెట్టుకున్నారు. నన్ను తమ్ముడిగా, అన్నగా, కొడుకుగా ఆదరిస్తున్న మీ అందరికీ రుణపడి ఉన్నానన్నారు.

ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని భయపడకుండా చాలా మంది నేతలు నా వెంట వస్తున్నారు. ఎవరూ ఎవరికీ భయప డాల్సిన అవసరం లేదు.. మీరంతా నా వెంట ఉండటం నాకు కొండంత బలాన్నిస్తోందని జగన్ చెప్పుకొచ్చారు. తనను రాజమండ్రి లోనూ, తూర్పుగోదావరి జిల్లాలోనూ ఎంతగానో ఆదరిస్తున్నారని క్వారీ మార్కెట్‌సెంటర్‌లో జరిగిన సభలో జగన్ చెప్పారు.

జక్కంపూడికి పరామర్శ
ఉదయం 10.30 గంటకు మాజీ మం త్రి జక్కంపూడి రామ్మోహనరావును పరామర్శించేందుకు జగన్ ఆయన ఇంటికి వెళ్లారు. మంత్రి బోస్, జక్కం పూడి విజయలక్ష్మి, జక్కంపూడి రాజా, గణేష్‌లు జగన్‌ను గజమాలతో స్వాగ తించారు. ఈ సందర్భంగా జై జగన్, జై వైస్సార్ అంటూ నినాదాలు చేశా రు. సుమారు అరగంట సేపు గడిపిన జగన్ జక్కంపూడి ఆరోగ్యంపై ఆరా తీశారు. ఇటీవల ఆరోగ్యం కాస్త మెరు గుపడిందని జక్కంపూడి కుటుంబ సభ్యులు జగన్‌కు వివరించారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తాకిడి
జగన్ ఓదార్పు యాత్ర ఆయన వ్యక్తి గతం.. అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహా రాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ చేసిన ప్రకటనతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బహిరంగంగా యాత్రలో పాల్గొనేం దుకు ఉత్సాహం చూపారు. జిల్లాకు చెందినరాజమండ్రి సిటీ, అనపర్తి, గన్నవరం ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్ర కాశరావు, నల్లమిల్లి శేషారెడ్డి, పాముల రాజేశ్వరీదేవిలతో పాటురైల్వేకోడూ రు, రాజంపేట, ఏలూరు ఎమ్మెల్యేలు కె.శ్రీనివాసులు, అమర నాథ రెడ్డి, ఆళ్ల నాని, ఎమ్మెల్సీలు కందుల దుర్గేష్, చైతన్యరాజు, పుల్లా పద్మావతి యాత్ర లో హుషారుగా పాల్గొన్నారు.


నాలుగు కుటుంబాలకు ఓదార్పు
ఓదార్పు యాత్రలో భాగంగా శని వారం రాజమండ్రిలో జగన్ నాలుగు కుటుంబాలను కలసి ఓదార్చారు. ఏవి అప్పారావు రోడ్ ఏరియాలో రెడ్డి సూ ర్యప్రకాశరావు, గంజి శేఖర్, అన్న పూర్ణ మ్మపేటకు చెందిన ఆగురి నరసింహమూర్తి, నా రాయణపురానికి చెందిన బొడ్డు ప్రసాదరావుల కుటుం బాలను జగన్ పరామర్శించి ఓదార్చా రు.ఆయా కుటుంబాల వా రితో జగ న్ రెండు గంటలసేపు గడిపారు. కుటుంబ సభ్యుల పరిస్థితి, ఆర్థిక స్థితిగతులపైనా ఆరా తీసిన జగన్ ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. సాయంత్రం ఆరు గంటలకు మోరంపూడి సెంటర్‌లో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించిన జగన్ అక్కడి నుంచి దివాన్‌చెరువు వెళ్లి మా గాపు ధర్మయ్య కుటుంబాన్ని ఓదార్చారు. తర్వాత నరేంద్ర పురం, రాజానగరం చేరుకుని వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు.
మీ ఆప్యాయత అపారం 
ఎమ్మెల్యేలను ఉద్దేశించి జగన్ వ్యాఖ్య
ఎవరో ఏదో చేస్తారని భయపడకుండా
నాకు అండగా ఉన్నారు
ఆరో రోజు ఐదుగురికి పరామర్శ
ఓ పక్క ఓదార్పు మరో పక్క రహస్య చర్చలు
మొయిలీ వ్యాఖ్యల తర్వాత పెరుగుతున్న మద్దతు

"ఎవరో ఏదో చేస్తారని భయపడకుండా..మీ రంతా నాకు అండగా నిలబడుతున్నారు. ఇంతటి ఆప్యాయత చూపుతున్న మీ అందరికీ కృతజ్ఞతలు'' అని కడప ఎంపీ జగన్ అన్నారు.

రాజమండ్రి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, జక్కంపూడి విజయలక్ష్మిలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు కాగా,తూర్పు గోదావరి జిల్లాలో ఆరోరోజు యాత్రలో భాగంగా శనివారం ఐదు కుటుంబాలను పరామర్శించారు. పలుచోట్ల వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు.


ఉండవల్లితో మంతనాలు
యాత్రలో భాగంగా శనివారం రాజమండ్రి వచ్చిన జగన్ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఇంటికి వెళ్లి సుమారు అరగంటసేపు ఉన్నారు. ఈ సందర్భంగా వారి మధ్య కీలక రాజకీయ చర్చ జరిగినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి జక్కంపూడి ఇంటికి వెళ్లిన జగన్ ఆయనతోనూ రహస్య చర్చలు జరిపారు.

సీమ,తెలంగాణ ఎమ్మెల్యేలతో..
యాత్ర వద్దని ఇప్పటి వరకు స్పష్టం చేసిన అధిష్ఠానం కాస్త మెత్తబడినట్లు కనిపించడం, ఓదార్పు యాత్ర ఆయన వ్యక్తిగతమని, జగన్‌పై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని మొయిలీ వ్యాఖ్యానించడంతో ఆయనకు మద్దతు పెరుగుతోంది. రాయలసీమ, తెలంగాణ జి ల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు జగన్‌తో మంతనాలు జరపడానికి రాజమండ్రి చేరుకున్నారు.

కడప నుంచి మేయర్..
జగన్ యాత్రకు కడప జిల్లా నుంచి మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డితోపాటు రాజంపేట ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కేశ్రీనివాసులు వచ్చారు.

అనంత నుంచి ఇద్దరు..
ఓదార్పు యాత్రలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే బి.గురునాథ్‌రెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.

కర్నూలు నుంచి...
ప్రజారాజ్యం పార్టీ నేత, మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి రాజమండ్రి నుంచి యాత్రను అనుసరిస్తుండగా.. కాంగ్రెస్ నేత ఎస్వీ మోహన్‌రెడ్డి గడచిన నాలుగు రోజులుగా జగన్ వెంట ఉన్నారు. మంత్రి శిల్పామోహన్‌రెడ్డి సోదరుడు చక్రపాణిరెడ్డి రెండు రోజులు పాల్గొని శుక్రవారం వెళ్లిపోయారు. కర్నూలు మార్కెట్ యార్డు చైర్మన్ వెంకటేశ్వర్లు కూడా యాత్రలో పాల్గొని శుక్రవారం కర్నూలు చేరుకున్నారు.

వైఎస్ కుటుంబంతోనే..: మంత్రి బోస్
తాను రాజకీయాలలో ఉన్నంత వరకు వైఎస్ కుటుంబంతోనే ఉంటానని మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ స్పష్టం చేశారు. తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన వైఎస్‌కు కృతజ్ఞతగానే ఈ నిర్ణయాన్ని తీసుకున్నానని చెప్పారు.

అధిష్ఠానానికి తెలిసొచ్చింది: కడప మేయర్
ఎవరు ఎంత చెప్పినా.. ప్రజాదరణ కలిగిన నేత ఎవరో అధిష్ఠానానికి ఇప్పుడు తెలిసిందని, వీరప్ప మొయిలీ తాజా ప్రకటనే ఇందుకు నిదర్శనమని కడప మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్
తక్షణం అమల్లోకి ప్రకటించిన మొయిలీ
సోనియా ఆగ్రహం ఫలితమే
జగన్‌పై చర్యలేదన్న వీరప్పకు క్లాస్ తీసుకున్న అహ్మద్ పటేల్
జగన్ వర్గీయుల వివరాలు అందజేయాలి
నేతలను ఓదార్పునకు దూరంగా ఉంచాలి
మొయిలీపైనే బాధ్యత రోశయ్యకు మేడమ్ పిలుపు
  కాంగ్రెస్ అధిష్ఠానం కొరడా ఝళిపించడం మొదలు పెట్టింది! కడప ఎంపీ జగన్ మోహన్‌రెడ్డి శిబిరంపై తొలి దెబ్బ పడింది! ముఖ్యమంత్రి రోశయ్యను అనరాని మాటలంటూ.. అసభ్య సవాళ్లు విసిరిన జగన్ విధేయుడు అంబటి రాంబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ తక్షణం అమల్లోకి వస్తుందని ప్రకటించింది.

జగన్‌కు అనుకూలంగా ఉంటారన్న ముద్ర ఉన్న వీరప్ప మొయిలీకి అంతకు కొద్ది గంటల ముందే గట్టిగా క్లాస్ తీసుకుంది. అంతేకాక.. ఆయన నోటితోనే జగన్ వర్గంపై తొలి చర్యను ప్రకటింపచేసింది. ఓదార్పు యాత్రకు దూరంగా ఉండాలంటూ సంకేతాలు పంపాలని మొయిలీని ఆదేశించిన అధిష్ఠానం.. జగన్ వర్గీయుల జాబితా.. వారి నేపథ్యాల వివరాలను అందజేసే బాధ్యతనూ ఆయనకే అప్పగించింది.

ఈ వ్యవహారాలన్నింటినీ చర్చించేందుకు హస్తిన రావాలంటూ రోశయ్యకు కబురు పంపింది. అంతకుముందు ఓదార్పుపై మొయిలీ శుక్రవారం చేసిన వ్యాఖ్యలతో.. యాత్రలో పాల్గొనే నేతల సంఖ్య పెరిగింది. కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి పలువురు ప్రజా ప్రతినిధులు జగన్ యాత్రలో శనివారం పాల్గొన్నారు.

ఆ ఉత్సాహంలో "ఎవరో ఏదో చేస్తారని భయపడకుండా మీరంతా నాకు అండగా నిలబడుతున్నారు. ఇంతటి ఆప్యాయత చూపుతున్నందుకు అందరికీ కృతజ్ఞతలు'' అని ఆ ఎమ్మెల్యేలను ఉద్దేశించి చెప్పిన కడప ఎంపీ.. సాయంత్రానికి అధిష్ఠానం విసిరిన కొరడా దెబ్బకు కంగు తిన్నారు. యాత్ర మధ్యలోనే ఒక చోట కారు తన సన్నిహితులతో మంతనాలు జరిపారు.

జగన్‌పై చర్యలు ఉండవన్న మొయిలీకి అధిష్ఠానం క్లాస్ తీసుకున్న గంటల వ్యవధిలోనే అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. తనకు తన అనుయాయులకు ఏం భయం లేదని జగన్ చేసిన వ్యాఖ్యలను కూడా అధిష్ఠానం తీవ్రంగా పరిగణించిందని తెలుస్తోంది. జగన్‌పై క్రమశిక్షణ చర్యల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న తరుణంలో మొయిలీ ఈ వ్యాఖ్యలు చేయడం అధిష్ఠానానికి ఆగ్రహం తెప్పించింది.

దాంతో గతంలో మాదిరిగానే ఆయనతోనే నష్టనివారణ చర్యలు చేపట్టింది. దీంతో తన నిష్పాక్షికతను నిరూపించుకునేందుకన్నట్లు.. రాంబాబుపై వేటు వేస్తూ పీసీసీకి మొయిలీ ఉత్తర్వులు పంపారు. కాగా.. తనకు సస్పెన్షన్ ఉత్తర్వులు అందలేదని అంబటి ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి చెప్పారు. అధికారికంగా సమాచారం వచ్చాక స్పందిస్తానన్నారు.

ఎందుకలా చెప్పారు?
ఓదార్పు యాత్ర జగన్ వ్యక్తిగతమని, ఆయనపై క్రమశిక్షణ చర్యలు ఉండవని వీరప్ప మొయిలీ వ్యాఖ్యానించడాన్ని అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై సీనియర్ నేతలతో చర్చిస్తున్న సమయంలో ఈ ప్రస్తావన వచ్చిప్పుడు సోనియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఎందుకలా చెప్పారు? ఎవరిని అడిగి ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు? అంటూ మండిపడ్డారని ఆ వర్గాలు వివరించాయి.

ఆ వెంటనే సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్.. కేంద్ర న్యాయ మంత్రి వీరప్ప మొయిలీకి ఫోన్ చేసి, ఎందుకలా వ్యాఖ్యలు చేశారంటూ మందలించారని తెలిసింది. గతంలో ఒకసారి జగన్ విషయంలో అధిష్ఠానం నుంచి మొయిలీ అక్షింతలు వేయించుకున్నారు.

ఓదార్పు యాత్రకు అధిష్ఠానం సానుకూలంగా ఉందని తనతో మొయిలీ అన్నారని, ఆశీర్వదించి పంపారని జగన్ తన శ్రీకాకుళం యాత్రకు ముందు ఢిల్లీలో చెప్పారు. అయితే.. దానిపై సోనియా ఆగ్రహం వ్యక్తం చేయడం.. అహ్మద్ పటేల్ తనకు ఫోన్ చేయడంతో సాయంత్రానికి మీడియా ముందుకు వచ్చిన మొయిలీ.. తాను జగన్‌కు అలా చెప్పలేదని వివరణ ఇచ్చుకున్నారు.

కాగా.. మరోసారి ఇదే విషయంలో మొయిలీ అధిష్ఠానం ఆగ్రహానికి గురి కావడం విశేషం. మొయిలీ వ్యాఖ్యలు జగన్ వర్గానికి ఆత్మ విశ్వాసం కలిగించాయని, ఇక ఓదార్పు యాత్రకు పార్టీ నేతలు నిర్భయంగా హాజరవుతారని, దీని వల్ల మళ్లీ రాజకీయ సమస్యలు ఏర్పడతాయని పార్టీ నేతలు ఒకరిద్దరు అధిష్ఠానం దృష్టికి తీసుకురావడంతో ఈ మందలింపు వ్యవహారం జరిగిందని తెలిసింది.

అంతేకాక.. ఓదార్పు యాత్రకు హాజరు కావద్దన్న స్పష్టమైన సంకేతాలు పార్టీ నేతలకు పంపే బాధ్యతను కూడా మొయిలీకే అప్పగించినట్లు సమాచారం. వీటితో పాటు.. జగన్ వర్గీయులైన ఎమ్మెల్యేల గురించి, వారి నేపథ్యం గురించి కూడా సరైన సమాచారం అందించాలని మొయిలీని అధినాయకత్వం కోరినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

జగన్‌పై క్రమశిక్షణ చర్యలు ఉన్నా లేకపోయినా, ఆ విషయం బయటకు చెప్పనవసరం లేదని ఏఐసీసీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అధిష్ఠానం అనుమతి లేకున్నా.. కడప ఎంపీ జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేస్తున్న నేపథ్యంలో ఆయనపై చర్య తప్పకపోవచ్చని ఏఐసీసీ వర్గాలు ముందు నుంచి చెబుతూనే ఉన్నాయి.

కొంత సమయం వేచి చూసి.. ఆ తర్వాత తగిన చర్య తీసుకోవాలనే ఆలోచనలో అధిష్ఠానం ఉందన్న సంకేతాలూ వచ్చాయి. అయితే.. శుక్రవారం నగర పర్యటనకు వచ్చిన వీరప్ప మొయిలీ.. జగన్ యాత్ర వ్యక్తిగతమని, ఆయనపై క్రమశిక్షణ చర్యలు ఉండవని చేసిన వ్యాఖ్యలతో జగన్‌కు ఊరట లభించినట్లయింది. పలువురు ఎమ్మెల్యేలు జగన్ యాత్రలో చేరారు.

దీనిని అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. జగన్ ఓదార్పు యాత్ర ఇంకా కొనసాగుతున్నందువల్ల ఆయన వ్యవహార శైలిని ఇంకా పరిశీలించాల్సి ఉన్నదని, ఆయన విషయంలో నిర్ణయం తీసుకోవడంలో ఇప్పుడే తొందరపడకూడదనే అభిప్రాయంతో అధిష్ఠానం ఉన్నదని ఏఐసీసీ వర్గాలు అంటున్నాయి.

అంత మాత్రాన జగన్ కార్యకలాపాలను పూర్తిగా ఉపేక్షించినట్లు భావించరాదని స్పష్టం చేస్తున్నాయి. కాగా సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిని కలుసుకుని, రాష్ట్ర రాజకీయ పరిస్థితిపై చర్చించారు. 

జగన్ వర్గంలో కలవరం
సన్నిహితులతో కడప ఎంపీ మంతనాలు

పీసీసీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబుపై కాంగ్రెస్ అధిష్ఠానం సస్పెన్షన్ వేటు వేయడం కడప ఎంపీ వైఎస్ జగన్ వర్గానికి గట్టి షాక్‌నిచ్చింది. ఓదార్పు యాత్ర జగన్ వ్యక్తిగతమని, ఆయనపై క్రమశిక్షణ చర్యలన్నీ పత్రికల ఊహాజనితాలేననని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ ప్రకటించడంతో అంతా సద్దుమణిగిందని, పరిస్థితులన్నీ తమ 'దారి'కే వచ్చాయని జగన్ వర్గం భావిస్తున్న తరుణంలో.. అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం ఆ వర్గాన్ని కలవరానికి గురి చేసింది.

జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా, దాదాపు ఆయన అధికార ప్రతినిధిగా మెలగుతున్న అంబటి రాంబాబు.. ఇటీవల రోశయ్యపై పరుషమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వాటిని రోశయ్య, డీఎస్‌లు తీవ్రంగా పరిగణించారు. అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. క్రమశిక్షణరాహిత్యాన్ని మొగ్గలోనే తుంచేయాలని అధిష్ఠానం ఆదేశించింది కూడా.

ఈ నేపథ్యంలోనే పీసీసీ క్రమశిక్షణ సంఘం జారీ చేసిన షోకాజ్ నోటీసులతో కమిటీ ముందు హా జరైన అంబటి.. మరికొంత గడువు కోరారు. కమిటీ గడువు ఇచ్చింది కూడా. అయితే.. ఆ తర్వాత కూడా అంబటి ధిక్కార స్వరాన్నే వినిపించారు. దీంతో, అంబటి అంశాన్ని శుక్రవారం హైదరాబాద్ వచ్చిన మొయిలీకి పీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ సత్యనారాయణరాజు ఓ నివేదికను సమర్పించారు.

అదేసమయంలో, ఓదార్పుపై మొయిలీ వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీలో లక్ష్మణరేఖను దాటేవారి సంఖ్య అధికంగా ఉంటుందని అధిష్ఠానం ఆందోళన చెందింది. దీంతో ఈ వ్యవహారాన్ని మొగ్గలోనే తుంచేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే.. సమాధానం చెప్పడానికి ఇంకా గడువు ఉన్నా అంబటిపై వేటు వేసింది. ఈ విషయాన్ని మొయిలీతోనే చెప్పించింది.

తద్వారా.. కిందిస్థాయి నుంచి ఇన్‌చార్జి వరకూ ఎవరు గీత దాటినా కఠినంగానే వ్యవహరిస్తామం టూ పరోక్షంగా మొయిలీకి కూడా అధిష్ఠానం హెచ్చరికలు పంపిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంబటిపై చర్యల ద్వారా.. భవిష్యత్తులో జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొనే ప్రజాప్రతినిధులపైనా ఇదే వైఖరిని అవలంబించనున్నట్లు హెచ్చరికలను పంపిందని చెబుతున్నాయి.

అయితే, అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంపై తనవారిని కాపాడుకొనే విషయంలో వైఎస్ ఎప్పుడూ ముందుండేవారని.. ఆ యన తనయుడిగా ఇప్పుడు జగన్ ఎలా స్పందిస్తారోనన్న ఆసక్తి పార్టీలో నెలకొంది. అంబటిపై వేటు విషయం తెలిసిన వెంటనే.. ఓదార్పు యాత్రలో ఉన్న జగన్ తన సన్నిహితులు, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, నల్లమిల్లి శేషారెడ్డి, రాపాక వరప్రసాద్‌లతో శనివారం రాత్రి మంతనాలు జరిపారు.

రాజమండ్రి రూరల్ మండలంలోని నామవరంలో ఓదార్పు యాత్రకు బయలుదేరిన జగన్.. మార్గమధ్యలో కారు ఆపి ముగ్గురితోనూ ఐదు నిమిషాలు ప్రత్యేకంగా మాట్లాడారు. అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంపై కూలంకషంగా చర్చించినట్లు తెలిసింది.

Saturday, July 17, 2010

కీలక మలుపు * సర్దుకుపోదాం..రా.. ! * సామాజికవర్గాల సమీకరణం * 'ఓదార్పు' యాత్రలో యువ నాయకత్వం!

 కీలక మలుపు
జిల్లాలో కడప ఎంపీ జగన్‌మోహనరెడ్డి నిర్వహిస్తున్న ఓదార్పుయాత్ర అయిదోరోజుకు చేరుకుంది. అనూహ్యంగా శుక్రవారం రాత్రి సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ సామర్లకోటలో జగన్‌ను కలిశారు. దీంతో యాత్ర కీలక మలుపు తిరిగింది. బోస్ చేరికతో జగన్ బలం పుంజుకున్నట్టయింది. ఇప్పటికే తుని ఎమ్మెల్యే రాజా అశోక్‌బాబు, జగ్గంపేట ఎమ్మెల్యే తోట నరసింహం తమ తమ నియోజకవర్గాల్లో జగన్ వెంట ఓదార్పు యాత్రలో పాల్గొన్నారు.

రంపచోడవరం ఎమ్మెల్యే సత్యనారాయణరెడ్డి మాత్రమే కాంగ్రెస్ పార్టీ సూచనల మేరకు ఓదార్పు యాత్రకు దూరంగా ఉన్నారు. జిల్లాలో ఓదార్పు యాత్ర ముగిసే వరకు జగన్ వెంట బోస్ పర్యటించనున్నారు. గురువారం రాత్రి కిర్లంపూడిలో బసచేసిన జగన్ శుక్రవారం ఉదయం దివిలి నుంచి పర్యటన ప్రారంభించారు. పిఠాపురం, పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఏటిపట్టు గ్రామాల్లో యాత్ర కొనసాగించారు. తొలుత పిఠాపురం మండలం మంగితుర్తిలో యర్రవరపు రాజు కుటుంబాన్ని ఓదార్చారు.

విరవ, విరవాడ, మల్లాం, ఫకృద్దీన్‌పాలెం, కొత్త కందరాడల్లో యాత్ర కొనసాగించారు. సామర్లకోట మండలం చంద్రంపల్లి, నవర, పి.వేమవరం, ఉండూరుల్లో పర్యటించారు. కొత్త కందరాడలో ఎ.సుబ్బారావు కుటుంబాన్ని, చంద్రంపాలెంలో దమ్మాల చక్రం కుటుంబాన్ని, ఉండూరులో జి.వీర్రాజు కుటుంబాన్ని ఓదార్చారు.

సామర్లకోట, పెద్దాపురం పట్టణాల్లో కూడా జగన్ పర్యటించారు. మల్లాం, విరవాడ, ఫకృద్దీన్‌పాలెం, చంద్రంపాలెం, పి.వేమవరం, సామర్లకోట, పెద్దాపురం తదితర చోట్ల వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించి ప్రజలనుద్దేశించి ముక్తసరిగా మాట్లాడారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు తాను ప్రాధాన్య మిస్తున్నట్టు జగన్ తెలిపారు. తన యాత్రలో భాగంగా ముఖ్యనేతల ఇళ్లకు వెళ్లి మంతనాలు జరిపే కార్యక్రమా లను జగన్ కొనసాగిస్తున్నారు.

కిర్లంపూడిలో మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం ఇంట్లో బసచేసిన ఆయన శుక్రవారం ఉదయం వీరవరం వెళ్లి జగ్గంపేట ఎమ్మెల్యే తోట నరసింహం ఇంట్లో అల్పాహారం తీసుకున్నారు. యాత్రలో భాగంగా మధ్యాహ్నం విరవాడలో పిఠాపురం మండల పరిషత్ అధ్యక్షుడు రాంబాబు ఇంట్లో భోజనం చేశారు. రెండుచోట్ల చాలాసేపు జగన్ గడపడం విశేషం. జగన్‌ను కలిసేందుకు జిల్లా కాంగ్రెస్ నేతలు పలువురు కిర్లంపూడి వచ్చారు. మాజీ మంత్రి సంగీత వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బిక్కిన కృష్ణార్జునచౌదరి, వడ్డి వీరభద్రరావు తదితరులు జగన్‌ను కలిపారు. మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యేలు తోట గోపాలకృష్ణ, వరుపుల సుబ్బారావు జగన్ వెంట యాత్రలో పాల్గొన్నారు.

శాసనమండలి సభ్యుడు వైఎస్ వివేకానందరెడ్డి (వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు) కిర్లంపూడి వచ్చి జగన్‌ను పరామర్శించారు. పిఠాపురం మండలం ఫకృద్దీన్‌పాలెంలో జగన్‌ను కలిసిన భద్రాచలం ఎమ్మెల్యే సత్యవతి ఓదార్పుయాత్రకు సంఘీభావం తెలిపారు. గ్రూపు రాజకీయాల కారణంగా ఒకరిద్దరు నేతలు మౌనంగా ఉన్నప్పటికీ పిఠాపురం, పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తిస్థాయిలో కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు జగన్ యాత్రలో పాల్గొనడం గమనించాల్సిన విషయం.
జిల్లాలో బలమైన సామాజికవర్గాలకు చెందిన నేతలను సమీకరించేందుకు జగన్ తాపత్రయపడుతున్నారు. ఇందులో భాగంగానే తొలుత ఏడు రోజులు నిర్వహించాలని భావించిన 'ఓదార్పు' యాత్రను పొడిగించనున్నట్టు తెలుస్తోంది. కోనసీమకు చెందిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ మంత్రులు జక్కంపూడి రామ్మోహనరావు, ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే తోట గోపాలకృష్ణ జిల్లాలో బలమైన సామా జికవర్గాలకు చెందిన నేతలుగా వున్నారు.

జిల్లా రాజకీయాల్లో సామా జికవర్గాలను బేరీజు వేసుకునే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల్లో టికెట్లు కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. ఇటీవలి కాలంలో ఈ సామాజికవర్గ రాజకీయాలకు ప్రాధాన్యత గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో జిల్లాలో 'ఓదార్పు' యాత్ర నిర్వహిస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి త నయుడు, కడప ఎంపీ జగన్ కూడా రాజకీయంగా బలమైన ముద్ర వేసుకునేందుకు తన వెనుక బలమైన సామాజికవర్గ నేతలు ఉన్నారన్న సంకేతాలు పంపేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

జిల్లా కాంగ్రెస్ పార్టీలో జగన్ ఇప్పటికే మెజార్టీ నేతల మద్దతు కూడగట్టుకోగలిగారు. పదకొండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఇంచుమించు అందరూ జగన్‌కు అనుకూలంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ముగ్గురు ఎంపీల్లో రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఇప్పటికే జిల్లాకు వచ్చిన జగన్‌ను పలకరించారు. కాకినాడ ఎంపీ పళ్లంరాజు జగన్ ఓదార్పుపై, ఆయన రాజకీయ వ్యవహారాలపై మౌనం వహిస్తున్నారు. అ మలాపురం ఎంపీ జీవీ హర్షకుమార్, జగన్ ఎంపీ కాకముందు కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో హర్షకుమార్ సామాజిక వర్గానికే చెందిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జగన్‌కు అనుకూలంగా బహిరంగంగానే మాట్లాడుతున్నారు.

జిల్లాలో మరో బలమైన సామాజిక వర్గానికి చెందిన మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ అధిష్ఠానం వార్నింగ్ ఇచ్చినా జగన్ వెంటే ఉంటానని ముందు నుంచీ స్పష్టం చేస్తూ వస్తున్నారు. బోస్‌కు బలమైన సామాజికవర్గ నేపథ్యం ఉంది. జిల్లా రాజకీయాల్లో ఆరు దశాబ్దాలుగా కీలకపాత్ర పోషిస్తున్న సామా జికవర్గానికి చెందిన మాజీ మంత్రులు జక్కంపూడి రామ్మోహనరావు, ముద్రగడ పద్మనాభం కూడా జగన్‌కు అండగా నిలబ డ్డారు.

వీరితో పాటు పెద్దాపురం మాజీ ఎమ్మెల్యే తోట గోపాల కృష్ణ, జగ్గంపేట ఎమ్మెల్యే తోట నరసింహం తదితరులు కూడా జగన్‌కు మద్దతు తెలుపుతున్నారు. దీంతో జగన్ పలువురు నేతల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

'ఓదార్పు' యాత్రలో యువ నాయకత్వం!

 దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు జగన్మోహన్‌రెడ్డి చేపడుతున్న ఓదార్పు యాత్ర ఏర్పాట్లు చేయడంలో యువనాయకత్వం తాజాగా తెరపైకి వస్తుంది. ఆయా నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, తనయులు, యువనాయకులు జగన్మోహన్‌రెడ్డి యాత్ర ఏర్పాట్లలో సీనియర్లను సైతం పక్కన పెట్టి ముందడుగు వేస్తున్నారు. దీనికి తోడు జగన్మోహన్‌రెడ్డితో వైఎస్ఆర్ విగ్రహాలు ఆవిష్కరించాలన్న అభిమానుల అత్యుత్సాహం అనేక చోట్ల వివాదాలకు ఆజ్యం పోస్తుంది.

పబ్లిక్ స్థలాల్లోను, అభ్యంతరకరమైన ప్రదేశాల్లోను, ముఖ్యంగా భవిష్యత్‌లో ఆయా ప్రాంతాల అభివృద్ధికి నిరోధకంగా మారే చోట్ల వైఎస్ విగ్రహాలను కాంగ్రెస్ నాయకులు ఇబ్బడిముబ్బడిగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా ఐదవ నెంబరు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న పోలీస్‌స్టేషన్ వద్దే దివంగత నేత వైఎస్ఆర్, మాజీ ఎమ్మెల్యే చిర్ల సోమసుందరరెడ్డి విగ్రహాలను ఏర్పాటు చేయడానికి యుద్ధప్రాతిపదికన సన్నాహాలు చేస్తున్నారు. అయితే రాజకీయ వివాదాల నేపథ్యంలో పోలీసులు సైతం అక్కడ పెట్టే విగ్రహాల విషయంలో చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్న విషయం మరింత వివాదమవుతుంది.

అదే రీతిలో అమలాపురంలోని హైస్కూల్ సెంటర్‌లో 214 జాతీయ రహదారి మధ్యలో భారీ స్థూపాన్ని నిర్మించి విగ్రహ ఏర్పాట్లకు మంత్రి విశ్వరూప్ అనుచర గణం సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే సెంటర్‌లో వెలుగునిచ్చే ఐ-మ్యాక్స్ లైట్లను తొలగించి విగ్రహం ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. భవిష్యత్‌లో పాశర్లపూడి-బోడసకుర్రు వంతెన పూర్తయితే ఈ సెంటర్‌లో నిర్మించిన వైఎస్ విగ్రహం ప్రధాన సమస్యగా మారే అవకాశముందని జాతీయ రహదారుల శాఖ అధికారులు లోలోపలే మదనపడుతున్నారు. ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి సెంటర్‌లో అంబేద్కర్ విగ్రహం సమీపాన వైఎస్ విగ్రహా ఏర్పాటు చేయాలన్న కాంగ్రెస్ నాయకులు చర్యలను ఆ ప్రాంత దళితులు అడ్డుకోవడం ద్వారా నిలిచిపోయింది.

అదే విధంగా చల్లపల్లి శివారు బొండాడిపేటలో వైఎస్ జగన్‌తో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని పలువురు కాంగ్రెస్ నాయకులు చేసిన ప్రతిపాదనను మరికొందరు దళిత నాయకులు తీవ్రంగా ప్రతిఘటించడంతో వివాదం ప్రారంభమైంది. అదే రీతిలో కొత్తపేట, ముమ్మిడివరం, రాజోలు నియోజకవర్గాల పరిధిలో రహదారుల చెంత కాంగ్రెస్ పార్టీ అధికారులు నిర్మిస్తున్న వైఎస్ఆర్ విగ్రహాలు భవిష్యత్‌లో వివాదాస్పదం కానున్నాయి.

ప్రస్తుతం నెలకొల్పుతున్న విగ్రహాల చెంతనే దివంగత తెలుగుదేశం నేత ఎన్టీఆర్‌తో పాటు దళిత నాయకుల విగ్రహాలను ఆయా కూడళ్లలో ఏర్పాటు చేయడానికి ప్రత్యర్థులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కోనసీమలో వేలాది విగ్రహాలు ఉన్న తరుణంలో వైఎస్ఆర్ విగ్రహాలు ఎక్కడికక్కడ ఏర్పాటు చేయడం వల్ల కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీల మధ్య వివాదాలకు నాంది పలికే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

యువ నాయకత్వం హడావుడి:
జగన్ కోనసీమ పర్యటన నేపథ్యంలో కొత్త తరం యువజన కాంగ్రెస్ నాయకులు హడావుడి చేస్తున్నారు. భారీగా తమతమ ఫొటోలతో జగన్‌కు స్వాగతం పలుకుతూ ఫ్లెక్స్‌లను ఏర్పాటు చేస్తున్నారు. మంత్రి విశ్వరూప్ తనయుడు కృష్ణార్జున రెడ్డి జగన్ యాత్ర ఏర్పాట్లలో అనుచర గణంతో బిజీగా ఉన్నారు. మంత్రి తనయుడు సెంటర్‌లో ఓ భారీ ఫ్లెక్స్‌ను ఏర్పాటుచేశారు. అదే రీతిలో కాంగ్రెస్ నాయకుని తనయుడు కె.మదన్ భారీ ఫ్లెక్స్‌బోర్డును ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఏర్పాట్లకు దూరంగా ఉన్న గన్నవరం నియోజకవర్గ నాయకులు జగన్ ఏర్పాట్లపై దృష్టిపెట్టారు. అలాగే చిర్ల జగ్గిరెడ్డి, కేవీ సత్యనారాయణరెడ్డిలు కొత్తపేట నియోజక వర్గంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
సర్దుకుపోదాం..రా.. !
jagan-delhi
రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న ఉత్కంఠ పరిణామాలు కొత్త మలుపు తిరిగాయి. ఇంతవరకూ అధిష్ఠానాన్ని ధిక్కరిం చి ఓదార్పు యాత్రలో ఉన్న కడప ఎంపీ వైఎస్‌ జగన్‌పై చర్యలు ఉంటాయని భావిస్తూ వచ్చిన వారి అంచనాలు తారుమారయ్యాయి. ఆయనపై ఎలాంటి చర్యలూ ఉం డవని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జీ వీరప్ప మొయిలీ అధికారికంగా ప్రకటించడంతో కాంగ్రెస్‌ రాజకీయాల వేడి ప్రస్తుతానికి చల్లారే సూచనలు కనిపి స్తున్నాయి.

శుక్రవారం నగరానికి వచ్చిన మొయిలీ.. ఓదార్పు యాత్ర జగన్‌ వ్యక్తిగత వ్యవహారమయినందున, ఆయ నపై ఎలాంటి చర్యలూ ఉండవని స్పష్టం చేయడం పరిశీ లిస్తే.. జగన్‌పై అధిష్ఠానం వైఖరిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. జగన్‌ ఓదార్పు యాత్రలో కాంగ్రెస్‌ ద్వితీయ శ్రేణి నేతలే ఎక్కువగా రావడం, వారంతా జగ న్‌ పార్టీ పెడితే వెళ్లిపోతామంటూ విస్పష్టంగా ప్రకటించ డం, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అధిష్ఠానం మాట ను ఖాతరు చేసే పరిస్థితి కనిపించకపోవడం వంటి అం శాలను నాయకత్వం పరిగణనలోకి తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.

SONజగన్‌ యాత్రకు వచ్చిన జాతీయ మీడి యా ప్రతినిధుల ద్వారా క్షేత్రస్థాయి సమాచారం తెలు సుకున్న అధిష్ఠానం, వాటిని పరిగణనలోకి తీసుకున్న ట్లు కనిపిస్తోంది. అయితే, జగన్‌పై అటు కఠినంగా వ్యవహరించకుండా, ఇటు మరీ జారిపోకుండా ఉండే లా వ్యూహం రూపొంది స్తున్నట్లు పార్టీ వర్గాలు విశ్లేషిస్తు న్నాయి. జగన్‌ తనంత ట తాను పార్టీ నుంచి బయటకు వెళ్లే వరకూ అతడిని రెచ్చకొట్టకూడదని, యాత్ర వ్యవ హారంపై మరీ ప్రతిష్ఠకు పోకుండా చూసీ చూడనట్లు వ్యవహరించాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు మారిన పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

జగన్‌ వెంట ఆశించి నంత సంఖ్యలో ఎమ్మెల్యే, ఎంపీలు వెళ్లకపోయినా.. పార్టీకి పునాదిరాళ్లయిన ద్వితీయ శ్రేణి నేతలు జగన్‌ వైపు కదులుతుండటంపైనే నాయకత్వం ప్రధానంగా దృష్టి సారించి, తన వైఖరిని తాత్కాలికంగా మార్చుకున్న ట్లు తెలుస్తోంది. వైఎస్‌ మృతి చెందిన తర్వాత జనాకర్ష క శక్తి ఉన్న నేత పార్టీలో ఎవరూ లేకపోవడం, ప్రస్తుతా నికి జగన్‌ ఒక్కరే ప్రత్యామ్నాయ జనాకర్షక శక్తి ఉన్న నేతగా కనిపిస్తుండటంతో.. జగన్‌ వ్యవహారాన్ని తెగేదా కా లాగి, రెచ్చగొట్టడం వల్ల పార్టీకే నష్టమన్న భావనతో నాయకత్వం మనసు మార్చుకున్నట్లు పార్టీ వర్గాలు విశ్లే షిస్తున్నాయి.

MOHILI యువకుడయి నందున జగన్‌ను ఎంత రెచ్చగొడితే అంత రెచ్చిపోయే ప్రమాదం ఉందన్నదీ అధి ష్ఠానం గ్రహించినట్లు కనిపి స్తోంది. ఇన్ని కారణాలు సమీక్షించుకున్న తర్వాతనే జగన్‌ యాత్రపై చూసీ చూడ నట్లు వదిలేయాలని నిర్ణయించింది. జగన్‌ యాత్రలో ద్వితీయ శ్రేణి నేతలు అధికంగా ఉన్న విషయాన్ని గ్ర హించిన నాయకత్వం.. వారు బయటకు వెళితే పార్టీకే నష్టమని, ఇప్పటికే ఎమ్మెల్యేలు అభ ద్రతాభావంతో ఉన్న వాస్తవాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంది. ద్వితీ య శ్రేణి నేతలు జారిపోతారన్న భయంతోనే ఎమ్మెల్యే లు యాత్రకు వెళుతున్న అనివార్య, అయోమయ పరిస్థి తి నుంచి ఎమ్మెల్యేలను బయట పడవేసేందుకే అధిష్ఠా నం జగన్‌కు ప్రస్తుతానికి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలుస్తోంది.

సోనియాకు సీనియర్లే తప్పుదోవ వట్టించారు

వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్రపై యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీని కొంత మంది సీనియర్లే తప్పుదోవ పట్టించా రని కడప ఎమ్మెల్సీ వైఎస్ వివేకానంద రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ప్రముఖ శిల్పి వడయార్ శిల్పకళాశా లకు విచ్చేసి పులివెందులలో ఏర్పాటు చేసేందుకు తయారు చేస్తున్న దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 18 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆయన పరిశీలించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ జగన్ ఓదార్పు యాత్ర కాంగ్రెస్ పార్టీ తరఫున చేపడితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమ య్యేదన్నారు. వైఎస్ కుటుంబం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఎల్లప్పుడూ పాటుపడిందని పేర్కొన్నారు. ఓదార్పు యాత్ర విషయంలో కొందరు సీనియర్లు కావాలనే అధిష్టానాన్ని తప్పుదోవ పట్టించారని ఆరోపించారు.

అయితే ఓదార్పు యాత్రతో జగన్ వేరే పార్టీ పెడతారని వస్తున్న ప్రచారంలో ఎంత మాత్రం వాస్తవం లేదని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికే తాము పాటుపడతామని వివేకానంద రెడ్డి స్పష్టం చేశారు. ఆయన వెంట కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, కాంగ్రెస్ బ్లాక్ వన్ అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్‌రాజు, మాజీ ఏఎంసీ వైస్‌చైర్మన్ మార్గన గంగాధరరావు, రుద్రరాజు రవివర్మ తదితరులున్నారు. 

వ్యూహకర్తలెవరు? జగన్ పర్యటనపై ఇంటెలిజెన్స్ ఆరా

జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వ హస్తున్న కడప ఎంపీ వైఎస్ జగన్మో హనరెడ్డి వెనుక వ్యూహకర్తలు ఎవర న్న అంశంపై ఇంటెలిజెన్స్ అధికారు లు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశే ఖరరెడ్డికి అత్యంత ఆదరణ చూపిన జిల్లాగా తూర్పు గోదావరి అంటే ఎన లేని అభిమానం. అదే రీతిలో ఆయన తనయుడు జగన్‌కు కూడా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బ్రహ్మ రథం పడుతున్నారు. జగన్ జిల్లాలో ఓదార్పు నిర్వహిస్తున్న సమయంలో నే అనేక పరిణామాలు చోటుచేసుకుం టున్నాయి.

వైఎస్‌కు అత్యంత అను యాయుడిగా పేరొందిన రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ జగన్ ను కలవడంపై అహ్మద్ పటేల్ వివర ణ అడిగినట్టు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఉండవల్లి, మరికొంత మంది కీలక నేతలు జగన్ ఓదార్పు లో పాల్గొనడానికి కాస్త ఇబ్బంది ప డుతున్నారు. ఇదే సమయంలో జగన్ 'ఓదార్పు'లో ప్రసంగాలను రూపొం దిస్తున్న నేతలు ఎవరు? తర్వాత పార్టీ పెడితే అనుసరించాల్సిన వ్యూహాలు ఏమిటి? వీటిని ఎవరు రూపొం దిస్తున్నారు? అనే కోణంలో ఇంటెలి జెన్స్ అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.

జిల్లాలో జగన్ యాత్ర జరుగుతున్న ప్రాంతాలతో పాటు కాకి నాడ, రాజమండ్రి, అమలాపురం లో క్‌సభ స్థానాల వారీగా జగన్‌కు అను కూలంగా వున్న నేతల వివరాలపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. జగన్ కు సన్నిహితుడిగా పేరొందిన కాకినా డ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, ఎమ్మెల్యేలు రాపాక వరప్రసాద్, నల్లమిల్లి శేషారెడ్డి, మాజీ మంత్రులు జక్కంపూడి రామ్మోహనరావు,

ముద్ర గడ పద్మనాభం వంటి నేతలు జగన్ పార్టీ పెడితే బలమైన వర్గంగా తయా రవుతారన్న కోణంలో కూడా ఇంటెలి జెన్స్ సమాచారం సేకరిస్తున్నట్టు చె ప్తున్నారు. జగన్ పార్టీ ఏర్పాటు చేస్తే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర కీలక నేతల్లో ఎవరెవరు యువ నేత వెంట నిలబడతారు? వ్యతిరేక వర్గంలో ఉంటారు అన్న అంశంపైనా చర్చ జరుగుతోంది.