Showing posts with label K.V.P.Ramachandrarao. Show all posts
Showing posts with label K.V.P.Ramachandrarao. Show all posts

Tuesday, July 13, 2010

అంతొద్దు! వాడి తగ్గించాలన్న మొయిలీ - ‘ఓదార్పు ’ వివాదానికి విరుగుడు మంత్రం మెయిలీ బాణం !

విజయమ్మ, కేవీపీలకు ఫోన్
జగన్ సంయమనానికి అదే కారణం?
సీఎం ఢిల్లీ యాత్రపై నేతల్లో ఆసక్తి
 
శ్రీకాకుళం జిల్లా ఓదార్పు యాత్రలో వాడి వేడి వ్యాఖ్యలు చేసిన కడప ఎంపీ వైఎస్ జగన్ తూర్పు గోదావరిలో ఎందుకు సంయమనం పాటిస్తున్నారు? పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మొయిలీ రంగంలోకి దిగి... జగన్ తల్లి విజయలక్ష్మి, వైఎస్ సన్నిహితుడైన కేవీపీ రామచంద్రరావులకు చేసిన సూచనలే దీనికి కారణమని తెలుస్తోంది.

జగన్ ముఖ్యమంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అధిష్ఠానం ఆయనకు షోకాజ్ నోటీసు ఇస్తుందనే ప్రచారం సోమవారం విస్తృతంగా జరిగింది. ఇది జగన్ వర్గంలో కలవరం పుట్టించింది. తన వర్గంలో ధైర్యం నూరిపోసేందుకైనా జగన్ మరిన్ని పదునైన వ్యాఖ్యలు చేస్తారేమోనని కొందరు భావించారు. అయితే.. జగన్ నుంచి ఎలాంటి స్పందన కన్పించలేదు. జగన్ ప్రసంగాల్లో వాడి తగ్గించాలని, లేనిపక్షంలో అధిష్ఠానం కఠినంగా వ్యవహరిస్తుందని వైఎస్ సతీమణి విజయలక్ష్మికి మొయిలీ ఫోన్‌లో వివరించారని సమాచారం.

అదేవిధంగా జగన్‌కు అధిష్ఠానం నిర్ణయం ఏమిటో వివరించాలని, సంయమనంతో మాట్లాడాల్సిందిగా సూచించాలని కేవీపీ రామచంద్రరావును మొయిలీ కోరినట్లు సమాచారం. ఇటు తల్లి విజయమ్మ, అటు కేవీపీల సూచనల మేరకే తూర్పు గోదావరి జిల్లాలో జగన్ కాస్త సంయమనం పాటిస్తున్నట్లు అంటున్నారు. మొయిలీ సోమవారం, మంగళవారం ముఖ్యమంత్రి రోశయ్యతోకూడా మాట్లాడినట్లు తెలిసింది. జగన్ వ్యాఖ్యల పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఢిల్లీ మనసులో మాటేమిటి?
రాష్ట్ర రాజకీయాలపై కాంగ్రెస్ అధిష్ఠానం మనోగతం ఏమిటి? 'ఓదార్పు వేడి'పై పార్టీ పెద్దలు ఏమనుకుంటున్నారు? భవిష్యత్ ఎలా ఉంటుంది? ముఖ్యమంత్రి రోశయ్య ఢిల్లీ పర్యటన తర్వాతైనా ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు లభిస్తాయని పార్టీ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరప్ప మొయిలీ సోనియాకు ఎలాంటి నివేదిక ఇస్తారనేది చర్చనీయాంశంగా మారింది.

జూనియర్లకు మంత్రుల క్లాస్!
మంత్రులు, ముఖ్యనేతలను కలుస్తున్న జగన్ అనుకూల జూనియర్ ఎమ్మెల్యేలకు వారి నుంచి పలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. సంగతులేమిటని ప్రశ్నిస్తూనే.. ఓదార్పు యాత్ర, ప్రజా స్పందన తదితర అంశాలను సీనియర్లు ఆరా తీస్తున్నారు. ఆ తర్వాత... జగన్ పార్టీలో కొనసాగుతారా, లేక వేరే కుంపటి పెడతారా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వేరుకుంపటి పెడితే, మధ్యంతర ఎన్నికలు వస్తే పార్టీలో ఎంతమంది గెలుస్తారో చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు. దీనికి జగన్ వర్గీయుల నుంచి సరైన సమాధానం రావడం లేదంటున్నారు.

జగన్ ఓదార్పు యాత్రలో ప్రజాప్రతినిధులు పాల్గొనేలా 'ఒత్తిడి వ్యూహం' అమలవుతోంది. యాత్ర జరిగే నియోజకవర్గాల్లో జగన్ వర్గీయులు ముందస్తుగా కార్యకర్తల సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు యాత్రలో పాల్గొనేలా ఒత్తిడి తెస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇదే వ్యూహాన్ని అమలు చేశారు.

స్థానిక ఎమ్మెల్యేలు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రస్తావించినప్పుడు... "ఆ ఎన్నికల గురించి తర్వాత! ముందు జగన్ యాత్రలో పాల్గొంటున్నారా లేదా?'' అని కార్యకర్తలతో అడిగించారు. ఈ సమావేశంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, వారి అనుచరులు పాల్గొన్నారని శ్రీకాకుళం జిల్లాకు చెందిన శాసనసభ్యుడొకరు వివరించారు.

రోశయ్యను కలిసిన శ్రీకాకుళం ఎంపీ కిల్లి కృపారాణి
సీఎంను శ్రీకాకుళం ఎంపీ కిల్లి కృపారాణి మంగళవారం కలిశారు. ఓదార్పు యాత్రలో తన భర్త పా ల్గొనడం, ఇతర అంశాలు ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చాయని సమాచారం. యాత్ర గురించి సీఎం ప్రస్తావించలేదని ఆమె  వివరించారు.

‘ఓదార్పు ’ వివాదానికి విరుగుడు మంత్రం మెయిలీ బాణం !
MOHILI ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవహారాలపై కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర కాంగ్రెస్‌లో జరగుతున్న అవాంఛనీయ పరిణామాలకు కళ్లెం వేసే పనిలో పడింది. కడప ఎంపీ జగన్‌ ఓదార్పు యాత్రతో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి కల్లోల కడలిగా మారిం దని అధిష్టానం భావిస్తోంది. ఓదార్పు యాత్రను నిలువరించేందుకు అధిష్టానం ఎంతగా ప్రయత్నించినా జగన్‌ తన దారిన తాను యాత్రకు వెళ్లడంతో రాష్ట్ర కాంగ్రెన్‌లో రెండు శిబిరాల వాతావరణం ఏర్పడు తున్నది. దీన్ని మొగ్గ దశలోనే నివారించకపోతే ఇది వికటించి మరింత గందరగోళం నెలకొనవచ్చని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ అధిష్టానం దృష్టికి తెచ్చినట్లు తెలియవచ్చింది.

రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాలను నేరుగా ఢిల్లీ నుంచే నిర్వహించాల్సిన సమయం ఆసన్న మైందన్నది ఆయన భావనగా చెబుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు డి శ్రీని వాస్‌ ఉప ఎన్నికల్లో తానే ఒక అభ్యర్ధిగా బరిలో ఉండటంతో అధిషా ్టనానికి రాష్ట్ర కాంగ్రెస్‌కు మధ్య అనుసంధానం లేకుండా పోయింది. ప్రస్తుత అవాంఛనీయ పరిణామాలకు ఇది కూడా ఒక కారణంగా అధిష్టానం భావిస్తోంది. అందుకే వీరప్ప మొయిలీ మంగళవారం స్వయంగా రంగప్రవేశం చేశారు. ఉప ఎన్నికలకు పార్టీ తరపున బరువు బాధ్యతలను పంచుతూ ఆయన పార్టీ నాయకులకుఆదేశాలిచ్చారు.

ప్రతి ఒక్కర్నీ భాగస్వాములను చేస్తూ విడివిడిగా అందరికీ స్వయంగా లేఖలు పంపారు. ముఖ్యంగా చీటికీ మాటికీ పత్రికల్లోను, చానళ్లలోనూ పార్టీ వ్యవహారాలపై వ్యాఖ్యానాలు చేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్న వారికి ఉప ఎన్నికల బాధ్యతలు అప్పగించడం అధిష్టానం కొత్త వ్యూహంలో భాగం అంటున్నారు. మంత్రులతో బాటు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా ఈ బాధ్యతలు అప్పగించారు. వీరిలో కొందరు అధిష్టానానికి వీర విధేయులుగా ఉంటున్నట్లు రుజువు చేసుకునే ఉద్దేశంతో ప్రతి చిన్న సమస్య మీదా చానళ్ల ముందుకొచ్చి స్పందిం చడం కేంద్ర పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. ఇదంతా సామాన్య ప్రజల దృష్టిలో క్రమశిక్షణ రాహి త్యంగా ముద్ర పడుతుందని అధిష్టానం భయపడుతోంది. అందుకే జగన్‌ ఓదార్పు యాత్ర దరిమిలా ఏర్పడ్డ రాజకీయ అయోమయం నుంచి పార్టీని కాపాడేందుకు అందరి దృష్టినీ మళ్లించే కార్యక్రమంలో అధిష్టానం పడింది.

ఉప ఎన్నికలకు ఇంకా రెండు వారాలే వ్యవధి ఉన్న నేపథ్యంలో యావత్‌ పార్టీ శ్రేణుల దృష్టి ని అటు మళ్లించే కార్యక్రమాన్ని వీరప్ప మొయిలీ చేపట్టారు. ఇందులో భాగంగానే నియోజకవర్గాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను బాధ్యులను చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. నిజానికి మొదట్లో కాంగ్రెస్‌ పార్టీ ఈ ఉప ఎన్నికలను అంత సీరియస్‌గా తీసుకోదల్చుకోలేదు. అందుకే ముఖ్యమంత్రి రోశ య్య కూడా ఒకటి రెండు సందర్భాల్లో తమకు ఒకటి వచ్చినా అదనమే అంటూ ఎన్నికలను తేలిగ్గా తీసుకుంటున్న సంకేతాలిచ్చారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్ర కాంగ్రెస్‌ శ్రేణులకు గట్టి వ్యాపకం కల్పించాల్సిన అవసరం ఏర్పడింది.

లేకుంటే జగన్‌ వ్యవహారంతో రాజకీయ వాతావరణమే కలుషితం అవుతున్నట్లు అధిష్టానం గుర్తించింది. అందుకే వీరప్ప మొయిలీకి ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు పంపింది. అంతే కాదు. జగన్‌ సృష్టించిన రాజకీయ కల్లోలం నుంచి పార్టీ రాష్ట్ర శాఖను గట్టెక్కించే బాధ్యతను కూడా మొయిలీకే అధిష్టానం అప్పగించింది. అందులో భాగంగా ఇకపై పార్టీ నాయకులెవరూ జగన్‌ ఓదార్పు యాత్రను ఒక అంశంగా గాని ఒక వివాదంగా గాని చేయకుండా కట్టడి చేయ బోతున్నారు. జగన్‌ మీద చర్యలు తీసుకోబోతున్నారంటూ పుకార్లు లేవదీసి, ఆ వెంటనే జగన్‌ నుంచి ఆవేశపూరిత ప్రకటనలను ఆశించే కొన్ని శక్తులు కావాలని ప్రయత్నాలు చేస్తున్నాయని వీరప్ప మొయిలీ భావిస్తున్నారు.

అలాంటి చర్యల వల్ల వాతావరణం దెబ్బతిని మరింత క్షీణించడం మినహా మరేమీ జరగదని, ఈ తరహా దుష్ట యత్నాలకు గండి కొట్టాల్సిన అవసరం ఉందని మొయిలీ అంటున్నారు. జగన్‌ వ్యవహారం అధిష్టానం చేతిలో ఉన్నందున ఇకెవరూ దాని మీద ఇష్టమొచ్చినట్లు మాట్లాడరాదంటూ మొయిలీ అలిఖిత ఆదేశాలిచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. రానున్న రెండు వారాల పాటు ఉప ఎన్నికల మీదనే అందరి దృష్టీ కేంద్రీకృత మయ్యేలా చేయడమే మొయిలీ తక్షణ కర్తవ్యంగా చెబుతున్నారు. ఆయన వ్యూహం ఫలించి జగన్‌ అంశం ఏ స్ధాయిలో మరుగున పడుతుందో వేచి చూడాల్సిందేనని రాష్ట్ర కాంగ్రెస్‌ శ్రేణులు అంటున్నాయి.

మొత్తం మీద రాష్ట్ర వ్యవహారాలను కేంద్ర అధిష్టానం పూర్తిగా మొయిలీకే వదిలేసినట్లు తెలుస్తోంది. సోమవారం పార్టీ అధికార ప్రతినిధులు ఎవ్వరు మాట్లాడినా వీరప్ప మొయిలీయే చూసుకుంటారంటూ సంకేతాలు పంపారు. అందుకు తగ్గట్లే మొయిలీ ఢిల్లీ వచ్చిన కొద్ది గంటల్లోనే వాతావరణంలో మార్పు కనిపించింది. తొలుత జగన్‌కు అధిష్టానం షోకాజ్‌ నోటీసు ఇవ్వబోతున్నదంటూ పుకార్లు వచ్చినా మొయిలీ వెంటనే కలగజేసుకుని వాటిని ఖండించి మరింత నష్టం జరగకుండా నివారించారు. అదే సమయంలో అటు జగన్‌ కూడా ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు.

దాంతో వేడెక్కిన వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ప్రస్తుతం ఉభయ శిబిరాల్లోనూ కాల్పుల విరమణ లాంటి ప్రశాంత పరిస్థితి ఉన్నట్లే భావిస్తున్నారు. జగన్‌ని తన దారిన తనను వదిలేసి ఊరుకోవాలన్నది మొయిలీ అభిప్రాయంగా ఉంది. ఆయన సోమవారం ఢిల్లీ వచ్చిరాగానే ఇదే విషయాన్ని అధినేత్రి సోనియా గాంధీకి నివేదించినట్లు తెలిసింది. అందుకు ఆమె సుముఖత వ్యక్తం చేయగా మొయిలీ ఇతరత్రా కాంగ్రెస్‌ శ్రేణులకు సోమవారం రాత్రికల్లా ఆ సందేశాన్ని పంపినట్లు చెబుతున్నారు. ఉప ఎన్నికలయ్యేదాకా వాతావరణం విషమించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అధిష్టానం మొయిలీకి సూచించినట్లు తెలుస్తోంది.
జోరు తగ్గిన జగన్‌
jagna-hand తూర్పుగోదావరి జిల్లాలో జగన్‌ ఓదార్పు యాత్ర రోజు రోజుకూ జోరు తగ్గిపోతోంది. జగన్‌ పేలవమైన ప్రసం గాలు, రొటీన్‌ డైలాగులు ఆయన అనుచరులు, అభిమాను లను సైతం నిరాశకు గురిచేస్తున్నాయి. తన ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చి, తానేమిటో నిరూపించుకుని యువతలో ఉత్సాహం నింపుతారని ఆశించిన పార్టీ నేతల ఆశలు ప్రతి సభలోనూ నీరుగారి పోతున్నాయి. శ్రీకాకు ళంలో చేసిన ప్రసంగాలనే తూర్పు లోనూ వినిపిస్తుం డటంతో.. ఇప్పటికే వాటిని పత్రికలు, చానెళ్లలో చూసిన ప్రజలు జగన్‌ సభకువచ్చేందుకు పెద్దగా ఆసక్తి ప్రదర్శిం చడం లేదని స్పష్టంగా కనిపించింది. ఇవన్నీ జగన్‌ జోరు తగ్గిందన్న అభిప్రాయానికి వీలు కలిగించాయి.

రెండోరోజు ఓదార్పు యాత్ర సందర్భంగా మంగళ వారం తుని, కోటనందూరు మండలాల్లోని 13 గ్రామాల్లో జగన్‌ పర్యటించారు. ఆ సందర్భంగా ఆయన వ్యూహ బృందం సోమవారం నాటి కార్య్రమాలు పేలవంగా ముగి సిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈసారి కొత్త పంథా అనుసరించింది. స్కూలు పిల్లలు, డ్వాక్రా మహిళ లను భారీ సంఖ్యలో తరలించింది. దానితో వారు దారి పొడవునా భారీ క్యూగా రోడ్డుకిరువైపులా నిల బడటంతో జనం బాగా వచ్చినట్లు కనిపిం చింది. ఫలితంగా నిన్నటితో పోలిస్తే నేడు సభలు కొంత కళకళలాడాయి.

ఇదే వ్యూహాన్ని జగన్‌ అనుచర బృందం అన్ని ప్రాంతాల్లోనూ అనుసరించింది. చిన్నయ్యపాలెం గ్రామంలో సంత పక్కనే ఓదా ర్పు యాత్ర ఏర్పాటు చేసి పెద్ద సంఖ్యలో జనం వచ్చినట్లు చూపించే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా.. తొలిరోజు చేదు అనుభవా లను దృష్టిలో ఉంచుకుని జగన్‌ తన ప్రసంగానికి పదు ను పెడతారని భావించిన ఆయన వర్గీయు లకు ఆ ప్రసంగాల తీరు మొహం మొత్తేలా చేసింది. తరచూ చేస్తున్న అంశాలే అందులో ఉండటంతో జనం ఆయన ప్రసంగాన్ని వినేం దుకు కాకుండా, కేవలం జగన్‌ను చూసేందుకే పరిమిత మవుతున్నట్లు కనిపిస్తోంది. పార్టీలోని తన ప్రత్యర్థులు తనపై చేస్తున్న ఆరోపణలను గట్టిగా సమాధానం ఇస్తారని భావించిన వారికి సైతం జగన్‌ మౌనం నిరాశ పరిచింది. జగన్‌ మౌనంగా ఉన్నా రంటే దాని వెనుక ఏదో సర్దుబాటు జరిగి ఉంటుందని, లేకపోతే తన తండ్రి సేవలను కూడా తప్పుపడుతున్న నేతలకు జగన్‌ సభాముఖంగా ఎందుకు జవాబు ఇవ్వరని సామాన్య జనం అభిప్రాయపడ్డారు.

యువకులు కూడా జగన్‌ తన ప్రత్యర్థులకు సభ ద్వారా గట్టి జవాబు ఇచ్చి, సవాల్‌ చేస్తారని ఆశించే సభలకు వస్తున్నట్లు వెల్లడయింది. అయితే, జగన్‌ సభలను అనుస రిస్తున్న వారికి.. ప్రతి సభలోనూ రొటీన్‌ ప్రసంగాలు వినిపి స్తుండటంతో వారంతా ఆయనను అనుసరించకుండా అక్కడితో ఆగిపోతు న్నారు. రెండోరోజు కూడా జగన్‌ సభలు, ప్రసంగాలు పేలవంగా ఉండటంతో మీడియా కూడా హడావుడి, ప్రాధాన్యం తగ్గించింది. సాయంత్రం వేళల్లో గ్రామాల్లో జనం ఒకచోట చేరతారని గ్రహించిన జగన్‌ వ్యూహ బృందం తన యాత్రను నిదానంగా, నింపాదిగా సాయంత్రం వరకూ కొనసా గిస్తున్నట్లు కనిపిస్తోంది. తుని పట్టణం లో ఈ వ్యూహం అనుసరించినందుకే జనాలు వచ్చారు.

ఇదిలా ఉండగా..జగన్‌ తన ఓదార్పు యాత్ర లక్ష్యాన్ని ప్రజల వద్దకు చేర్చడానికి కొత్త పంథా అనుసరిస్తున్నట్లు ఆయన వర్గీయుల తాజా వ్యూహం స్పష్టం చేస్తోంది. జగన్‌ హాజరయ్యే గ్రామానికి ముందు కొంత హడావుడి వాతావరణాన్ని సృష్టించి, వాటిని ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ప్రజల్లోకి పంపించే సరికొత్త ప్రచార వ్యూహానికి తెర లేపారు. అక్కడ కొందరు యువకులు, మహిళలు వేదికపె ైకి ఎక్కి, రోశయ్య సర్కారుపై ధ్వజ మెత్తడం, మధ్యలో కాబోయే సీఎం జగన్‌ జిందాబాద్‌ అన్న నినాదాలు చేయ డం, జగన్‌ కోసం ప్రాణాలర్పిస్తాం అన్న రొటీన్‌ నినాదాలు, దృశ్యాలు ఆయా సభల్లో దారిపొడవునా కనిపించాయి.

అదేవిధంగా, స్థానిక కాంగ్రెస్‌ నేతలే స్థానిక గ్రామ మహి ళలు, యువకులను ఇంటర్వ్యూలు చేయడం, వారంతా రోశయ్య ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడం, జగనన్నను సీఎం చేసే వరకూ విశ్రమించమని శపథాలు చేయటం, అవి జగన్‌ అనుకూల చానెళ్లలో ప్రత్యక్ష ప్రసా రాలు కావ డం ఫార్సుగా మారాయి. వీటిని నిశితంగా పరిశీలిస్తే.. ఒక పథకం ప్రకారం జగన్‌ను ప్రజల్లోకి తీసుకువెళుతున్నారని స్పష్టమవుతోంది. మరోవైపు.. అందుకు తగినట్లుగానే రోశ య్య ప్రభు త్వంపై వివిధ గ్రామాల్లోని బడుగు, బలహీన వర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఆయనను వైఎస్‌తో పోల్చుకోలేకపోతున్నామని, ఆయన వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తోందని వారు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేయ డం ప్రస్తానార్హం.

అన్ని సంక్షేమ పథకాలనూ రోశయ్య ప్రభుత్వం తొలగించి వేస్తోందని, ఆయన మానవత్వంతో కాకుండా అన్నీ ‘లెక్కలతో పరిపాలన’ చేస్తున్నారని మహిళలు పెద్ద సంఖ్యలో అసహనం వ్యక్తం చేస్తుండటం ‘సూర్య’ పరిశీలనలో కనిపించింది. ‘ఆ బాబు బతికుంటే మా పింఛన్లు తప్పనిసరిగా ఆగకుండా వస్తాయన్న నమ్మకం ఉండేది. ఇప్పుడు ఆ నమ్మకం లేకుం డా పోయింది. ఆఫీసుకు వెళితే మా ముసలోళ్లను పట్టిం చుకునే దిక్కు లేదు. ఈ అబ్బాయికి (జగన్‌) పిల్లలు ఉన్నా రా? ఉంటే ఆ బాబు చల్లగా ఉండాలి. మా లాంటి పేదవాళ్ల కు రెండొందలు పించన్లు ఇచ్చిన వాళ్ల నాయన ఆశీస్సులు, మా ఆశీస్సులు అబ్బాయికి ఉంటాయ’ని 90 ఏళ్ల వృద్ధురా లొకరు ‘సూర్య’ ప్రతినిధి వద్ద వ్యాఖ్యాచింది.

రోశయ్యను తాము సీఎంగా లెక్కలోకి తీసుకోవడం లేదని, పేదవారికి అమలు చేసిన పథకాలన్నీ రోశయ్య తొలగిస్తున్నారని, తమ గ్రామాల్లో లెక్కలేనన్ని తెల్లకా ర్డులను ఈ ప్రభుత్వం తొలగించిందని మహిళలు మండి పడటం కనిపించింది. నేరుగా ఎన్నికయితే ప్రజల కష్టాలు తెలుస్తాయని మరికొందరు చదువుకున్న మహిళలు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

వైఎస్‌ పథకాలను కొనసాగించడం రోశ య్యతో సాధ్యం కాదని, జగన్‌ వల్లే అది సాధ్యమని మహిళలు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. మరికొందరు కాంగ్రెస్‌ కార్యకర్తలు, ఎంపీటీసీ స్థాయి నేతలు వైఎస్‌కు రోశయ్య ద్రోహం చేస్తున్నారని, ఆయన దయతో సీఎం అయిన రోశయ్య.. జగన్‌ ఎవరని ప్రశ్నించటం విశ్వాసఘాతుకమేనని ధ్వజమెత్తారు. జగన్‌ సీఎం కావడం ఖాయమన్నారు. జగన్‌ హాజరయ్యే మరికొన్ని సభల్లో.. వైఎస్‌ ఆత్మ ముఖ్యమంత్రి రోశయ్యను తూర్పారపడుతున్నట్లు మిమిక్రీల ద్వారా వినిపించారు.

Monday, July 12, 2010

ఆత్మరక్షణలో...! రోశయ్య ఆయుధాలు రెండు


ఓదార్పు యాత్ర ముందుకు సాగుతున్న కొద్దీ వైఎస్‌ జగన్మో హన్‌రెడ్డి మాటల దూకుడును కలసి కట్టుగా అడ్డుకునేందుకు మంత్రులు, సీనియర్‌ నేతలు సిద్ధమవుతున్నారు. ఇక ముందు జగన్‌ చేసే ప్రతి వ్యాఖ్యపైనా తీవ్ర స్థాయిలో ఎదురుదాడి చేసేం దుకు సన్నాహాలు పూర్తి అయ్యాయి. ఇప్పటిదాకా జగన్‌ నోటి వెంట తన పేరు ప్రస్తావనకు రాకపోవటంతో లౌక్యంగా సర్దుకుపోతూనే చుర కలు వేస్తూ వచ్చిన ముఖ్యమంత్రి రోశయ్య ఇక ఇప్పుడు అలా ఉంటే లాభం లేదని భావిస్తున్నట్టు తెలిసింది.

laughసర్కార్‌ మనుగడపై జగన్‌ వ్యాఖ్యల ప్రభావం తీవ్రంగా ఉంటుందని, ఎలాగైనా తన ముఖ్యమంత్రి పదవిని, సర్కార్‌ను నిలబెట్టు కోవాలని ఆయన కృత నిశ్చయంతో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. అయితే తన పెద్దరికం నిలబెట్టుకుంటూ కాగల కార్యభారాన్ని మొత్తం మంత్రులు, సీనియర్‌ నేతలు, అధిష్ఠానం పెద్దలపైనే మోపాలని రోశయ్య భావిస్తున్నట్టు సమాచారం. అందుకు సూచనగానే సోమవారం నుంచి నిన్న మొన్నటిదాకా జగన్‌ను నూటికి నూటొక్కసార్లు వెనకేసుకు వచ్చిన మంత్రులు, పలువురు సీనియర్‌ నేతలు ఒక్కసారిగా జగన్‌పై విరుచుకుపడటం ప్రారంభించారు. ఇంతకాలం పాటు జగన్‌కు వెన్నుదన్నుగా ఉన్న సీనియర్‌ మంత్రులు బొత్స సత్యనారాయణ లాంటి వారే ఇప్పుడు ఎదురుదాడికి నాయకత్వం వహించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఆగ్రహించిన రోశయ్య?...
రోజులు గడిచే కొద్దీ జగన్‌ వ్యాఖ్యలు పదునెక్కు తుండటం, ఇప్పటిదాకా తనపై పరోక్షంగా దాడి చేసిన ఆయన, రణస్థలం వద్ద ఏకంగా తనపైనే బాణాలు ఎక్కుపెట్టటం రోశయ్యను తీవ్ర ఆగ్ర హానికి గురి చేసినట్టు విశ్వసనీయ సమాచారం. జగన్‌ వ్యాఖ్యలు వినటంతోనే ఆయన సీనియర్‌ మంత్రులతో సీరియస్‌గా మంతనాలు జరిపి, ఎదురుదాడికి అవసరమైన సలహాలను అడిగి తెలుసుకున్నారు. జగన్‌ తనకుమారుడి లాంటి వాడని ఎన్ని పర్యాయాలు చెప్పినా, ఓదార్పు యాత్రకు అధిష్ఠానం ఆమోదం లేదని మాత్రమే చెప్పి, మిగిలిన విషయాలు మాట్లాడకపోయినా తననే లక్ష్యంగా చేసుకుని జగన్‌ నేరుగా వ్యాఖ్యానించి దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయటం రోశయ్యను కంగు తినిపించింది. ఆయన ఇలా తనపైనే సూటిగా వ్యాఖ్యలు చేస్తారని ఊహించలేకపోయారు. ఇంతదాకా వచ్చిన తర్వాత ఇక ఊరుకుంటే లాభం లేదన్న నిర్ణయానికి వచ్చి తాను వెనుక ఉంటూ ఒకరిద్దరు తప్ప మంత్రులందరినీ ముందుకు తోసి ఎదురుదాడికి పురి కొల్పాలని నిర్ణయించుకున్నారు.

నష్టం నివారణ కోసమే...
జగన్‌ వ్యాఖ్యలు మరింత పదునెక్కితే వాటి ప్రభావం సర్కార్‌ మనుగడపై సైతం పడక తప్పదని రోశయ్య విశ్వసిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు మౌనంగా ఉంటే ఓదార్పు యాత్ర ముగించిన తర్వాత జగన్‌ ఇక మరింతగా ఎదురుదాడికి దిగుతారని, దాన్ని మొగ్గలోనే తుంచేసి, ప్రభుత్వానికి ఎలాంటి డోకా లేకుండా చూసుకోవాలని ఆయన భావిస్తున్నట్టు ఆ వర్గాలు వివరించాయి. ఈ వ్యూహంలో భాగంగానే ఆయన కొందరు మంత్రులతో మాట్లాడుతూ ‘సర్కార్‌ను ఉంచుకున్నా ... ముంచుకున్నా భారం మీదే...ఆ అబ్బాయి అలా మాట్లాడుతుంటే మీరు ఆకుకు అందని, పోకకు పొందని మాటలు మాట్లాడుతూ పబ్బం గడిపితే లాభం లేదు...మాటకు మాట...వ్యాఖ్యకు వ్యాఖ్య పద్ధతిలో ఎదురుదాడికి సమాయత్తం కావాలి...అటు వైపు నుంచి తీవ్రతను బట్టి దానికి దీటైన రీతిలో జవాబివ్వాలి...ఆలస్యం చేస్తే అసలుకే మోసం వచ్చేట్టుంది...’ అని చెప్పినట్టు సీనియర్‌ మంత్రులు కొందరు చెబుతున్నారు.

రాజీ యత్నాలకు రాం...రాం...?
రోశయ్య ఈ మాట చెప్పటంతో సీనియర్‌ మంత్రులు ఒక్కసారిగా మేలుకున్నారు. మరోవైపు ఈ పరిస్థితి మరింత తీవ్రతరం కాకుండా రాజీ యత్నాల కోసం జగన్‌కు సన్నిహితుడైన వ్యవసాయ మంత్రి రఘువీరారెడ్డి నివాసంలో ఆదివారం సమావేశమైన కొందరు మంత్రులు జగన్‌ వ్యాఖ్యలు విన్న తర్వాత ఇక వారిద్దరి మధ్య రాజీ యత్నాలు చేసినా ఫలితం ఉండబోదని నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.

ఎదురుదాడికి సిద్ధం కావాలని రోశయ్య ఇచ్చిన సంకేతాన్ని అందుకున్నదే తడవుగా జగన్‌కు సన్నిహితుడుగా పేరున్న మంత్రి వట్టి వసంతకుమార్‌ తన చాంబర్‌లో ఆరుగురు ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ప్రసాదరాజు, జోగి రమేశ్‌, శ్రీకాంత్‌రెడ్డి, రాజేశ్‌, గురునాథ రెడ్డి, బాలరాజుతో జరిపిన మంతనాల్లో జగన్‌ వ్యాఖ్యలపై ఏమీ మాట్లాడలేని స్థితి నెలకొన్నదని, ఓదార్పు యాత్రలో రాజకీయాలు మాట్లాడబోనని ముందు చెప్పిన జగన్‌, అలా మాట్లాడటం తప్పేనని నిర్ణయించినట్టు సమాచారం. ఈ వ్యాఖ్యలను ఎదుర్కోకపోతే అనేక పరిణామాలకు దారి తీసే ప్రమాదం ఉందని భేటీలో నిర్ణయించారు.

బొత్సతో మొదలు...
తన ముఖ్యమంత్రి పదవి పోతుందనే రోశయ్య కుట్ర చేస్తున్నారనే అర్థం వచ్చే రీతిలో జగన్‌ చేసిన వ్యాఖ్యలపై ముందుగా నిరసన తెలిపే బాధ్యతను సీనియర్‌ మంత్రి బొత్స సత్యనారాయణ తీసుకున్నారు. సోమవారం ఆయన పత్రికల వారితో శాసనసభ ఆవరణలో మాట్లాడుతూ వైఎస్‌ రాజశేఖరరెడ్డికి జగన్‌ కుమారుడు మాత్రమే అని, ఆయనకు కుటుంబ వారసత్వం మాత్రమే ఉందన్నారు. తామంతా రాజకీయ వారసులం అని చెప్పుకున్నారు. ముఖ్యమంత్రి పదవి కావాలని రోశయ్య పైరవీ చేసుకోలేదని, ఆయన పేరు ప్రతిపాదించింది జగన్‌ కాదా అని ప్రశ్నించారు. ఒక సీనియర్‌ మంత్రి నోటి వెంట జగన్‌ను ఉద్దేశించి వచ్చిన వ్యాఖ్యలు, ఆయనను వైఎస్‌ కుటుంబానికి మాత్రమే పరిమితం చేయాలనుకోవటం మామూలు పరిణామం కాదు.

అదే బాటలో మరి కొందరు...
బౌత్స సత్యనారాయణ బహిరంగంగా ఇలా మాట్లాడారో లేదో సిద్దిపేట లోక్‌సభ సభ్యుడు సర్వే సత్యనారాయణ ఢిల్లీలో మాట్లాడుతూ జగన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సముద్రంలాంటి పార్టీలో జగన్‌ ఒక నీటి చుక్కగా అభివర్ణించారు. నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చి గంతులేస్తే ఎలా? అని గద్దించారు. ఇటు నిజామాబాద్‌ ఎంపీ మధు యాష్కీ అయితే జగన్‌ యాత్ర బోగస్‌ అని కొట్టి పారేశారు. అధికార దాహంతోనే ఈ యాత్ర సాగుతున్నదని విరుచుకు పడ్డారు. వీరికన్న ముందే పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, శంకర్రావు లాంటి వారు నిప్పులు కురిపించారు.

ఎమ్మెల్యేల కింకర్తవ్యం?...
ఒకవైపు జగన్‌ దూకుడు, మరోవైపు మంత్రులు, సీనియర్ల ఎదురుదాడి నేపథ్యంలో జగన్‌ వర్గానికి చెందిన పలువురు ఎమ్మె ల్యేలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎటువైపు మొగ్గితే ఏమవుతుం దో అనే ఆందోళన వారిలో కనిపిస్తున్నది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉన్నప్పటినుంచి ఆయనతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న కొందరు ఎమ్మెల్యేలు తాడో పేడో తేల్చుకుందామన్న ఆలోచనతో ఉంటే, మరి కొందరు అధిష్ఠానం మాటను ధిక్కరిస్తే ఎలా అనే మీమాంసలో పడిపోయారు. తమంతట తాము ఎలాంటి ప్రకటన లు, వ్యాఖ్యానాలు చేయకుండా జిల్లాకు చెందిన సీనియర్‌ నేతలు, మంత్రుల సూచనల మేరకు నడుచుకోవాలనుకుంటున్నట్టు చెబుతున్నారు.

కేవీపీ
Rosaiah,-KVP
కాంగ్రెస్‌ అంతర్గత కలహాలు, జగన్‌ తిరుగు బాటుకు సంబంధించి అడిగే ప్రతి ప్రశ్నకూ తనకెలాంటి సంబంధం లేదని, ‘అంతా అధిష్ఠానమే చూచుకుంటుంద’నే ముఖ్యమంత్రి రోశయ్య తాజాగా తెలివైన కొత్త వ్యూహానికి తెర లేపారు. ఇంతవరకూ తనను ఇబ్బంది పెడు తున్న జగన్‌ను లక్ష్యంగా చేసుకుని వ్యంగ్య వ్యాఖ్యలు, వెటకారమైన మాటలు మాట్లాడు తోన్న రోశయ్య ఇక వైఎస్‌ ఆత్మబంధువు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కేవీపీ రామచంద్ర రావును లక్ష్యంగా పెట్టుకుని పావులు కదుపు తుండటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశ మయింది. తనకు ఇబ్బందులు సృష్టిస్తోన్న జగన్‌ను కేవీపీ ‘అధిష్ఠానం దారిలో తెచ్చేందుకు’ ప్రయత్నిస్తున్నారని తాను నమ్ముతున్నట్లు, అధిష్ఠానం ఆలోచనలకు భిన్నంగా కేవీపీ వ్యవహరించబోరని విశ్వసిస్తున్నట్లు రోశయ్య చేసిన నర్మగర్భమైన వ్యాఖ్యలు పరిశీలిస్తే.. ఈ వ్యవహారంలో ఆయన నెమ్మదిగా కేవీపీనీ వ్యూహాత్మకంగా ఇరికించేప్రయత్నాలు చేస్తు న్నట్లు స్పష్టమవుతోంది.

ఒక విధంగా జగన్‌ను కేవీపీ నియంత్రించి తీరాలన్న ఆదేశం, బలవం తపు బాధ్యత రోశయ్య మాటల్లోధ్వనిస్తోంది. ముఖ్యమంత్రి పక్కన చేరిన ఒక ప్రముఖుడే జగన్‌కు దన్నుగా నిలుస్తున్నారంటూ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఇటీవల ఆరోపణలు చేసిన నేపథ్యంలో, రోశయ్య చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. అంటే.. కేవీపీ జగన్‌ను తెరచాటు మద్దతునిస్తున్నారని రోశయ్య చెప్పకనే చెప్పినట్టయింది. కేవీపీ జగన్‌ను నియంత్రించడం లేదని, ఆయన ఒకవైపు రోశయ్యకు సన్నిహితంగానే వ్యవహరిస్తు న్నారన్న విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో రోశయ్య ప్రకటన కూడా అదే సంకేతాలను బలపరుస్తోందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

జగన్‌ను నియంత్రించే అవకాశం ఒక్క కేవీపీకే ఉందని, ఆయన ఎవరి మాటా వినరని కూడా రోశయ్య అధిష్ఠానానికీ సంకేతాలిచ్చారు. దీనిద్వారా.. జగన్‌ను నియంత్రించే బాధ్యతను తెలివిగా కేవీపీపైకి నెట్టి, ఆ బాధ్యతలో ఒకవేళ ఆయన విఫలమయితే అందుకు కేవీపీనే బాధ్యుడిని చేసే వ్యూహంతోనే రోశయ్య కొత్త ఎత్తులు మొదలుపెట్టినట్లు స్పష్టమవుతోంది. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంకా కేవీపీ కనుసన్నులలోనే నడుస్తున్నారని పార్టీవర్గాల్లో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రోశయ్య వ్యాఖ్యలు కూడా దానినే బలపరుస్తున్నాయి. మొత్తానికి కేవీపీ భుజంపై నుంచి తుపాకీ గురిపెట్టి జగన్‌ను పేల్చాలన్నది రోశయ్య వ్యూహంగా కనిపిస్తోంది.

ఓదార్పు యాత్రలో కేవీపీ మేనల్లుడు
తూర్పుగోదా వరిలో ప్రవేశించిన జగన్‌ ఓదా ర్పుయాత్ర లో రాష్ట్ర రక్షణ, భద్రతా వ్యవహరాల కమిటీ ఛైర్మన్‌, రాజ్యసభ సభ్యుడు కేవీపీ మేనల్లుడు అశోక్‌ ఉండటం అందరినీ ఆకర్షించింది. సోమవారం నాటి ఓదార్పు యాత్రను విజ యవంతం చేయడానికి అశోక్‌ ఆదివారం నుంచే ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం నుంచి జగన్‌ను వెన్నంటే ఉన్నారు.

Saturday, July 10, 2010

కెవిపి రామచంద్రరావుకు ఇప్పుడు పెద్ద పరీక్ష

వైయస్ ఆప్త మిత్రుడు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావుకు ఇప్పుడు జీవన్మరణ సమస్య ఎదురైంది. అధిష్ఠానం వద్దంటున్నా వినకుండా ఓదార్పు యాత్రకు వెళ్లిన జగన్‌ వ్యవహారశైలిని నాయకత్వం ఓ వైపు నిశితంగా పరిశీలిస్తోంది. యాత్రపై పూర్తి స్థాయి నిఘా పెట్టింది. మరోవైపు సోనియా, రోశయ్య తీరుపై జగన్‌ వర్గీయుల నుంచి విమర్శల దాడి ఉధృతమ వుతోంది. ఈ క్రమంలో జగన్‌ కాంగ్రెస్‌ (వైయస్‌) పార్టీని స్థాపించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న వార్తలు వెలువడుతున్నాయి.
ఈ నేపథ్యంలో..దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ కు ఆత్మబంధువుగా ముద్ర ఉన్న కేవీపీ ఎటువైపు నిలుస్తారన్న అంశంపై పార్టీలో చర్చ ప్రారంభమయింది. వైయస్‌ మృతి చెందిన తర్వాత కేవీపీ హవా తగ్గిపోతుందని, రోశయ్య ఆయనను పక్కకుబెడతారని తొలుత ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టే కేవీపీ కూడా రోజూ జగన్‌ నివాసానికి వెళ్లి మంత్రాంగం నడపడం అలాంటి ప్రచారానికి బలం చేకూర్చింది. అయితే, ఆశ్చర్యకరంగా..రోశయ్య మునుపటి మాదిరిగానే కేవీపీకి ప్రాధాన్యం కొనసాగించారు. ఇరిగేషన్‌ కాంట్రాక్టర్లకు బిల్లుల మంజూరు, ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారుల బదిలీలు, ఇతర వ్యవహారాల్లో వైయస్‌ ఉన్నప్పుడు ఏ స్థాయిలో హవా సాగించారో ఇప్పుడూ దానినే కొనసాగిస్తున్నారు. పార్టీ వ్యవహారాల్లో కూడా ఆయన ప్రభ ఇంకా వెలుగుతూనే ఉంది.

రోశయ్య కూడా ‘అన్ని వ్యవహారా ల్లో’ కేవీపీపైనే ఆధారపడి, ఆయనకు అందరి కన్నా ఎక్కువే ప్రాధాన్యం ఇస్తున్నారన్న వాస్తవం స్పష్టమవుతోంది. ‘అధిష్ఠానం అవస రాలు తీర్చే’ అంశంలో కేవీపీ పాత్రను కొన సాగించాలన్న ఢిల్లీ సంకేతాల మేరకే ఆయనకు పాత ప్రాధాన్యం ఇస్తున్నారన్నది పార్టీ సీనియర్ల ఉవాచ. ముఖ్యమంత్రి కూడా కేవీపీ వ్యవహారంలో లౌక్యంగా వ్యవహరించారు. వైయస్‌ మృతి చెందిన తర్వాత కూడా కేవీపీకి ప్రాధాన్యం ఇవ్వడంపై తెలంగాణ [^] సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సీఎం మాత్రం లౌక్యంగా ఎవరికి ఇవ్వవలసిన ప్రాధాన్యం వారికి ఇస్తానని సర్దిచెప్పారు. ఆ విధంగా అటు జగన్‌ వ్యతిరేకవర్గంతో, ఇటు జగన్‌ అనుకూలుడైన కేవీపీతోనూ పని తీసుకుంటున్న వ్యూహాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.

జగన్‌ పార్టీ నుంచి వెళ్లిపోతున్నారన్న ప్రచారం జరుగుతున్నందున..ముఖ్యమంత్రి పీఠం కోసం ఎదురుచూసి, ఆ లక్ష్యసాధన కోసం పనిచేస్తున్న తన ఆప్తమిత్రుడి తనయుడు జగన్ ‌కు బాసటగా నిలుస్తారా లేదా అని నేతలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. తన మిత్రుడు వైయస్‌ సీఎం కావాలన్న తన కోరికను నెరవేర్చుకున్న కేవీపీ.. మిత్రుడి కుమారుడు కూడా సీఎం కావాలని కోరుకోరా అని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అదే నిజమయి జగన్‌ స్థాపించే పార్టీలో కేవీపీ చేరితే.. కాంగ్రెస్‌ వల్ల సంక్రమించిన ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా? అదే సమయంలో వైయస్‌ మాదిరిగానే తనకు అధిక ప్రాధాన్యం ఇస్తూ తనను గౌరవిస్తోన్న రోశయ్యను వదులుకుంటారా?..మిగిలిన వారంతా జగన్‌ పార్టీలో చేరితే..కేవీపీ ఒక్కరే దూరంగా ఉంటే వచ్చే విమర్శలను ఏవిధంగా ఎదుర్కొంటారు?