Saturday, January 8, 2011

ఆదుకుంటా.. అండగా ఉంటా..

విశాఖ జిల్లా నాతవరం వుండలం ఎం.బి.పట్నంలో వైఎస్ మరణాన్ని తట్టుకోలేక అసువులుబాసిన ఉలబాల అక్కయ్యువ్ము కుటుంబాన్ని జగన్ శనివారం సాయుంత్రం ఓదార్చారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటానని, అండగా ఉంటానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. దివంగత ముఖ్యమంత్రి  రాజశేఖరరెడ్డి వురణాన్ని తట్టుకోలేక గత 2009 సెప్టెంబర్ 3న అక్కయ్యువ్ము మృతి  చెందింది. ఎలాంటి కష్ట మొచ్చినా ఆదుకుంటానని జగన్ ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు. ఆమె భర్త నూకరాజును, పెద్దకొడుకు పెదనూకరాజును ఓదారుస్తూ.. కుటుంబ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఎవరేమి పనులు చేస్తున్నారంటూ వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు.

అక్కయ్యువ్ముకు ముగ్గురు కొడుకులుండగా వారిలో ఇద్దరికి వివాహమై వ్యవసాయు కూలీలుగా పనిచేస్తున్నారు. మూడో కొడుకు ఉలబాల లోవ బీఎస్సీ పూర్తి చేశాడు. కొంతకాలంగా ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నానని, దారి చూపాలని అతను జగన్‌ను కోరాడు. తప్పకుండా ఆదుకుంటావుని జగన్ ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు. సువూరు పది నిమిషాలపాటు అక్కడ గడిపారు. యువనేతతోపాటు అనకాపల్లి ఎంపీ సబ్బం హరి, మాజీ మంత్రి కొణతాల రావుకృష్ణ, ఎం.బి.పట్నం సర్పంచ్ వర్రె సత్యనారాయుణ ఉన్నారు.

No comments:

Post a Comment