Friday, July 30, 2010

ఎంతకాలం కాదు...ఎలా బతికామన్నది ముఖ్యం : జగన్‌ - ఈ సహనం ఎంతకాలమో... ! ధిక్కారమే !


 తన వ్యతిరేక వర్గంపై యువనేత వైఎస్‌ జగన్‌ నిప్పులు చెరిగారు. ఎంతకాలం బతికామన్నది కాదు... ఎలా బతికామన్నది ముఖ్యమని, ఓదార్పుయాత్ర చేస్తానని ప్రకటించిన రోజు ఏ రాజకీయాలు లేవని, ఇపుడు దాన్ని వైఎస్‌ఆర్‌ వ్యతిరేకులు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తరపున ఓదార్పుయాత్ర ఎందుకు చేయలేదని జగన్‌ ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌ చేసిందేమీ లేదని ఆయన వ్యతిరేకులు ఇపుడు ఏదేదో మాట్లాడి అభాండాలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. కాకినాడ నేతాజీ పార్క్‌లో ఏర్పాటు చేసిన ఓదార్పు యాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడారు. కేవలం 10 నిమిషాలే మాట్లాడినా తన నాన్న వైఎస్‌ చేసిన మంచి పనుల గురించి చెబుతూనే తన వ్యతిరేకులపై నిప్పులు చెరిగారు. జగన్‌ రాక సందర్బంగా నేతాజీ పార్క్‌ జనసంద్రమైంది. ఈ సభతో జగన్‌పై అభిమానం ఉప్పెనలా పొంగిందనే చెప్పాలి.  పేలబోయే అగ్నిపర్వతం ముందు కనిపించే ప్రశాంతత.. లావా ఎప్పుడు ఎగజిమ్ముతుందో తెలియని స్థితిలో కనిపించే వేడి.. గుండెల్లో రగులుతున్న బడబాగ్ని.. తనకు, తన అనుచరులకు జరుగుతున్న అన్యాయంపై గుండెమంట..ప్రత్యర్థులపై విరుచు కుపడే పదునయిన పదజాలం.. త్వరలో ఏదో జరగబోతోందన్న సంకేతాలు. ఇవీ.. ఓదార్పు యాత్రికుడు, కడప ఎంపి వైఎస్‌ జగన్‌ గురువారం కాకినాడలో చేసిన ప్రసంగంలో కనిపించిన భావాలు.

18 రోజులపాటు తూర్పు గోదావరిలో ఓదార్పు యాత్ర నిర్వహించి, గురువారం కాకినాడలో నిర్వహించిన భారీ బహిరంగ సభ వేదికపై జగన్‌ ఆచితూచి, వ్యూహాత్మకంగా ప్రసంగించారు. మనసులో ప్రత్యర్థులు ఎక్కడికక్కడ తనకు బ్రేకులు వేస్తున్నారన్న ఆగ్రహాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తూనే, అక్కడక్కడా తన అసంతృప్తిని ఎక్కడా తొట్రుపాటు లేకుండానే బహిర్గతం చేశారు.

తన తండ్రి వైఎస్‌ మృతి చెందిన వార్తను తట్టుకోలేక మృతి చెందిన వారంతా కాంగ్రెస్‌ కార్యకర్తలు కాదా? వారి కష్ట సుఖాలు తెలుసుకుని ఆర్థిక సాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని సూటిగా ప్రశ్నించినప్పటికీ.. ఎక్కడా రోశయ్య ప్రభుత్వాన్నిప్రస్తావించకుండా వ్యూహాత్మకంగానే విమ ర్శలు సంధించారు. కాంగ్రెస్‌ పార్టీని అధికా రంలోకి తెచ్చేందుకు కష్టపడ్డ కార్యకర్తలు తమ ప్రియతమ నేత చనిపోతే వారిని రోశ య్య సర్కారు పట్టించుకోవడం లేదని, తాను పరామర్శించేందుకు వస్తుంటే అడ్డుపడుతున్నారని చెప్పకనే చెప్పినట్లు కనిపించింది. తనను నమ్ముకున్న వారి కోసం పోరాడతారనే పేరున్న రాజశేఖరరెడ్డి వారసత్వాన్ని జగన్‌ కూడా కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోంది.

తనకు మద్దతు గా నిలిచిన ఎమ్మెల్యే కొండా సురేఖ, అంబటి రాంబాబుకు జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. వారిద్దరికీ న్యాయం చేయలేకపోయానన్న బాధ ఉందని చెప్పడం ద్వారా, తండ్రి మాదిరిగానే. తన కోసం నిలిచిన వారి పక్షాన పోరాడ తానన్న సంకేతాలు పంపించారు. జగన్‌ తన ప్రసంగంలో ఎక్కడా కాంగ్రెస్‌ పార్టీ గురించి కానీ, పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గురించి కానీ, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు గానీ ప్రస్తావించకపోవడం బట్టి. తనకు జనం, అనుచరులే ముఖ్యమని పరోక్షంగా స్పష్టం చేశారు.

ప్రసంగం ఆసాంతం తన తండ్రి వైఎస్‌ రాజ శేఖరరెడ్డి పేద ప్రజల కోసం చేపట్టిన కిలో రెండు రూపాయ ల బియ్యం పథకం, విద్యార్థులకు ఫీజుల రీ ఇంబర్స్‌మెంట్‌, మహిళలకు పావలా వడ్డీ వంటి పథకాలు ఏ ముఖ్యమంత్రి ఇచ్చారని నిలదీయడం ద్వారా.. ఒక్క వైఎస్‌ మాత్రమే పేదల కోసం ఆలోచించిన ముఖ్యమంత్రి అని విస్పష్టంగా ప్రకటిం చారు. సొంత పార్టీలో పెరుగుతున్న విమర్శల దాడులు, ప్రతిపక్షాల నుంచి వస్తున్న ఆరోపణలు జగన్‌ అంతరంగం ఆగ్రహంతో ఉడికిస్తు న్నాయని ఆయన ప్రసంగం చెప్పకనే చెప్పింది.

అధిష్ఠానం సహా ముఖ్యమంత్రి తనను అణచివేసేందుకు చేస్తున్న ప్రయ త్నాలపై అంతరంగం మండుతున్నా, దానిని సైతం అణచు కుని, లౌక్యంగా, వ్యూహాత్మకంగా మాట్లాడటం అందరినీ ఆక ర్షించింది. మనసులో గూడుకట్టుకున్న ఆగ్రహాన్ని, తనపై జరుగుతున్న అణచివేత వైఖరిని పెదవి చాటున ఓర్పుగా భరిస్తున్నప్పటికీ, ఆ సహనం ఎంతకాలం ఉంటుం దో చెప్ప లేని అయోమయంలో జగన్‌ ఉన్నట్లు ఆయన మాట ల ధోర ణి స్పష్టం చేసింది. ‘ఈ సహనం ఇంకా ఎంతకాలం ఉంటుం దో చెప్పలేను కానీ’ అంటూ తన మనసులో రగులు తున్న భావాలను బయట పెట్టకుండా దానికి వ్యూహాత్మకంగా అస్ప ష్ట ముగింపు ఇచ్చారు. త్వరలో ఏదో జరుగబోతోందన్న ఉత్కంఠతో పాటు.. అధిష్ఠానానికి ‘తాను ఖాళీగా కూర్చోనన్న’ సంకేతాలిచ్చినట్లు స్పష్టమవుతోంది. జనం తన వెంటే ఉన్నారని, 30 మంది ఎమ్మెల్యేలు తనకు దన్నుగా ఉన్నారన్న విషయం జగన్‌ ప్రసంగంలో ప్రతిధ్వనించింది.

ఈ సహనం ఎంతకాలమో... !
jagan-speach ‘ఈ సహనం ఎంతకాలం ఉంటుందో తెలీదు. నా సహనానికి సమయం చెప్పలేను’ అని కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్‌ జగన్మోహనరెడ్డి అన్నారు. నాన్నగారు పోతూపోతూ తనను ఒంటరిని చేయలేదని, ఇంత పెద్ద కుటుంబాన్ని, అక్కల్ని, చెల్లెళ్లను, అన్నయ్యల్ని ఇచ్చారని ఆర్ద్రంగా అన్నారు. ‘ఎంతకాలం బతికామన్నది ముఖ్యం కాదు, ఎలా బతికామన్నది ముఖ్యం. నాన్నగారు పోయిన తర్వాత ఆ బాధలో కూడా చిరునవ్వుతో ఉన్నానంటే అందుకు మీ ఆప్యాయత, ఆదరాభిమానాలే కారణం’ అని జగన్‌ ప్రజలకు కృత జ్ఞతలు తెలిపారు. గురువారం రాత్రి కాకినాడలో నేతాజీ పార్కులో తన ఓదార్పు యాత్రకు వచ్చిన అశేష ప్రజానీ కాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

jagansirసభకు వచ్చిన ప్రజానీకాన్ని చూసి ఉత్సాహం ఉప్పొంగగా -‘మొత్తం కాకినాడ అంతా ఇక్కడే ఒక్కచోటే ఉందా అనిపిస్తోంది. మీ ఆప్యాయతానురాగాల్ని చూస్తు న్నాను. వైఎస్‌ పట్ల మీ గుండెల్లో ఉన్న అభిమానపు గుండె చప్పుళ్లు వినిపిస్తున్నా యని’ ఉద్వేగంగా అన్నారు. తన తండ్రి మరణించిన తర్వాత ఆయనపై ఉన్న ప్రేమతో, అభిమానం తో కొందరు ఆత్మహత్య చేసుకున్నారని, వారి కుటుంబా లను ఓదార్చ డం ఆయన కుమారుడిగా తన కనీస ధర్మమ ని జగన్‌ చెప్పారు. అయితే, తన ఓదార్పు యాత్రకు కూడా ఎందరో ఎన్నో ఆటంకాలు కల్పించారనీ, కానీ ఎవరేమన్నా చేయాల్సింది చేసితీరతానని కడప ఎంపీ స్పష్టం చేశారు.

అంబటి, సరేఖలకు అన్యాయం చేశారు...
‘నన్నే నమ్ముకుని, నా వెంటే ఉన్న కొండా సురేఖకు, అంబటి రాంబాబుకు అన్యాయం జరిగింది. ఎవరు అన్యాయం చేసినా వారు నా గుండెల్లో ఎప్పటికీ ఉంటారు’ అని జగన్‌ వారిపట్ల అభిమానాన్ని ప్రదర్శించారు.ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నానని తెలిపి, ఓదార్పు యాత్రకు ఎలా ప్రేరణ కలిగిందీ ఆయన వివరించారు. గత ఏడాది సెప్టెంబర్‌ 2న నాన్నగారు చనిపోతే, సెప్టెంబర్‌ 25న ఆయన చనిపోయిన పావురాల గుట్టలో సంతాపసభ జరిగింది. నాన్నగారి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారున్నారు.

crowd-ysవారి కుటుంబాలను ఓదార్చడానికి వస్తానని ఆనాడే...నాన్నగారు చనిపోయిన చోటే వాగ్దానం చేశాను. ఈ ప్రాంతంలో ఇంతవరకు నాలుగు జిల్లాలు తిరిగాను’ అని వైఎస్‌ తనయుడు చెప్పారు. రాజశేఖరరెడ్డి ప్రజలకోసం చేపట్టిన పథకాల గురించి చెబుతూ- ‘ఇంతవరకూ ఏ ఒక్క సిఎం అయినా వైఎస్‌లా పేదలకు మంచి వైద్యం అందించాలన్న ఆలోచన చేశారా?పావలా వడ్డీ పథకంతో లక్షలాదిమంది మహిళల్ని లక్షాధికారుల్ని చేయాలని ఎవరైనా ఏ ప్రభుత్వమన్నా సంకల్పించిందా? దేశంలో ఎవరైనా 26 లక్షల మంది పేద విద్యార్థులకు ఉన్నత విద్యాభ్యాసానికి అవకాశం కల్పించా రా? ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించా రా?’ అని ఆయన ప్రశ్నించారు. ఇవన్నీ చేసింది వైఎస్‌నే నని ఆయన ప్రస్తుతించారు. జలయజ్ఞాన్ని చేపట్టి లక్షా 80 వేల కోట్లతో ప్రతి ఎకరాకు సాగునీరందించాలని ఎవరైనా సంకల్పించారా? అని అడిగారు. ప్రతి ఎకరాకు లక్షా 80 వేల రూపాయలు ఇచ్చినట్టే కాదా అన్నారు.

మానవత్వంతో, నిండు గుండెతో...
అంతకు మందు మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ మాట్లాడుతూ జగన్‌ను చూసిన ప్రతివారూ, ప్రతి చోటా నాన్నగారి పేరు నిలబెట్టు బాబూ అని కోరారు. వారి అభిమానం మమ్మల్ని కదిలించింది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణిస్తే ఆ బాధను తట్టుకోలేక 750 మంది చనిపోయా రు. పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. అది చూసి మానవత్వంతో, నిండు హృదయంతో జగన్‌ వారి కుటుం బాల్ని ఓదార్చేందుకు వచ్చారు’ అని పేర్కొన్నారు. వర్షంలో నూ వేలాది మంది ప్రజలు సమావేశానికి హాజరయ్యారు.

సర్కారు సంగతేమిటి?
జగన్ వేరుకుంపటి పెడితే రోశయ్య ప్రభుత్వం పరిస్థితి?

బతుకుతుందా? కూలుతుందా?
మధ్యంతరం వస్తుందా?
రాష్ట్రపతి పాలన తెస్తుందా?
భవిష్యత్తు రాజకీయంపై ఆసక్తికర చర్చ
 'సహనం నశిస్తున్నది' అంటున్న కడప ఎంపీ జగన్ వేరు కుంపటి పెట్టుకుంటే రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి? బొటాబొటి మెజారిటీతో నెట్టుకొస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఏమిటి? దివంగత ముఖ్యమంత్రి వైఎస్ వారసుడిగా తెరపైకి రాబోతున్న జగన్ వెంట వెళ్లేది ఎందరు? కురు వృద్ధుడైన ముఖ్యమంత్రి రోశయ్యకు, హై కమాండ్‌కు అండగా ఉండేది ఎవరు?


మధ్యంతరం వస్తుందా? రాష్ట్రపతి పాలనతో ఆగుతుందా? అసలు... సర్కారు కుప్పకూలుతుందా? ఆపత్కాల 'సహచరుల' అండతో నిలబడుతుందా? ఇదీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అత్యంత ఆసక్తికరంగా జరుగుతున్న చర్చ! ఎన్నో సమీకరణాలు, మరెన్నో సంభావ్యతలు!

రాష్ట్ర శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 294. స్పీకర్‌ను మినహాయిస్తే, ప్రభుత్వ మనుగడకు (కనీస మెజారిటీ) 147 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 156! అంటే మేజిక్ ఫిగర్ కంటే కేవలం 9 మంది మాత్రమే ఎక్కువ అన్న మాట! ఈ అత్తెసరు పరిస్థితే భవిష్యత్తు రాజకీయాన్ని అత్యంత ఆసక్తికరంగా మారుస్తోంది. ఏం జరుగుతుందన్న ఉత్కంఠను రేపుతోంది.

ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశిస్తున్న జగన్ , వేరుకుంపటి పెట్టుకోవడం అంటూ జరిగితే, తక్షణం రోశయ్య ప్రభుత్వాన్ని పడగొట్టడమే ఏకైక కార్యక్రమంగా పావులు కదుపుతారనడంలో ఎవరికీ సందేహాలు లేవు. ఎందుకంటే రాష్ట్రంలో సాధారణ ఎన్నికలకు దాదాపు నాలుగేళ్ల సమయం ఉంది. అప్పటిదాకా వేచిచూసే ఉద్దేశమే ఉంటే ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగేవారు.

రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని మొత్తం హస్తగతం చేసుకుంటే తప్ప జగన్ వెంటనే సీఎం కావడం సాధ్యం కాదు. అది ఎలాగూ జరిగే పని కాదు కనుక, వెంటనే ప్రభుత్వాన్ని పడగొట్టి, మధ్యంతర ఎన్నికలను తెచ్చి, లక్ష్య సాధనకు ప్రయత్నించడమే జగన్ వ్యూహంగా భావించవచ్చు.

అయితే ప్రభుత్వాన్ని ఆయన పడగొట్టగలరా? మామూలుగానైతే 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను జగన్ తన వైపునకు తిప్పుకోగలిగితే ప్రభుత్వం మైనారిటీలో పడుతుంది. అయితే ప్రస్తుత అంచనాల ప్రకారం... ముగ్గురు ఇండిపెండెంట్లు, ఏడుగురు మజ్లిస్ సభ్యులు ఇప్పటికే కాంగ్రెస్‌కు సన్నిహితంగా మెలుగుతున్నారు.

ఇక 18 మంది సభ్యులున్న ప్రజారాజ్యానికి కూడా అధిష్ఠానం 'ముందు జాగ్రత్త'గా స్నేహహస్తం అందించి ఉంచింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శాసనసభా పక్షం నుంచి కనీసం 38 మందిని చీల్చగలిగితేనే రోశయ్య ప్రభుత్వాన్ని జగన్ మైనారిటీలో పడేయగలరు. ఈ క్రమంలోనూ ఇరువైపులా మళ్లీ అనేక ప్రశ్నలు, ప్రతిబంధకాలు. అవేమిటంటే....

ముగ్గురు స్వతంత్రులూ వైఎస్ హయాంలో కాంగ్రెస్ అనుబంధ సభ్యులుగా మారారు. వారిప్పుడూ కాంగ్రెస్ వైపే ఉంటారా? జగన్ వైపు తిరుగుతారా? స్వతంత్రులు ప్రభుత్వంవైపే ఉండడం సాధారణంగా కనిపించే పరిణామం. ఇక 18 మంది పీఆర్పీ ఎమ్మెల్యేల్లో కనీసం ఐదుగురు వైఎస్ కుటుంబానికి సన్నిహితులు. ఈ నేపథ్యంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి వారు సర్కారుకు మద్దతిస్తారా?

కాకినాడలో గురువారం జగన్ నిర్వహించిన సభకు 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సోనియా ఆమోదం లేకపోయినప్పటికీ, ఎందరు ఎమ్మెల్యేలు జగన్ వద్దకు వెళ్లడం కీలకమేనని భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్‌ను కాదని జగన్ ముందుకు నడిస్తే, ఆ పక్కకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుందనే అంచనాలున్నాయి.

కాకినాడ సభకు వెళ్లిన వారిలో చాలామంది, 'ప్రజాదరణ కలిగిన' జగన్‌కు నైతిక మద్దతు మాత్రమే ఇస్తున్నారని, కాంగ్రెస్‌లోనే కొనసాగాల్సిందిగా ఆయనను కోరుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఎక్కువమంది తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన వారే కావడం, పదవీ కాలం మరో మూడున్నరేళ్లు ఉండడం నేపథ్యంలో, జగన్ కోసం పార్టీతో తెగదెంపులు చేసుకోవడానికి, 'అధికారాన్ని' కోల్పోవడానికి, మళ్లీ ఎన్నికల బరిలో నిలబడడానికి వీరందరు సిద్ధపడతారా? పార్టీయే ముఖ్యమని వెనుదిరుగుతారా?

కాంగ్రెస్‌వాదిగా ఉంటేనే తమ మద్దతు లభిస్తుందని జగన్‌కు చెప్పాల్సిందిగా ఇటీవల కొందరు మంత్రులు యువ ఎమ్మెల్యేలకు కౌన్సెలింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే కొందరు ఎమ్మెల్యేలు కాకినాడకు వెళ్లారని ప్రచారం కూడా జరుగుతోంది. అక్కడికి వెళ్లిన వారందరూ వేదికపై కనిపించకపోవడంపై కూడా పలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఎక్కువ మంది మాట్లాడేందుకు అవకాశం లేదని, అలాంటివారు కింద కూర్చోవాలని, లేదా వెళ్లేవారు వెళ్లిపోవచ్చని కూడా అక్కడ చెప్పారని దీంతో కొందరు మీటింగ్‌కు ముందే వచ్చేశారనే చర్చ కూడా ఉంది. మరోవైపు బహిరంగ సభకు హాజరు కానప్పటికీ జగన్‌కు మద్దతుగా నిలిచే వారు కాంగ్రెస్ శాసనసభా పక్షంలో ఇంకొందరు ఉన్నారు. వీరందరి సంఖ్యా కనీసం 38ని దాటుతుందా?

ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే, నలుగురు సభ్యుల సీపీఐ, ఒక్కొక్క సభ్యుడున్న సీపీఎం, బీజేపీ, లోక్‌సత్తా ఎలాంటి వైఖరి తీసుకుంటాయి? కొత్తగా ఎన్నిక కాబోతున్న టీఆర్ఎస్ సభ్యులు ఏం చేస్తారు? జగన్ వేరు కుంపటి పెట్టుకుంటే టీఆర్ఎస్ కాంగ్రెస్‌తో కలుస్తుందన్న ప్రచారం సాగుతోందని టీఎన్జీవో నేత స్వామిగౌడ్ గురువారం కేసీఆర్ సమక్షంలోనే చెప్పారు.

'సోనియాకు నామీద అభిమానం ఉంది. ఆమె నాతో ఫోన్ చేసి మాట్లాడుతుంది అనేవి నిజమే కానీ అంటూనే టీఆర్ఎస్ కాంగ్రెస్‌లో కలిసే అవకాశం లేదని పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ఈ సందర్భంగా చెప్పడం గమనార్హం. ఇక 91 మంది సభ్యులున్న ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఏం చేస్తుందన్నది మరో కీలక ప్రశ్న.

తప్పనిసరై సభలో అవిశ్వాసం వస్తే టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు కూడా రోశయ్య సర్కారు పడిపోకుండా సహకరిస్తారని, సభకు గైర్హాజరు అవుతారనే ప్రచారం సాగుతోంది. ప్రభుత్వ మనుగడకు పరోక్షంగానైనా సహకరించాలని ఆయా పార్టీలుగానీ, వాటికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు గానీ నిర్ణయించుకుంటే, ఆ పరిస్థితిలోనూ సర్కాను పడగొట్టేంత బలాన్ని జగన్ సంపాదించుకోగలరా?

ఈ కీలక ప్రశ్నలకు సమాధానాలు రావడం అంత సులభం కాదు. జగన్ నుంచి ప్రమాదం అంచనా వేసినందునే అధిష్ఠానం చిరంజీవితో చర్చలు జరిపి ముందస్తు మద్దతు స్వీకరించిందని, మజ్లిస్ కూడా కాంగ్రెస్‌కు తోడ్పాటునందిస్తుందని.. అందువల్ల రోశయ్య ప్రభుత్వానికి ప్రమాదమేమీ ఉండదని ఢిల్లీ నేతలు ధీమాగా ఉన్నట్టు వారు చెబుతున్నారు.

"ఏడాదిన్నర కూడా కాకుండానే ఇప్పటికిప్పుడు మళ్లీ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనడానికి ఎమ్మెల్యేలు ఎవరూ సిద్ధంగా లేరు. ఒకవేళ ఉన్నారనుకున్నా, రోశయ్య సర్కారును పడగొట్టిన వెంటనే ఎన్నికలు వస్తాయన్న గ్యారెంటీ కూడా ఏమీ లేదు. కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కనుక అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచి, రాష్ట్రపతి పాలన విధించవచ్చు.

ఒకసారి రాష్ట్రం ప్రస్తుత గవర్నర్ పాలనలోకి వెళితే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ప్రాభవం పోగొట్టుకోక తప్పదు. చేజేతులా అధికారాన్ని కోల్పోయి, ప్రతిపక్ష ఎమ్మెల్యేల్లా గోళ్లు గిల్లుకోవాల్సి ఉంటుంది'' అని పార్టీ నేత ఒకరు విశ్లేషించారు.

కాంగ్రెస్‌ను కాదంటే జగన్‌కు బలం పెద్దగా ఉండదని లెక్కలు వేస్తూనే అధిష్ఠానం ఇతర ఆలోచనలు కూడా చేస్తున్నది. వెంటనే ఎన్నికలకు సంసిద్ధంగా లేని ఇతర పక్షాలతో, సభలో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదింప జేసినట్లయితే, తర్వాత ఆరు నెలల దాకా బల నిరూపణ చేసుకోవాల్సిన అవసరమే ఉండదని అది భావిస్తోంది.

జగన్ సొంత పార్టీ పెట్టుకుంటే, ఆయనతో జత కూడిన ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించి, ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హులుగా ప్రకటించడం మరో మార్గమని, మళ్లీ విశ్వాసం నిరూపించుకోవాల్సిన గడువులోగా వారు పదవులు కోల్పోతారని పార్టీ ముఖ్యులు లెక్క వేస్తున్నారు.

ఏదిఏమైనా ఈ రాజకీయాలు కాంగ్రెస్‌ను గందరగోళంలో పడేయడం ఖాయమని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 2న సీఎం రోశయ్య ఢిల్లీ వెళుతున్నారు. రాష్ట్ర రాజకీయాలపై అధిష్ఠానంతో ఆయన చర్చించే అవకాశం ఉంది. jagan-speach

Wednesday, July 28, 2010

కాకినాడలో తెగదెంపుల సంగ్రామమా? జ'గన్' పేలేనా? అటు విప్... ఇటు నిప్పు నేడు 'బల ప్రదర్శన'

తూర్పుగోదావరిలో ఓదార్పు ముగింపు
సభకు రావాలంటూ ఎమ్మెల్యేలకు పిలుపు
35 మంది శాసనసభ్యులు వస్తారని అంచనా
మరింత బయటపడ్డ వర్గ విభేదాలు
తారాస్థాయికి చేరిన మాటల యుద్ధం
 
అధిష్ఠానంతో ఇక అతకనంత దూరం
బెడిసి కొట్టిన సయోధ్య యత్నాలు
సోనియా మాట ఎత్తేందుకు యువనేత ససేమిరా
తదుపరి ఓదార్పు ప్రకాశం జిల్లాలో!

కాంగ్రెస్‌లో 'కదన స్వరాలు' పురి విప్పుతున్నాయి. వర్గాల మధ్య విభజన రేఖలు మరింత స్పష్టంగా బయటపడుతున్నాయి. బుధవారం రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. 'కాంగ్రెస్‌కు జగన్ తప్ప మరో దిక్కులేదు' అని జగన్ వర్గీయులు పేర్కొనగా... 'మరేం ఫర్వాలేదు! ఆయన పార్టీని వదిలి వెళ్లిపోవచ్చు' అనేలా ప్రత్యర్థులు ఒకింత దీటుగానే బదులిచ్చారు.

సస్పెన్షన్ వేటు పడిన అంబటి రాంబాబు మరోమారు గళమెత్తగా... నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మొట్టమొదటిసారి బహిరంగంగా జగన్‌కు జై కొట్టారు. వీరిద్దరి వ్యాఖ్యలపై ఎంపీలు సర్వే సత్యనారాయణ, వి.హనుమంతరావు, ఎమ్మెల్యే శంకర్‌రావు మండిపడ్డారు. మొత్తానికి... వారూ వీరూ కలిసి కథను మరింత త్వరగా 'క్లైమాక్స్' చేర్చే సంకేతాలు పంపుతున్నారు.

జగన్ వ్యవహారాన్ని దగ్గరుండి పరిశీలించాలని అధిష్ఠానం ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇందులో భాగంగానే వచ్చేనెల 6న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ హైదరాబాద్‌కు వస్తున్నట్లు సమాచారం. అలాగే.. 4వ తేదీన జరగనున్న రాష్ట్ర కేబినెట్ భేటీలోనూ జగన్‌కు సంబంధించిన చర్చ జరిగే అవకాశముంది.

ఇన్ని పరిణామాల మధ్య... తూర్పు గోదావరి జిల్లాలో షెడ్యూలుకు అతీతంగా సాగిన జగన్ ఓదార్పు యాత్ర ముగింపు సభ గురువారం జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు వివిధ జిల్లాల ఎమ్మెల్యేలు, నేతలు కాకినాడకు చేరుకున్నారు. సభను జగన్ వర్గీయులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దీనిని 'బహిరంగ బల ప్రదర్శన'కు వేదికగా మారుస్తున్నారు. సభలో పాల్గొనాల్సిందిగా నేతలకు సమాచారం పంపారు.

తన వర్గీయుడైన అంబటి రాంబాబుపై సస్పెన్షన్ వేటు వేసినా తమాయించుకున్న జగన్... గురువారం నాటి సభలో అధిష్ఠానంపైనా, రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంపైన మాటల తూటాలు పేల్చే అవకాశముందని ఆయన వర్గీయులే అంటున్నారు. శ్రీకాకుళం జిల్లా ఓదార్పు యాత్ర ముగింపు సందర్భంగా రణస్థలంలో ముఖ్యమంత్రి రోశయ్యను ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలాన్ని రేపాయి.

ఇప్పుడు కూడా తన యాత్రలో పాల్గొనకుండా ఎమ్మెల్యేలను రోశయ్య అడ్డుకుంటున్నారని జగన్ భావిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన రాష్ట్ర నాయకత్వంతో పాటు, అధిష్ఠానంపైనా నిప్పులు చెరిగే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే... అధిష్ఠానానికి తమ బలం చూపడమే లక్ష్యమని, జగన్ రాజకీయంగా సంచలన వ్యాఖ్యలు ఏవీ చేయబోరనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. గురువారం జగన్ అలాంటి వ్యాఖ్యలు చేసినా, చేయకపోయినా... ఆయనకూ, అధిష్ఠానానికీ మధ్య పరిస్థితి ఇప్పటికే 'ఉప్పూ, నిప్పు'లా మారింది.

విపక్షాల వాయిదా తీర్మానం నేపథ్యంలో బుధవారం పార్టీ ఎంపీలంతా లోక్‌సభకు హాజరు కావాలని కాంగ్రెస్ విప్ జారీ చేసింది. పార్లమెంటు సమావేశాల గురించి పట్టించుకోని జగన్... విప్‌ను కూడా పక్కకు పడేశారు. ఓదార్పు యాత్రలోనే ఉన్నారు. గురువారం బహిరంగ సభలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. వీటన్నింటి నేపథ్యంలో కడప ఎంపీకి, కాంగ్రెస్ అధిష్ఠానానికీ మధ్య అగాథం పూడ్చలేనంతగా పెరుగుతోంది.

జగన్ కాంగ్రెస్‌లోనే ఉండాలని భావిస్తున్న ఆయన వర్గీయులకు ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోంది. 'రాజీకి మార్గాలు మూసుకుపోయి కనిపిస్తున్నాయి. ఇలాంటి ధిక్కారాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం సహించే ప్రసక్తి ఉండదేమో!' అని జగన్ శ్రేయోభిలాషుల్లో ఒకరైన ఎంపీ సబ్బం హరి సైతం అభిప్రాయపడటం గమనార్హం. అధిష్ఠానం మాట ఎలా ఉన్నా... సయోధ్యకు యువనేతే ససేమిరా అంటున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా పేరెత్తడానికే ఆయన ఇష్టపడటంలేదని తెలుస్తోంది. తాము అధిష్ఠానం మాటను ధిక్కరించలేమని, ఇదే సమయంలో జగన్‌ను వదులుకునేందుకు కూడా సిద్ధంగాలేమని ఆయన వర్గీయుల్లోనే కొందరు అంటున్నారు. వీరు సయోధ్య యత్నాలకు శ్రీకారం చుట్టారు. కొందరు నేతలు ఇటీవల వైఎస్ బంధువు వైవీ సుబ్బారెడ్డిని కలివారు.

జగన్‌కు, అధిష్ఠానానికి మధ్య పెరుగుతున్న దూరాన్ని తగ్గించేందుకు చొరవ చూపాలని సూచించారు. వారి సూచనలతో వైవీ సుబ్బారెడ్డి కూడా ఏకీభవించారు. అయితే... 'నేను జగన్‌కు ఎలాంటి సలహాలూ ఇవ్వను. మీలో ఎవరో ఒకరు ఆయనను కలసి చెప్పాలనుకున్నది చెప్పండి' అని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఒకరు తూర్పు గోదావరి జిల్లా ఓదార్పు యాత్రలో ఉన్న జగన్‌తో సమావేశమయ్యారు. అధిష్ఠానంతో వైరం పెంచుకుంటూ పోవడంకంటే.. సయోధ్యతో ముందుకు సాగడమే మంచిదని తెలిపారు. ఓదార్పు యాత్రలో సోనియాను ప్రశంసిస్తూ ప్రసంగించాలని సూచించారు. దీనికి జగన్ ససేమిరా అన్నారు.
'నా ఓదార్పు యాత్రకు సోనియా అనుమతి ఇవ్వలేదు. ఇది జగమంతటికీ తెలుసు. ఓదార్చేందుకు వస్తానని పావురాలగుట్ట సభలోనే ప్రకటించాను. ఆ మాటను నిలబెట్టుకుంటున్నాను. నాన్న రక్తం నాలో ప్రవహిస్తోంది. బాధిత కుటుంబాలను ఓదార్చాల్సిన బాధ్యత నాపై ఉంది.

ఇదే విషయాన్ని అధిష్ఠానానికి వివరించాను. యాత్ర పట్ల సోనియా సుముఖతను వ్యక్తం చేయలేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ యాత్రలో సోనియాను ప్రశంసించాలని నాతో ఎలా చెబుతారు? ఇది సాధ్యం కాదు. ఆ ఆస్కారమే లేదు'' అని జగన్ తేల్చి చెప్పినట్లు తెలిసింది.

బుధవారం ఎంపీలు సబ్బం హరి, అనంత వెంకట్రామిరెడ్డి, కేంద్ర మంత్రి సాయి ప్రతాప్ ఢిల్లీలో భేటీ అయ్యారు. జగన్ విషయంపై చర్చించారు. వీరు జగన్‌కు, అధిష్ఠానానికీ మధ్య తెగతెంపులు కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు తెలిసింది. ఎంపీలు కిళ్లి కృపారాణి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా జగన్ పార్టీలో లేకపోతే పార్టీకే నష్టమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సభలో బల ప్రదర్శన...
తూర్పు గోదావరి జిల్లాలో షెడ్యూలుకు అతీతంగా సాగిన 'ఓదార్పు' యాత్ర గురువారం బహిరంగ సభ రూపంలో ముగియనుంది. ఈ సభకు జగన్ అనుచరగణం అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. ఈ సభ వేదికపై జగన్ తన మనసులోని మాటను వెల్లడించాలని నిర్ణయించారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.

సభకు సరిగ్గా ఒక్కరోజు ముందు... అంబటి రాంబాబు, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తదితరులు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఇవి వారి వ్యక్తిగత వ్యాఖ్యలుగా భావించలేమని.. జగన్ మనసులోని మాటలుగానే పరిగణించాల్సి వస్తుందని కొందరు కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు.

ఇప్పటిదాకా ఏదైనా జిల్లాలో ఓదార్పు యాత్ర ముగింపు సమయంలో జగన్ తన తండ్రి విగ్రహాన్ని ఆవిష్కరించి, అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడమే జరిగింది. తొలిసారిగా కాకినాడలో బహిరంగ సభకు వేదికను సిద్ధం చేయడం చర్చనీయాంశమైంది. ఈ సభకు సాధ్యమైనంత మంది ఎక్కువ ఎంపీలను రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

పొరుగున ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాతోపాటు ఇతర జిల్లాల నుంచి కూడా ఎమ్మెల్యేలను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనుచర గణంతో సహా తరలి రావాలంటూ నేతలకు పిలుపులు వెళ్లాయి.

ఇప్పటికే జగన్ వర్గీయులుగా పేరొందిన ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి), శ్రీనివాసులు (రైల్వే కోడూరు), అమర్‌నాథ్‌రెడ్డి (రాజంపేట), ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు), రామచంద్రారెడ్డి (రాయదుర్గం), శివప్రసాదరెడ్డి (దర్శి), పి. రామకృష్ణారెడ్డి (మాచర్ల) కాకినాడలో బస చేశారు. బుధవారం వీరంతా జగన్‌ను కలిశారు.

మాజీ మంత్రి కొండా సురేఖ దంపతులు కూడా కాకినాడ చేరుకున్నారు. ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి దంపతులు, ఆళ్లనాని, జోగి రమేశ్ తదితరులు కూడా సభకు వచ్చే వీలుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

ఇక.. తూర్పు గోదావరి జిల్లాలో మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌తోపాటు ఎనిమిదిమంది ఎమ్మెల్యేలు జగన్ యాత్రలో భాగస్వాములయ్యారు. వీరంతా గురువారం నాటి సభలో పాల్గొనే అవకాశముంది. ఏ విధంగా చూసినా 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు ఈ సభలో పాల్పంచుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

జగన్ వర్గీయులు మాత్రం 35 మంది ఎమ్మెల్యేలు రావడం ఖాయమని చెబుతున్నారు. తదుపరి 'ఓదార్పు' ప్రకాశం జిల్లాలో ఉంటుందని జగన్ ఈ సభలోనే ప్రకటిస్తారని ఆయన సన్నిహితులు తెలిపారు. త్వరలో తెలంగాణలోనూ జగన్ యాత్ర నిర్వహిస్తారని గట్టు రామచంద్రరావు కాకినాడలో తెలిపారు. జగన్ గురువారం రాత్రి రైలులో హైదరాబాద్‌కు బయలుదేరతారు.

Saturday, July 24, 2010

జోరుగా సాగుతున్న జగన్‌యాత్ర

జోరుగా సాగుతున్న జగన్‌యాత్ర
కోనసీమలో రెండు రోజులుగా ఉత్సాహభరితంగా కొనసాగుతున్న జగన్‌యాత్ర శుక్రవారం నాటికి మూడవరోజుకు చేరుకుంది. అర్థరాత్రి దాటుతున్న జగన్‌ రాకకోసం గంటల తరబడి వర్షపు చినుకులలో తడిసి ముద్దవుతూ అభిమానులు నిరీక్షించారు. వారి నిరీక్షణలకు తగ్గట్టుగానే జగన్‌ విశ్రాంతి తీసుకోకుండా అర్థరాత్రి దాటుతున్నా సరే అభిమానులు నిరుత్సాహానికి గురికాకుండా పలు గ్రామాలలో వైఎస్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి ఆవిష్కరించారు. పలు గ్రామాలలో ముత్తయిదువులు మంగళహరతులతో స్వాగతం పలికారు. మరికొందరు జగన్‌ అన్నా అంటూ చేతికి రక్షాబంధన్‌లు కట్టి తమ అభిమానం చాటుకున్నారు. అక్కడక్కడా కొన్ని గ్రామాలలో జనం పలచగా కనబడినప్పటికీ మండల ముఖ్యకేంద్రాలలో జగన్‌కు అపూర్వ ఘనస్వాగతం లభించింది. తమ అభిమాన నాయకుడు స్వర్గీయ వైఎస్‌ ముద్దుబిడ్డ జగన్‌ను చూడడానికి జనం ఎగబడ్డారు.

ఆయనతో కరచాలనం చేయడానికి వయోబేధం లేకుండా అభిమానులు పోటీపడ్డారు. గురువారం రాత్రి 11 గంటలకు గన్నవరం మండలం గంటిపెదపూడిలో ప్రవేశించి అక్కడ వైఎస్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం బెల్లంపూడి చేరుకుని వైఎస్‌ ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన పెనుమాల వెంకటేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి, రాత్రి 2 గంటలకు గన్నవరం సెంటర్‌కు చేరుకున్నారు. సెంటర్‌లో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి, డొక్కా సీతమ్మ వారథి వద్ద అభిమానులు ఏర్పాటుచేసిన స్వర్గీయ వైఎస్‌ విగ్రహాన్ని ఆవిష్కరించే సమయం తెల్లవారు జాము 3గంటలు కావడంతో జనం అంతగా లేకపోవడంతో నిరుత్సాహంగా ప్రసంగించకుండానే రాజోలు మండలం దిండి చేరుకుని రిసార్ట్సులో బసచేసారు. శుక్రవారం ఉదయం జడ్పీచైర్మన్‌ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్వగృహంలో అల్పాహారవిందు ఆరగించిన అనంతరం రాజోలు, తాటిపాకలలో వైఎస్‌ విగ్రహాలను ఆవిష్కరించి, అభిమానులనుద్ధేశించి ప్రసంగించారు.

గన్నవరం ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి స్వగ్రామం వేగివారిపాలెం చేరుకుని అక్కడ ఆమె ఇంట కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని, వైఎస్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. లక్కవరంలో వైఎస్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి అభిమానులనుద్ధేశించి ప్రసంగించారు. అదే గ్రామంలో పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థినులు జగన్‌కు టాటా చెబుతూ ఉత్సాహంగా వీడ్కోలు పలికారు. మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంకు చెందిన సోమన దీప్తికళ కుటుంబాన్ని, వీవీమెరకకు చెందిన గుండాబత్తుల స్వామినాయుడు కుటుంబాలను పరామర్శించి నేనున్నానంటూ ధైర్యం చెప్పారు.
 
అదే గ్రామంలో వైఎస్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి, వైఎస్‌కొడుకుగా పుట్టడం తన అదృష్టమని అభిమానులనుద్ధేశించి మాట్లాడారు. అనంతరం సఖినేటిపల్లి మండలం మోరి, శృంగవరప్పాడు, కేశవదాసుపాలెం, అంతర్వేది, గొంది, గుడిమెల్లంక గ్రామాలలో పర్యటించి వైఎస్‌ విగ్రహాలను ఆవిష్కరించారు. వైఎస్‌ మృతి జీర్ణించుకోలేక మృతిచెందిన గుడిమెల్లంక గ్రామస్తుడు మామిడిశెట్టి సత్యనారాయణ కుటుంబాన్ని ఓదార్చారు. అనంతరం దిండి చేరుకుని అక్కడ రిసార్ట్సులో బస చేసారు. శుక్రవారం రాత్రికి జగన్‌ తల్లి స్వర్గీయ వైఎస్‌ సతీమణి విజయలక్ష్మి, సీనియర్‌ నాయకులు చేగొండి హరిరామజోగయ్యలు జగన్‌ను కలసి పలు విషయాలు చర్చించనున్నారు.

శనివారం ఉదయం గన్నవరం చేరుకుని అక్కడ అభిమానులనుద్ధేశించి ప్రసంగించి కె.ఏనుగుపల్లిలో వైఎస్‌ మృతిని జీర్ణించుకోలేక అసువులు బాసిన అభిమాని కుటుంబాన్ని పరామర్శించి వివిధ గ్రామాలలో ఏర్పాటుచేసిన వైఎస్‌ విగ్రహాలను ఆవిష్కరించి అమలాపురం చేరుకుని ఓదార్పుయాత్ర కొనసాగిస్తారని పార్టీ నాయకులు తెలిపారు. మంత్రి విశ్వరూప్‌ ప్రత్యక్షంగా జగన్‌యాత్రలో పాల్గొనకపోయినప్పటికీ కుమారుడు కృష్ణారెడ్డి ద్వారా జగన్‌యాత్రను సక్సెస్‌ చేయాలని మైకులద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పినిపే కృష్ణారెడ్డి యువజనసేన పేరుతో ఫ్లెక్స్‌బోర్డులతో, వాహనాలతో జగన్‌యాత్రకు అధికసంఖ్యలో అభిమానులు తరలిరావాలని పిలుపునిస్తున్నారు. ఈ యాత్రలలో జగన్‌వెంట జడ్పీచైర్మన్‌ సీహెచ్‌ వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, ఎమ్మెల్యేలు రాపాక వరప్రసాద్‌, పాముల రాజేశ్వరీదేవి, పీసీసీ కార్యదర్శి కేవీ సత్యనారాయణరెడ్డి, మాజీ యువజన కాంగ్రెస్‌నాయకుడు మిండగుదిటి మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Sunday, July 18, 2010

జగన్‌కు ఓదార్పు * మీ ఆప్యాయత అపారం ఎమ్మెల్యేలను ఉద్దేశించి జగన్ వ్యాఖ్య * హైకమాండ్ కొరడా * కడప ఎంపీ విధేయుడు రాంబాబుపై తొలిదెబ్బ* జగన్ వర్గంలో కలవరం సన్నిహితులతో కడప ఎంపీ మంతనాలు

 
 జగన్‌కు ఓదార్పు
'జగన్‌పై చర్యలు తీసుకోం.. ఓదార్పు యాత్ర ఆయన వ్యక్తిగతమైనది.' అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీర ప్ప మొయిలీ తేల్చి చెప్పడం జగన్ వర్గానికి ఊరటనిచ్చింది. 'ఓదార్పు'లో పాల్గొంటే అధిష్ఠానం ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని భావించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకుల్లో చాలా మంది శనివారం జరిగిన ఆరో రోజు యాత్రలో పాల్గొన్నారు. దీంతో జగన్ వర్గంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. మొయిలీ ప్రకటనలో జగన్‌కు నేతల 'ఓదార్పు' ఎక్కువైంది. రాజమండ్రి ఆర్అండ్‌బీ అతిథిగృహం నుంచి శనివారం ఉదయం పది గంటలకు బయలుదేరిన జగన్ సాయంత్రం ఐదు గంటల వరకు రాజమండ్రి నగరంలోనే పర్యటించారు. లాలాచెరువు, క్వారీ మార్కెట్, మోరంపూ డిలలో వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించిన జగన్ పలుచోట్ల కాంగ్రెస్ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు.

నేను ఒంటరిని కాదు
'నేను ఒంటరివాడైపోయాడ నుకుంటున్నారు.. ఇంత మంది అభిమానం ఉన్న జగన్ ఒంటరివాడెలా అవుతాడు. ఇంత ఆత్మీ యాను రాగాలు పంచుతున్న మీ అందరూ నా వెంటే వుంటే ఒం టరినెలా అవుతాను' అంటూ జగన్ ఉద్వే గంగా మాట్లాడారు. మీరంతా నా తండ్రి రాజశేఖరరెడ్డిని గుండెల్లో పెట్టుకున్నారు. నన్ను తమ్ముడిగా, అన్నగా, కొడుకుగా ఆదరిస్తున్న మీ అందరికీ రుణపడి ఉన్నానన్నారు.

ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని భయపడకుండా చాలా మంది నేతలు నా వెంట వస్తున్నారు. ఎవరూ ఎవరికీ భయప డాల్సిన అవసరం లేదు.. మీరంతా నా వెంట ఉండటం నాకు కొండంత బలాన్నిస్తోందని జగన్ చెప్పుకొచ్చారు. తనను రాజమండ్రి లోనూ, తూర్పుగోదావరి జిల్లాలోనూ ఎంతగానో ఆదరిస్తున్నారని క్వారీ మార్కెట్‌సెంటర్‌లో జరిగిన సభలో జగన్ చెప్పారు.

జక్కంపూడికి పరామర్శ
ఉదయం 10.30 గంటకు మాజీ మం త్రి జక్కంపూడి రామ్మోహనరావును పరామర్శించేందుకు జగన్ ఆయన ఇంటికి వెళ్లారు. మంత్రి బోస్, జక్కం పూడి విజయలక్ష్మి, జక్కంపూడి రాజా, గణేష్‌లు జగన్‌ను గజమాలతో స్వాగ తించారు. ఈ సందర్భంగా జై జగన్, జై వైస్సార్ అంటూ నినాదాలు చేశా రు. సుమారు అరగంట సేపు గడిపిన జగన్ జక్కంపూడి ఆరోగ్యంపై ఆరా తీశారు. ఇటీవల ఆరోగ్యం కాస్త మెరు గుపడిందని జక్కంపూడి కుటుంబ సభ్యులు జగన్‌కు వివరించారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తాకిడి
జగన్ ఓదార్పు యాత్ర ఆయన వ్యక్తి గతం.. అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహా రాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ చేసిన ప్రకటనతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బహిరంగంగా యాత్రలో పాల్గొనేం దుకు ఉత్సాహం చూపారు. జిల్లాకు చెందినరాజమండ్రి సిటీ, అనపర్తి, గన్నవరం ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్ర కాశరావు, నల్లమిల్లి శేషారెడ్డి, పాముల రాజేశ్వరీదేవిలతో పాటురైల్వేకోడూ రు, రాజంపేట, ఏలూరు ఎమ్మెల్యేలు కె.శ్రీనివాసులు, అమర నాథ రెడ్డి, ఆళ్ల నాని, ఎమ్మెల్సీలు కందుల దుర్గేష్, చైతన్యరాజు, పుల్లా పద్మావతి యాత్ర లో హుషారుగా పాల్గొన్నారు.


నాలుగు కుటుంబాలకు ఓదార్పు
ఓదార్పు యాత్రలో భాగంగా శని వారం రాజమండ్రిలో జగన్ నాలుగు కుటుంబాలను కలసి ఓదార్చారు. ఏవి అప్పారావు రోడ్ ఏరియాలో రెడ్డి సూ ర్యప్రకాశరావు, గంజి శేఖర్, అన్న పూర్ణ మ్మపేటకు చెందిన ఆగురి నరసింహమూర్తి, నా రాయణపురానికి చెందిన బొడ్డు ప్రసాదరావుల కుటుం బాలను జగన్ పరామర్శించి ఓదార్చా రు.ఆయా కుటుంబాల వా రితో జగ న్ రెండు గంటలసేపు గడిపారు. కుటుంబ సభ్యుల పరిస్థితి, ఆర్థిక స్థితిగతులపైనా ఆరా తీసిన జగన్ ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. సాయంత్రం ఆరు గంటలకు మోరంపూడి సెంటర్‌లో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించిన జగన్ అక్కడి నుంచి దివాన్‌చెరువు వెళ్లి మా గాపు ధర్మయ్య కుటుంబాన్ని ఓదార్చారు. తర్వాత నరేంద్ర పురం, రాజానగరం చేరుకుని వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు.
మీ ఆప్యాయత అపారం 
ఎమ్మెల్యేలను ఉద్దేశించి జగన్ వ్యాఖ్య
ఎవరో ఏదో చేస్తారని భయపడకుండా
నాకు అండగా ఉన్నారు
ఆరో రోజు ఐదుగురికి పరామర్శ
ఓ పక్క ఓదార్పు మరో పక్క రహస్య చర్చలు
మొయిలీ వ్యాఖ్యల తర్వాత పెరుగుతున్న మద్దతు

"ఎవరో ఏదో చేస్తారని భయపడకుండా..మీ రంతా నాకు అండగా నిలబడుతున్నారు. ఇంతటి ఆప్యాయత చూపుతున్న మీ అందరికీ కృతజ్ఞతలు'' అని కడప ఎంపీ జగన్ అన్నారు.

రాజమండ్రి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, జక్కంపూడి విజయలక్ష్మిలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు కాగా,తూర్పు గోదావరి జిల్లాలో ఆరోరోజు యాత్రలో భాగంగా శనివారం ఐదు కుటుంబాలను పరామర్శించారు. పలుచోట్ల వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు.


ఉండవల్లితో మంతనాలు
యాత్రలో భాగంగా శనివారం రాజమండ్రి వచ్చిన జగన్ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఇంటికి వెళ్లి సుమారు అరగంటసేపు ఉన్నారు. ఈ సందర్భంగా వారి మధ్య కీలక రాజకీయ చర్చ జరిగినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి జక్కంపూడి ఇంటికి వెళ్లిన జగన్ ఆయనతోనూ రహస్య చర్చలు జరిపారు.

సీమ,తెలంగాణ ఎమ్మెల్యేలతో..
యాత్ర వద్దని ఇప్పటి వరకు స్పష్టం చేసిన అధిష్ఠానం కాస్త మెత్తబడినట్లు కనిపించడం, ఓదార్పు యాత్ర ఆయన వ్యక్తిగతమని, జగన్‌పై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని మొయిలీ వ్యాఖ్యానించడంతో ఆయనకు మద్దతు పెరుగుతోంది. రాయలసీమ, తెలంగాణ జి ల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు జగన్‌తో మంతనాలు జరపడానికి రాజమండ్రి చేరుకున్నారు.

కడప నుంచి మేయర్..
జగన్ యాత్రకు కడప జిల్లా నుంచి మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డితోపాటు రాజంపేట ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కేశ్రీనివాసులు వచ్చారు.

అనంత నుంచి ఇద్దరు..
ఓదార్పు యాత్రలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే బి.గురునాథ్‌రెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.

కర్నూలు నుంచి...
ప్రజారాజ్యం పార్టీ నేత, మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి రాజమండ్రి నుంచి యాత్రను అనుసరిస్తుండగా.. కాంగ్రెస్ నేత ఎస్వీ మోహన్‌రెడ్డి గడచిన నాలుగు రోజులుగా జగన్ వెంట ఉన్నారు. మంత్రి శిల్పామోహన్‌రెడ్డి సోదరుడు చక్రపాణిరెడ్డి రెండు రోజులు పాల్గొని శుక్రవారం వెళ్లిపోయారు. కర్నూలు మార్కెట్ యార్డు చైర్మన్ వెంకటేశ్వర్లు కూడా యాత్రలో పాల్గొని శుక్రవారం కర్నూలు చేరుకున్నారు.

వైఎస్ కుటుంబంతోనే..: మంత్రి బోస్
తాను రాజకీయాలలో ఉన్నంత వరకు వైఎస్ కుటుంబంతోనే ఉంటానని మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ స్పష్టం చేశారు. తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన వైఎస్‌కు కృతజ్ఞతగానే ఈ నిర్ణయాన్ని తీసుకున్నానని చెప్పారు.

అధిష్ఠానానికి తెలిసొచ్చింది: కడప మేయర్
ఎవరు ఎంత చెప్పినా.. ప్రజాదరణ కలిగిన నేత ఎవరో అధిష్ఠానానికి ఇప్పుడు తెలిసిందని, వీరప్ప మొయిలీ తాజా ప్రకటనే ఇందుకు నిదర్శనమని కడప మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్
తక్షణం అమల్లోకి ప్రకటించిన మొయిలీ
సోనియా ఆగ్రహం ఫలితమే
జగన్‌పై చర్యలేదన్న వీరప్పకు క్లాస్ తీసుకున్న అహ్మద్ పటేల్
జగన్ వర్గీయుల వివరాలు అందజేయాలి
నేతలను ఓదార్పునకు దూరంగా ఉంచాలి
మొయిలీపైనే బాధ్యత రోశయ్యకు మేడమ్ పిలుపు
  కాంగ్రెస్ అధిష్ఠానం కొరడా ఝళిపించడం మొదలు పెట్టింది! కడప ఎంపీ జగన్ మోహన్‌రెడ్డి శిబిరంపై తొలి దెబ్బ పడింది! ముఖ్యమంత్రి రోశయ్యను అనరాని మాటలంటూ.. అసభ్య సవాళ్లు విసిరిన జగన్ విధేయుడు అంబటి రాంబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ తక్షణం అమల్లోకి వస్తుందని ప్రకటించింది.

జగన్‌కు అనుకూలంగా ఉంటారన్న ముద్ర ఉన్న వీరప్ప మొయిలీకి అంతకు కొద్ది గంటల ముందే గట్టిగా క్లాస్ తీసుకుంది. అంతేకాక.. ఆయన నోటితోనే జగన్ వర్గంపై తొలి చర్యను ప్రకటింపచేసింది. ఓదార్పు యాత్రకు దూరంగా ఉండాలంటూ సంకేతాలు పంపాలని మొయిలీని ఆదేశించిన అధిష్ఠానం.. జగన్ వర్గీయుల జాబితా.. వారి నేపథ్యాల వివరాలను అందజేసే బాధ్యతనూ ఆయనకే అప్పగించింది.

ఈ వ్యవహారాలన్నింటినీ చర్చించేందుకు హస్తిన రావాలంటూ రోశయ్యకు కబురు పంపింది. అంతకుముందు ఓదార్పుపై మొయిలీ శుక్రవారం చేసిన వ్యాఖ్యలతో.. యాత్రలో పాల్గొనే నేతల సంఖ్య పెరిగింది. కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి పలువురు ప్రజా ప్రతినిధులు జగన్ యాత్రలో శనివారం పాల్గొన్నారు.

ఆ ఉత్సాహంలో "ఎవరో ఏదో చేస్తారని భయపడకుండా మీరంతా నాకు అండగా నిలబడుతున్నారు. ఇంతటి ఆప్యాయత చూపుతున్నందుకు అందరికీ కృతజ్ఞతలు'' అని ఆ ఎమ్మెల్యేలను ఉద్దేశించి చెప్పిన కడప ఎంపీ.. సాయంత్రానికి అధిష్ఠానం విసిరిన కొరడా దెబ్బకు కంగు తిన్నారు. యాత్ర మధ్యలోనే ఒక చోట కారు తన సన్నిహితులతో మంతనాలు జరిపారు.

జగన్‌పై చర్యలు ఉండవన్న మొయిలీకి అధిష్ఠానం క్లాస్ తీసుకున్న గంటల వ్యవధిలోనే అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. తనకు తన అనుయాయులకు ఏం భయం లేదని జగన్ చేసిన వ్యాఖ్యలను కూడా అధిష్ఠానం తీవ్రంగా పరిగణించిందని తెలుస్తోంది. జగన్‌పై క్రమశిక్షణ చర్యల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న తరుణంలో మొయిలీ ఈ వ్యాఖ్యలు చేయడం అధిష్ఠానానికి ఆగ్రహం తెప్పించింది.

దాంతో గతంలో మాదిరిగానే ఆయనతోనే నష్టనివారణ చర్యలు చేపట్టింది. దీంతో తన నిష్పాక్షికతను నిరూపించుకునేందుకన్నట్లు.. రాంబాబుపై వేటు వేస్తూ పీసీసీకి మొయిలీ ఉత్తర్వులు పంపారు. కాగా.. తనకు సస్పెన్షన్ ఉత్తర్వులు అందలేదని అంబటి ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి చెప్పారు. అధికారికంగా సమాచారం వచ్చాక స్పందిస్తానన్నారు.

ఎందుకలా చెప్పారు?
ఓదార్పు యాత్ర జగన్ వ్యక్తిగతమని, ఆయనపై క్రమశిక్షణ చర్యలు ఉండవని వీరప్ప మొయిలీ వ్యాఖ్యానించడాన్ని అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై సీనియర్ నేతలతో చర్చిస్తున్న సమయంలో ఈ ప్రస్తావన వచ్చిప్పుడు సోనియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఎందుకలా చెప్పారు? ఎవరిని అడిగి ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు? అంటూ మండిపడ్డారని ఆ వర్గాలు వివరించాయి.

ఆ వెంటనే సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్.. కేంద్ర న్యాయ మంత్రి వీరప్ప మొయిలీకి ఫోన్ చేసి, ఎందుకలా వ్యాఖ్యలు చేశారంటూ మందలించారని తెలిసింది. గతంలో ఒకసారి జగన్ విషయంలో అధిష్ఠానం నుంచి మొయిలీ అక్షింతలు వేయించుకున్నారు.

ఓదార్పు యాత్రకు అధిష్ఠానం సానుకూలంగా ఉందని తనతో మొయిలీ అన్నారని, ఆశీర్వదించి పంపారని జగన్ తన శ్రీకాకుళం యాత్రకు ముందు ఢిల్లీలో చెప్పారు. అయితే.. దానిపై సోనియా ఆగ్రహం వ్యక్తం చేయడం.. అహ్మద్ పటేల్ తనకు ఫోన్ చేయడంతో సాయంత్రానికి మీడియా ముందుకు వచ్చిన మొయిలీ.. తాను జగన్‌కు అలా చెప్పలేదని వివరణ ఇచ్చుకున్నారు.

కాగా.. మరోసారి ఇదే విషయంలో మొయిలీ అధిష్ఠానం ఆగ్రహానికి గురి కావడం విశేషం. మొయిలీ వ్యాఖ్యలు జగన్ వర్గానికి ఆత్మ విశ్వాసం కలిగించాయని, ఇక ఓదార్పు యాత్రకు పార్టీ నేతలు నిర్భయంగా హాజరవుతారని, దీని వల్ల మళ్లీ రాజకీయ సమస్యలు ఏర్పడతాయని పార్టీ నేతలు ఒకరిద్దరు అధిష్ఠానం దృష్టికి తీసుకురావడంతో ఈ మందలింపు వ్యవహారం జరిగిందని తెలిసింది.

అంతేకాక.. ఓదార్పు యాత్రకు హాజరు కావద్దన్న స్పష్టమైన సంకేతాలు పార్టీ నేతలకు పంపే బాధ్యతను కూడా మొయిలీకే అప్పగించినట్లు సమాచారం. వీటితో పాటు.. జగన్ వర్గీయులైన ఎమ్మెల్యేల గురించి, వారి నేపథ్యం గురించి కూడా సరైన సమాచారం అందించాలని మొయిలీని అధినాయకత్వం కోరినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

జగన్‌పై క్రమశిక్షణ చర్యలు ఉన్నా లేకపోయినా, ఆ విషయం బయటకు చెప్పనవసరం లేదని ఏఐసీసీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అధిష్ఠానం అనుమతి లేకున్నా.. కడప ఎంపీ జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేస్తున్న నేపథ్యంలో ఆయనపై చర్య తప్పకపోవచ్చని ఏఐసీసీ వర్గాలు ముందు నుంచి చెబుతూనే ఉన్నాయి.

కొంత సమయం వేచి చూసి.. ఆ తర్వాత తగిన చర్య తీసుకోవాలనే ఆలోచనలో అధిష్ఠానం ఉందన్న సంకేతాలూ వచ్చాయి. అయితే.. శుక్రవారం నగర పర్యటనకు వచ్చిన వీరప్ప మొయిలీ.. జగన్ యాత్ర వ్యక్తిగతమని, ఆయనపై క్రమశిక్షణ చర్యలు ఉండవని చేసిన వ్యాఖ్యలతో జగన్‌కు ఊరట లభించినట్లయింది. పలువురు ఎమ్మెల్యేలు జగన్ యాత్రలో చేరారు.

దీనిని అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. జగన్ ఓదార్పు యాత్ర ఇంకా కొనసాగుతున్నందువల్ల ఆయన వ్యవహార శైలిని ఇంకా పరిశీలించాల్సి ఉన్నదని, ఆయన విషయంలో నిర్ణయం తీసుకోవడంలో ఇప్పుడే తొందరపడకూడదనే అభిప్రాయంతో అధిష్ఠానం ఉన్నదని ఏఐసీసీ వర్గాలు అంటున్నాయి.

అంత మాత్రాన జగన్ కార్యకలాపాలను పూర్తిగా ఉపేక్షించినట్లు భావించరాదని స్పష్టం చేస్తున్నాయి. కాగా సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిని కలుసుకుని, రాష్ట్ర రాజకీయ పరిస్థితిపై చర్చించారు. 

జగన్ వర్గంలో కలవరం
సన్నిహితులతో కడప ఎంపీ మంతనాలు

పీసీసీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబుపై కాంగ్రెస్ అధిష్ఠానం సస్పెన్షన్ వేటు వేయడం కడప ఎంపీ వైఎస్ జగన్ వర్గానికి గట్టి షాక్‌నిచ్చింది. ఓదార్పు యాత్ర జగన్ వ్యక్తిగతమని, ఆయనపై క్రమశిక్షణ చర్యలన్నీ పత్రికల ఊహాజనితాలేననని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ ప్రకటించడంతో అంతా సద్దుమణిగిందని, పరిస్థితులన్నీ తమ 'దారి'కే వచ్చాయని జగన్ వర్గం భావిస్తున్న తరుణంలో.. అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం ఆ వర్గాన్ని కలవరానికి గురి చేసింది.

జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా, దాదాపు ఆయన అధికార ప్రతినిధిగా మెలగుతున్న అంబటి రాంబాబు.. ఇటీవల రోశయ్యపై పరుషమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వాటిని రోశయ్య, డీఎస్‌లు తీవ్రంగా పరిగణించారు. అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. క్రమశిక్షణరాహిత్యాన్ని మొగ్గలోనే తుంచేయాలని అధిష్ఠానం ఆదేశించింది కూడా.

ఈ నేపథ్యంలోనే పీసీసీ క్రమశిక్షణ సంఘం జారీ చేసిన షోకాజ్ నోటీసులతో కమిటీ ముందు హా జరైన అంబటి.. మరికొంత గడువు కోరారు. కమిటీ గడువు ఇచ్చింది కూడా. అయితే.. ఆ తర్వాత కూడా అంబటి ధిక్కార స్వరాన్నే వినిపించారు. దీంతో, అంబటి అంశాన్ని శుక్రవారం హైదరాబాద్ వచ్చిన మొయిలీకి పీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ సత్యనారాయణరాజు ఓ నివేదికను సమర్పించారు.

అదేసమయంలో, ఓదార్పుపై మొయిలీ వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీలో లక్ష్మణరేఖను దాటేవారి సంఖ్య అధికంగా ఉంటుందని అధిష్ఠానం ఆందోళన చెందింది. దీంతో ఈ వ్యవహారాన్ని మొగ్గలోనే తుంచేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే.. సమాధానం చెప్పడానికి ఇంకా గడువు ఉన్నా అంబటిపై వేటు వేసింది. ఈ విషయాన్ని మొయిలీతోనే చెప్పించింది.

తద్వారా.. కిందిస్థాయి నుంచి ఇన్‌చార్జి వరకూ ఎవరు గీత దాటినా కఠినంగానే వ్యవహరిస్తామం టూ పరోక్షంగా మొయిలీకి కూడా అధిష్ఠానం హెచ్చరికలు పంపిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంబటిపై చర్యల ద్వారా.. భవిష్యత్తులో జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొనే ప్రజాప్రతినిధులపైనా ఇదే వైఖరిని అవలంబించనున్నట్లు హెచ్చరికలను పంపిందని చెబుతున్నాయి.

అయితే, అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంపై తనవారిని కాపాడుకొనే విషయంలో వైఎస్ ఎప్పుడూ ముందుండేవారని.. ఆ యన తనయుడిగా ఇప్పుడు జగన్ ఎలా స్పందిస్తారోనన్న ఆసక్తి పార్టీలో నెలకొంది. అంబటిపై వేటు విషయం తెలిసిన వెంటనే.. ఓదార్పు యాత్రలో ఉన్న జగన్ తన సన్నిహితులు, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, నల్లమిల్లి శేషారెడ్డి, రాపాక వరప్రసాద్‌లతో శనివారం రాత్రి మంతనాలు జరిపారు.

రాజమండ్రి రూరల్ మండలంలోని నామవరంలో ఓదార్పు యాత్రకు బయలుదేరిన జగన్.. మార్గమధ్యలో కారు ఆపి ముగ్గురితోనూ ఐదు నిమిషాలు ప్రత్యేకంగా మాట్లాడారు. అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంపై కూలంకషంగా చర్చించినట్లు తెలిసింది.

Saturday, July 17, 2010

కీలక మలుపు * సర్దుకుపోదాం..రా.. ! * సామాజికవర్గాల సమీకరణం * 'ఓదార్పు' యాత్రలో యువ నాయకత్వం!

 కీలక మలుపు
జిల్లాలో కడప ఎంపీ జగన్‌మోహనరెడ్డి నిర్వహిస్తున్న ఓదార్పుయాత్ర అయిదోరోజుకు చేరుకుంది. అనూహ్యంగా శుక్రవారం రాత్రి సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ సామర్లకోటలో జగన్‌ను కలిశారు. దీంతో యాత్ర కీలక మలుపు తిరిగింది. బోస్ చేరికతో జగన్ బలం పుంజుకున్నట్టయింది. ఇప్పటికే తుని ఎమ్మెల్యే రాజా అశోక్‌బాబు, జగ్గంపేట ఎమ్మెల్యే తోట నరసింహం తమ తమ నియోజకవర్గాల్లో జగన్ వెంట ఓదార్పు యాత్రలో పాల్గొన్నారు.

రంపచోడవరం ఎమ్మెల్యే సత్యనారాయణరెడ్డి మాత్రమే కాంగ్రెస్ పార్టీ సూచనల మేరకు ఓదార్పు యాత్రకు దూరంగా ఉన్నారు. జిల్లాలో ఓదార్పు యాత్ర ముగిసే వరకు జగన్ వెంట బోస్ పర్యటించనున్నారు. గురువారం రాత్రి కిర్లంపూడిలో బసచేసిన జగన్ శుక్రవారం ఉదయం దివిలి నుంచి పర్యటన ప్రారంభించారు. పిఠాపురం, పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఏటిపట్టు గ్రామాల్లో యాత్ర కొనసాగించారు. తొలుత పిఠాపురం మండలం మంగితుర్తిలో యర్రవరపు రాజు కుటుంబాన్ని ఓదార్చారు.

విరవ, విరవాడ, మల్లాం, ఫకృద్దీన్‌పాలెం, కొత్త కందరాడల్లో యాత్ర కొనసాగించారు. సామర్లకోట మండలం చంద్రంపల్లి, నవర, పి.వేమవరం, ఉండూరుల్లో పర్యటించారు. కొత్త కందరాడలో ఎ.సుబ్బారావు కుటుంబాన్ని, చంద్రంపాలెంలో దమ్మాల చక్రం కుటుంబాన్ని, ఉండూరులో జి.వీర్రాజు కుటుంబాన్ని ఓదార్చారు.

సామర్లకోట, పెద్దాపురం పట్టణాల్లో కూడా జగన్ పర్యటించారు. మల్లాం, విరవాడ, ఫకృద్దీన్‌పాలెం, చంద్రంపాలెం, పి.వేమవరం, సామర్లకోట, పెద్దాపురం తదితర చోట్ల వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించి ప్రజలనుద్దేశించి ముక్తసరిగా మాట్లాడారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు తాను ప్రాధాన్య మిస్తున్నట్టు జగన్ తెలిపారు. తన యాత్రలో భాగంగా ముఖ్యనేతల ఇళ్లకు వెళ్లి మంతనాలు జరిపే కార్యక్రమా లను జగన్ కొనసాగిస్తున్నారు.

కిర్లంపూడిలో మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం ఇంట్లో బసచేసిన ఆయన శుక్రవారం ఉదయం వీరవరం వెళ్లి జగ్గంపేట ఎమ్మెల్యే తోట నరసింహం ఇంట్లో అల్పాహారం తీసుకున్నారు. యాత్రలో భాగంగా మధ్యాహ్నం విరవాడలో పిఠాపురం మండల పరిషత్ అధ్యక్షుడు రాంబాబు ఇంట్లో భోజనం చేశారు. రెండుచోట్ల చాలాసేపు జగన్ గడపడం విశేషం. జగన్‌ను కలిసేందుకు జిల్లా కాంగ్రెస్ నేతలు పలువురు కిర్లంపూడి వచ్చారు. మాజీ మంత్రి సంగీత వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బిక్కిన కృష్ణార్జునచౌదరి, వడ్డి వీరభద్రరావు తదితరులు జగన్‌ను కలిపారు. మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యేలు తోట గోపాలకృష్ణ, వరుపుల సుబ్బారావు జగన్ వెంట యాత్రలో పాల్గొన్నారు.

శాసనమండలి సభ్యుడు వైఎస్ వివేకానందరెడ్డి (వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు) కిర్లంపూడి వచ్చి జగన్‌ను పరామర్శించారు. పిఠాపురం మండలం ఫకృద్దీన్‌పాలెంలో జగన్‌ను కలిసిన భద్రాచలం ఎమ్మెల్యే సత్యవతి ఓదార్పుయాత్రకు సంఘీభావం తెలిపారు. గ్రూపు రాజకీయాల కారణంగా ఒకరిద్దరు నేతలు మౌనంగా ఉన్నప్పటికీ పిఠాపురం, పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తిస్థాయిలో కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు జగన్ యాత్రలో పాల్గొనడం గమనించాల్సిన విషయం.
జిల్లాలో బలమైన సామాజికవర్గాలకు చెందిన నేతలను సమీకరించేందుకు జగన్ తాపత్రయపడుతున్నారు. ఇందులో భాగంగానే తొలుత ఏడు రోజులు నిర్వహించాలని భావించిన 'ఓదార్పు' యాత్రను పొడిగించనున్నట్టు తెలుస్తోంది. కోనసీమకు చెందిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ మంత్రులు జక్కంపూడి రామ్మోహనరావు, ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే తోట గోపాలకృష్ణ జిల్లాలో బలమైన సామా జికవర్గాలకు చెందిన నేతలుగా వున్నారు.

జిల్లా రాజకీయాల్లో సామా జికవర్గాలను బేరీజు వేసుకునే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల్లో టికెట్లు కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. ఇటీవలి కాలంలో ఈ సామాజికవర్గ రాజకీయాలకు ప్రాధాన్యత గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో జిల్లాలో 'ఓదార్పు' యాత్ర నిర్వహిస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి త నయుడు, కడప ఎంపీ జగన్ కూడా రాజకీయంగా బలమైన ముద్ర వేసుకునేందుకు తన వెనుక బలమైన సామాజికవర్గ నేతలు ఉన్నారన్న సంకేతాలు పంపేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

జిల్లా కాంగ్రెస్ పార్టీలో జగన్ ఇప్పటికే మెజార్టీ నేతల మద్దతు కూడగట్టుకోగలిగారు. పదకొండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఇంచుమించు అందరూ జగన్‌కు అనుకూలంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ముగ్గురు ఎంపీల్లో రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఇప్పటికే జిల్లాకు వచ్చిన జగన్‌ను పలకరించారు. కాకినాడ ఎంపీ పళ్లంరాజు జగన్ ఓదార్పుపై, ఆయన రాజకీయ వ్యవహారాలపై మౌనం వహిస్తున్నారు. అ మలాపురం ఎంపీ జీవీ హర్షకుమార్, జగన్ ఎంపీ కాకముందు కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో హర్షకుమార్ సామాజిక వర్గానికే చెందిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జగన్‌కు అనుకూలంగా బహిరంగంగానే మాట్లాడుతున్నారు.

జిల్లాలో మరో బలమైన సామాజిక వర్గానికి చెందిన మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ అధిష్ఠానం వార్నింగ్ ఇచ్చినా జగన్ వెంటే ఉంటానని ముందు నుంచీ స్పష్టం చేస్తూ వస్తున్నారు. బోస్‌కు బలమైన సామాజికవర్గ నేపథ్యం ఉంది. జిల్లా రాజకీయాల్లో ఆరు దశాబ్దాలుగా కీలకపాత్ర పోషిస్తున్న సామా జికవర్గానికి చెందిన మాజీ మంత్రులు జక్కంపూడి రామ్మోహనరావు, ముద్రగడ పద్మనాభం కూడా జగన్‌కు అండగా నిలబ డ్డారు.

వీరితో పాటు పెద్దాపురం మాజీ ఎమ్మెల్యే తోట గోపాల కృష్ణ, జగ్గంపేట ఎమ్మెల్యే తోట నరసింహం తదితరులు కూడా జగన్‌కు మద్దతు తెలుపుతున్నారు. దీంతో జగన్ పలువురు నేతల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

'ఓదార్పు' యాత్రలో యువ నాయకత్వం!

 దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు జగన్మోహన్‌రెడ్డి చేపడుతున్న ఓదార్పు యాత్ర ఏర్పాట్లు చేయడంలో యువనాయకత్వం తాజాగా తెరపైకి వస్తుంది. ఆయా నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, తనయులు, యువనాయకులు జగన్మోహన్‌రెడ్డి యాత్ర ఏర్పాట్లలో సీనియర్లను సైతం పక్కన పెట్టి ముందడుగు వేస్తున్నారు. దీనికి తోడు జగన్మోహన్‌రెడ్డితో వైఎస్ఆర్ విగ్రహాలు ఆవిష్కరించాలన్న అభిమానుల అత్యుత్సాహం అనేక చోట్ల వివాదాలకు ఆజ్యం పోస్తుంది.

పబ్లిక్ స్థలాల్లోను, అభ్యంతరకరమైన ప్రదేశాల్లోను, ముఖ్యంగా భవిష్యత్‌లో ఆయా ప్రాంతాల అభివృద్ధికి నిరోధకంగా మారే చోట్ల వైఎస్ విగ్రహాలను కాంగ్రెస్ నాయకులు ఇబ్బడిముబ్బడిగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా ఐదవ నెంబరు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న పోలీస్‌స్టేషన్ వద్దే దివంగత నేత వైఎస్ఆర్, మాజీ ఎమ్మెల్యే చిర్ల సోమసుందరరెడ్డి విగ్రహాలను ఏర్పాటు చేయడానికి యుద్ధప్రాతిపదికన సన్నాహాలు చేస్తున్నారు. అయితే రాజకీయ వివాదాల నేపథ్యంలో పోలీసులు సైతం అక్కడ పెట్టే విగ్రహాల విషయంలో చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్న విషయం మరింత వివాదమవుతుంది.

అదే రీతిలో అమలాపురంలోని హైస్కూల్ సెంటర్‌లో 214 జాతీయ రహదారి మధ్యలో భారీ స్థూపాన్ని నిర్మించి విగ్రహ ఏర్పాట్లకు మంత్రి విశ్వరూప్ అనుచర గణం సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే సెంటర్‌లో వెలుగునిచ్చే ఐ-మ్యాక్స్ లైట్లను తొలగించి విగ్రహం ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. భవిష్యత్‌లో పాశర్లపూడి-బోడసకుర్రు వంతెన పూర్తయితే ఈ సెంటర్‌లో నిర్మించిన వైఎస్ విగ్రహం ప్రధాన సమస్యగా మారే అవకాశముందని జాతీయ రహదారుల శాఖ అధికారులు లోలోపలే మదనపడుతున్నారు. ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి సెంటర్‌లో అంబేద్కర్ విగ్రహం సమీపాన వైఎస్ విగ్రహా ఏర్పాటు చేయాలన్న కాంగ్రెస్ నాయకులు చర్యలను ఆ ప్రాంత దళితులు అడ్డుకోవడం ద్వారా నిలిచిపోయింది.

అదే విధంగా చల్లపల్లి శివారు బొండాడిపేటలో వైఎస్ జగన్‌తో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని పలువురు కాంగ్రెస్ నాయకులు చేసిన ప్రతిపాదనను మరికొందరు దళిత నాయకులు తీవ్రంగా ప్రతిఘటించడంతో వివాదం ప్రారంభమైంది. అదే రీతిలో కొత్తపేట, ముమ్మిడివరం, రాజోలు నియోజకవర్గాల పరిధిలో రహదారుల చెంత కాంగ్రెస్ పార్టీ అధికారులు నిర్మిస్తున్న వైఎస్ఆర్ విగ్రహాలు భవిష్యత్‌లో వివాదాస్పదం కానున్నాయి.

ప్రస్తుతం నెలకొల్పుతున్న విగ్రహాల చెంతనే దివంగత తెలుగుదేశం నేత ఎన్టీఆర్‌తో పాటు దళిత నాయకుల విగ్రహాలను ఆయా కూడళ్లలో ఏర్పాటు చేయడానికి ప్రత్యర్థులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కోనసీమలో వేలాది విగ్రహాలు ఉన్న తరుణంలో వైఎస్ఆర్ విగ్రహాలు ఎక్కడికక్కడ ఏర్పాటు చేయడం వల్ల కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీల మధ్య వివాదాలకు నాంది పలికే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

యువ నాయకత్వం హడావుడి:
జగన్ కోనసీమ పర్యటన నేపథ్యంలో కొత్త తరం యువజన కాంగ్రెస్ నాయకులు హడావుడి చేస్తున్నారు. భారీగా తమతమ ఫొటోలతో జగన్‌కు స్వాగతం పలుకుతూ ఫ్లెక్స్‌లను ఏర్పాటు చేస్తున్నారు. మంత్రి విశ్వరూప్ తనయుడు కృష్ణార్జున రెడ్డి జగన్ యాత్ర ఏర్పాట్లలో అనుచర గణంతో బిజీగా ఉన్నారు. మంత్రి తనయుడు సెంటర్‌లో ఓ భారీ ఫ్లెక్స్‌ను ఏర్పాటుచేశారు. అదే రీతిలో కాంగ్రెస్ నాయకుని తనయుడు కె.మదన్ భారీ ఫ్లెక్స్‌బోర్డును ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఏర్పాట్లకు దూరంగా ఉన్న గన్నవరం నియోజకవర్గ నాయకులు జగన్ ఏర్పాట్లపై దృష్టిపెట్టారు. అలాగే చిర్ల జగ్గిరెడ్డి, కేవీ సత్యనారాయణరెడ్డిలు కొత్తపేట నియోజక వర్గంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
సర్దుకుపోదాం..రా.. !
jagan-delhi
రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న ఉత్కంఠ పరిణామాలు కొత్త మలుపు తిరిగాయి. ఇంతవరకూ అధిష్ఠానాన్ని ధిక్కరిం చి ఓదార్పు యాత్రలో ఉన్న కడప ఎంపీ వైఎస్‌ జగన్‌పై చర్యలు ఉంటాయని భావిస్తూ వచ్చిన వారి అంచనాలు తారుమారయ్యాయి. ఆయనపై ఎలాంటి చర్యలూ ఉం డవని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జీ వీరప్ప మొయిలీ అధికారికంగా ప్రకటించడంతో కాంగ్రెస్‌ రాజకీయాల వేడి ప్రస్తుతానికి చల్లారే సూచనలు కనిపి స్తున్నాయి.

శుక్రవారం నగరానికి వచ్చిన మొయిలీ.. ఓదార్పు యాత్ర జగన్‌ వ్యక్తిగత వ్యవహారమయినందున, ఆయ నపై ఎలాంటి చర్యలూ ఉండవని స్పష్టం చేయడం పరిశీ లిస్తే.. జగన్‌పై అధిష్ఠానం వైఖరిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. జగన్‌ ఓదార్పు యాత్రలో కాంగ్రెస్‌ ద్వితీయ శ్రేణి నేతలే ఎక్కువగా రావడం, వారంతా జగ న్‌ పార్టీ పెడితే వెళ్లిపోతామంటూ విస్పష్టంగా ప్రకటించ డం, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అధిష్ఠానం మాట ను ఖాతరు చేసే పరిస్థితి కనిపించకపోవడం వంటి అం శాలను నాయకత్వం పరిగణనలోకి తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.

SONజగన్‌ యాత్రకు వచ్చిన జాతీయ మీడి యా ప్రతినిధుల ద్వారా క్షేత్రస్థాయి సమాచారం తెలు సుకున్న అధిష్ఠానం, వాటిని పరిగణనలోకి తీసుకున్న ట్లు కనిపిస్తోంది. అయితే, జగన్‌పై అటు కఠినంగా వ్యవహరించకుండా, ఇటు మరీ జారిపోకుండా ఉండే లా వ్యూహం రూపొంది స్తున్నట్లు పార్టీ వర్గాలు విశ్లేషిస్తు న్నాయి. జగన్‌ తనంత ట తాను పార్టీ నుంచి బయటకు వెళ్లే వరకూ అతడిని రెచ్చకొట్టకూడదని, యాత్ర వ్యవ హారంపై మరీ ప్రతిష్ఠకు పోకుండా చూసీ చూడనట్లు వ్యవహరించాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు మారిన పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

జగన్‌ వెంట ఆశించి నంత సంఖ్యలో ఎమ్మెల్యే, ఎంపీలు వెళ్లకపోయినా.. పార్టీకి పునాదిరాళ్లయిన ద్వితీయ శ్రేణి నేతలు జగన్‌ వైపు కదులుతుండటంపైనే నాయకత్వం ప్రధానంగా దృష్టి సారించి, తన వైఖరిని తాత్కాలికంగా మార్చుకున్న ట్లు తెలుస్తోంది. వైఎస్‌ మృతి చెందిన తర్వాత జనాకర్ష క శక్తి ఉన్న నేత పార్టీలో ఎవరూ లేకపోవడం, ప్రస్తుతా నికి జగన్‌ ఒక్కరే ప్రత్యామ్నాయ జనాకర్షక శక్తి ఉన్న నేతగా కనిపిస్తుండటంతో.. జగన్‌ వ్యవహారాన్ని తెగేదా కా లాగి, రెచ్చగొట్టడం వల్ల పార్టీకే నష్టమన్న భావనతో నాయకత్వం మనసు మార్చుకున్నట్లు పార్టీ వర్గాలు విశ్లే షిస్తున్నాయి.

MOHILI యువకుడయి నందున జగన్‌ను ఎంత రెచ్చగొడితే అంత రెచ్చిపోయే ప్రమాదం ఉందన్నదీ అధి ష్ఠానం గ్రహించినట్లు కనిపి స్తోంది. ఇన్ని కారణాలు సమీక్షించుకున్న తర్వాతనే జగన్‌ యాత్రపై చూసీ చూడ నట్లు వదిలేయాలని నిర్ణయించింది. జగన్‌ యాత్రలో ద్వితీయ శ్రేణి నేతలు అధికంగా ఉన్న విషయాన్ని గ్ర హించిన నాయకత్వం.. వారు బయటకు వెళితే పార్టీకే నష్టమని, ఇప్పటికే ఎమ్మెల్యేలు అభ ద్రతాభావంతో ఉన్న వాస్తవాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంది. ద్వితీ య శ్రేణి నేతలు జారిపోతారన్న భయంతోనే ఎమ్మెల్యే లు యాత్రకు వెళుతున్న అనివార్య, అయోమయ పరిస్థి తి నుంచి ఎమ్మెల్యేలను బయట పడవేసేందుకే అధిష్ఠా నం జగన్‌కు ప్రస్తుతానికి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలుస్తోంది.

సోనియాకు సీనియర్లే తప్పుదోవ వట్టించారు

వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్రపై యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీని కొంత మంది సీనియర్లే తప్పుదోవ పట్టించా రని కడప ఎమ్మెల్సీ వైఎస్ వివేకానంద రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ప్రముఖ శిల్పి వడయార్ శిల్పకళాశా లకు విచ్చేసి పులివెందులలో ఏర్పాటు చేసేందుకు తయారు చేస్తున్న దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 18 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆయన పరిశీలించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ జగన్ ఓదార్పు యాత్ర కాంగ్రెస్ పార్టీ తరఫున చేపడితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమ య్యేదన్నారు. వైఎస్ కుటుంబం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఎల్లప్పుడూ పాటుపడిందని పేర్కొన్నారు. ఓదార్పు యాత్ర విషయంలో కొందరు సీనియర్లు కావాలనే అధిష్టానాన్ని తప్పుదోవ పట్టించారని ఆరోపించారు.

అయితే ఓదార్పు యాత్రతో జగన్ వేరే పార్టీ పెడతారని వస్తున్న ప్రచారంలో ఎంత మాత్రం వాస్తవం లేదని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికే తాము పాటుపడతామని వివేకానంద రెడ్డి స్పష్టం చేశారు. ఆయన వెంట కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, కాంగ్రెస్ బ్లాక్ వన్ అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్‌రాజు, మాజీ ఏఎంసీ వైస్‌చైర్మన్ మార్గన గంగాధరరావు, రుద్రరాజు రవివర్మ తదితరులున్నారు. 

వ్యూహకర్తలెవరు? జగన్ పర్యటనపై ఇంటెలిజెన్స్ ఆరా

జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వ హస్తున్న కడప ఎంపీ వైఎస్ జగన్మో హనరెడ్డి వెనుక వ్యూహకర్తలు ఎవర న్న అంశంపై ఇంటెలిజెన్స్ అధికారు లు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశే ఖరరెడ్డికి అత్యంత ఆదరణ చూపిన జిల్లాగా తూర్పు గోదావరి అంటే ఎన లేని అభిమానం. అదే రీతిలో ఆయన తనయుడు జగన్‌కు కూడా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బ్రహ్మ రథం పడుతున్నారు. జగన్ జిల్లాలో ఓదార్పు నిర్వహిస్తున్న సమయంలో నే అనేక పరిణామాలు చోటుచేసుకుం టున్నాయి.

వైఎస్‌కు అత్యంత అను యాయుడిగా పేరొందిన రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ జగన్ ను కలవడంపై అహ్మద్ పటేల్ వివర ణ అడిగినట్టు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఉండవల్లి, మరికొంత మంది కీలక నేతలు జగన్ ఓదార్పు లో పాల్గొనడానికి కాస్త ఇబ్బంది ప డుతున్నారు. ఇదే సమయంలో జగన్ 'ఓదార్పు'లో ప్రసంగాలను రూపొం దిస్తున్న నేతలు ఎవరు? తర్వాత పార్టీ పెడితే అనుసరించాల్సిన వ్యూహాలు ఏమిటి? వీటిని ఎవరు రూపొం దిస్తున్నారు? అనే కోణంలో ఇంటెలి జెన్స్ అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.

జిల్లాలో జగన్ యాత్ర జరుగుతున్న ప్రాంతాలతో పాటు కాకి నాడ, రాజమండ్రి, అమలాపురం లో క్‌సభ స్థానాల వారీగా జగన్‌కు అను కూలంగా వున్న నేతల వివరాలపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. జగన్ కు సన్నిహితుడిగా పేరొందిన కాకినా డ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, ఎమ్మెల్యేలు రాపాక వరప్రసాద్, నల్లమిల్లి శేషారెడ్డి, మాజీ మంత్రులు జక్కంపూడి రామ్మోహనరావు,

ముద్ర గడ పద్మనాభం వంటి నేతలు జగన్ పార్టీ పెడితే బలమైన వర్గంగా తయా రవుతారన్న కోణంలో కూడా ఇంటెలి జెన్స్ సమాచారం సేకరిస్తున్నట్టు చె ప్తున్నారు. జగన్ పార్టీ ఏర్పాటు చేస్తే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర కీలక నేతల్లో ఎవరెవరు యువ నేత వెంట నిలబడతారు? వ్యతిరేక వర్గంలో ఉంటారు అన్న అంశంపైనా చర్చ జరుగుతోంది.